CM Chandrababu: ఓటు ద్వారా రాజ్యాంగాన్ని కాపాడుకోగలుగుతున్నాం..
- ఏపీ సెక్రటేరియట్ లో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు..
- పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
- ఓటు ద్వారా రాజ్యాంగాన్ని కాపాడుకోగలుగుతున్నాం..
- ఎవరైనా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తే ఓటుతో సమాధానం చెబుతారు..
CM Chandrababu: ఓటు ద్వారా రాజ్యాంగాన్ని కాపాడుకోగలుగుతున్నాం.. ఎవరైనా రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తే ఓటుతో ప్రజలు సమాధానం చెబుతారని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఏపీ సెక్రటేరియట్ లో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, పొంగూరు నారాయణ, సవిత, ఏపీ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్, వివిధ శాఖల ఛీఫ్ సెక్రెటరీలు, సెక్రెటరీలు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజును కూడా మనం జరుపుకుంటున్నాం.. అన్ని మతాల వారి మత పూజలు, ప్రార్ధనలు చేస్తారు.. అలాగే మన రాజ్యాంగం అన్ని మతాలకు పవిత్ర గ్రంథం అని స్పష్టం చేశారు.. వినూత్న భావనతో ఆలోచించడం మానేశాం.. చాలా దశాబ్దాలు మనం ఆధారపడే వారుగానే ఆలోచించాం.. రాజ్యాంగం రాసుకోవడం చేతనవుతుందా అని అవహేళన చేసిన రోజు నుంచీ రాజ్యాంగం రచించుకున్నాం.. ప్రపంచ దేశాల రాజ్యాంగాలు చదివారు.. భవిష్యత్తులో వచ్చే సవాళ్లను కూడా ఊహించి రచించారు. 299 మంది విశిష్ఠ వ్యక్తులు ఒక సభగా ఏర్పడి రచించిన రాజ్యాంగం మనది అన్నారు సీఎం చంద్రబాబు..
Read Also: Old Bridge Collapse: కూలిన 150 సంవత్సరాల పురాతన వంతెన..
Also Read
- AP High Court Serious: సీనియర్ ఐఏఎస్ అధికారిపై హైకోర్టు సీరియస్.. మాకే అధికారముంటే ఈ క్షణాన్నే సస్పెండ్..!
- MLC Jayamangala Venkataramana: ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా తిరస్కరణ..
- AP Heatwave: ఏపీలో పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. రేపు జాగ్రత్త అంటూ విపత్తుల నిర్వహణ సంస్థ వార్నింగ్..
- YS Jagan: గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ప్రభుత్వ మద్దతు తగ్గుతోంది.. జగన్ ఆవేదన..
పదకొండు మంది ఏపీ నుంచీ రాజ్యాంగ రచనా సభలో ఉండటం విశేషం అన్నారు సీఎం చంద్రబాబు.. ఏపీలో పుట్టి రాజ్యాంగ రచన చేసిన వారికి కూడా నివాళులర్పించాలి.. సాంఘిక ఆర్దిక రాజకీయ న్యాయాన్ని మనం నేర్చుకోవాలి.. అవకాశాల్లో సమానత్వం మనం కచ్చితంగా అనుసరించాలి.. ఎంత మంచి రాజ్యాంగం ఉన్నా అమలు చేసే వారు మంచి వారు కాకపోతే అది చెడుగా మారుతుందని పేర్కొన్నారు.. ఐఏఎస్ లు, ఐపీఎస్ లు, రాజకీయ నాయకులు రాజ్యాంగాన్ని నెమరువేసుకునే పరిస్ధితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!