CM Chandrababu: ఓటు ద్వారా రాజ్యాంగాన్ని కాపాడుకోగలుగుతున్నాం..
- ఏపీ సెక్రటేరియట్ లో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు..
- పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
- ఓటు ద్వారా రాజ్యాంగాన్ని కాపాడుకోగలుగుతున్నాం..
- ఎవరైనా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తే ఓటుతో సమాధానం చెబుతారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఓటు ద్వారా రాజ్యాంగాన్ని కాపాడుకోగలుగుతున్నాం.. ఎవరైనా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తే ఓటుతో ప్రజలు సమాధానం చెబుతారని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏపీ సెక్రటేరియట్ లో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, పొంగూరు నారాయణ, సవిత, ఏపీ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్, వివిధ శాఖల ఛీఫ్ సెక్రెటరీలు, సెక్రెటరీలు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజును కూడా మనం జరుపుకుంటున్నాం.. అన్ని మతాల వారి మత పూజలు, ప్రార్ధనలు చేస్తారు.. అలాగే మన రాజ్యాంగం అన్ని మతాలకు పవిత్ర గ్రంథం అని స్పష్టం చేశారు.. వినూత్న భావనతో ఆలోచించడం మానేశాం.. చాలా దశాబ్దాలు మనం ఆధారపడే వారుగానే ఆలోచించాం.. రాజ్యాంగం రాసుకోవడం చేతనవుతుందా అని అవహేళన చేసిన రోజు నుంచీ రాజ్యాంగం రచించుకున్నాం.. ప్రపంచ దేశాల రాజ్యాంగాలు చదివారు.. భవిష్యత్తులో వచ్చే సవాళ్లను కూడా ఊహించి రచించారు. 299 మంది విశిష్ఠ వ్యక్తులు ఒక సభగా ఏర్పడి రచించిన రాజ్యాంగం మనది అన్నారు సీఎం చంద్రబాబు..
Read Also: Old Bridge Collapse: కూలిన 150 సంవత్సరాల పురాతన వంతెన..
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Deputy CM Pawan Kalyan: గోదావరి కాలుష్యంపై సమగ్ర అధ్యయనం.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
- Andhra Pradesh: గుడ్న్యూస్.. ఉల్లి నుంచి బియ్యం వరకు.. నిత్యావసర ధరల తగ్గింపునకు ప్లాన్.. కిలో ఉల్లి రూ.35కే..
- AP Cabinet Decisions: రైతులకు గుడ్న్యూస్.. అమరావతిపై ఫోకస్.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
పదకొండు మంది ఏపీ నుంచీ రాజ్యాంగ రచనా సభలో ఉండటం విశేషం అన్నారు సీఎం చంద్రబాబు.. ఏపీలో పుట్టి రాజ్యాంగ రచన చేసిన వారికి కూడా నివాళులర్పించాలి.. సాంఘిక ఆర్దిక రాజకీయ న్యాయాన్ని మనం నేర్చుకోవాలి.. అవకాశాల్లో సమానత్వం మనం కచ్చితంగా అనుసరించాలి.. ఎంత మంచి రాజ్యాంగం ఉన్నా అమలు చేసే వారు మంచి వారు కాకపోతే అది చెడుగా మారుతుందని పేర్కొన్నారు.. ఐఏఎస్ లు, ఐపీఎస్ లు, రాజకీయ నాయకులు రాజ్యాంగాన్ని నెమరువేసుకునే పరిస్ధితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!