Old Bridge Collapse: కూలిన 150 సంవత్సరాల పురాతన వంతెన..
- కూలిన 150 సంవత్సరాల పురాతన వంతెన..
- కాన్పూర్లో దాదాపు 150 ఏళ్ల నాటి గంగా వంతెన.
Old Bridge Collapse: కాన్పూర్లో దాదాపు 150 ఏళ్ల నాటి గంగా వంతెనలో కొంత భాగం ఈ ఉదయం (మంగళవారం) కూలిపోయింది. స్వాతంత్య్ర పోరాటానికి సాక్షిగా నిలిచిన ఈ వంతెన ఒకప్పుడు కాన్పూర్ను లక్నోతో కలుపుతూ ఉండేది. అయితే, ఈ వంతెనను కాన్పూర్ పరిపాలన నాలుగు సంవత్సరాల క్రితం ట్రాఫిక్ దృష్ట్యా మూసివేసింది. గంగా వంతెనకు చారిత్రక ప్రాధాన్యత ఉంది. అందుకే, మున్సిపల్ కార్పొరేషన్ దీనిని నిర్వహిస్తోంది. వారసత్వ సంపదగా చూపేందుకు కోట్లాది రూపాయలు వెచ్చించి సుందరీకరణ చేశారు. అయితే మంగళవారం వంతెనలో కొంత భాగం (సుమారు 80 అడుగులు) కూలిపోయి గంగా జలాల్లో మునిగిపోయింది.
Also Read: Eknath Shinde: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ సిండే రాజీనామా..
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
ఈ గంగా వంతెన ప్రత్యేకత ఏమిటంటే.. పైన వాహనాలు, సైకిళ్లు వెళ్ళేవి. పాదచారులు కిందకు వెళ్లేవారు. బ్రిటిష్ హయాంలో ఈ వంతెన కాన్పూర్ నుండి లక్నో వెళ్లే ఏకైక మార్గంగా ఉండేది. ప్రజలు కాన్పూర్, తరువాత లక్నో నుండి ఉన్నావ్లోకి ప్రవేశించేవారు. అయితే, స్తంభాలకు పగుళ్లు రావడంతో ప్రజల భద్రతకు ముప్పుగా భావించి PWD వంతెనను మూసివేసింది. శుక్లగంజ్, కాన్పూర్ రెండు చివర్లలో గోడలు పెంచడంతో ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి.
Also Read: President Droupadi Murmu: పార్లమెంటులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికిన లోక్సభ స్పీకర్
కాన్పూర్ నుండి శుక్లగంజ్ వెళ్లే మార్గంలో గంగా నదిపై నిర్మించిన ఈ బ్రిటిష్ కాలం నాటి వంతెన కూడా స్వాతంత్య్ర పోరాటానికి సాక్షిగా నిలిచింది. ఒకసారి విప్లవకారులు గంగానదిని దాటుతున్నప్పుడు బ్రిటిష్ వారు ఈ వంతెనపై నుంచి కాల్పులు జరిపారు. కొన్ని సంవత్సరాల క్రితం ఈ వంతెన మూసివేయబడినప్పుడు, ఉన్నావ్ లోని శుక్లగంజ్లో నివసిస్తున్న 10 లక్షల మంది జనాభాపై ప్రభావం చూపింది. ఉన్నావ్ ప్రాంతం నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రుల వరకు దీన్ని ప్రారంభించడానికి పోటీ పడ్డారు. అయితే, దీనిని పరిశీలించిన తర్వాత ఈ వంతెన శిథిలావస్థకు చేరుకుందని, నడవడానికి సరిపోదని, ఎప్పుడైనా కూలిపోవచ్చని కాన్పూర్ ఐఐటీ తెలిపింది. ఆ తర్వాత ఈ వంతెనను ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం పూర్తిగా నిరాకరించింది. ఈరోజు అదే విషయం నిజమైంది. గంగా వంతెనలో ఎక్కువ భాగం తెల్లవారుజామున కూలిపోయింది. వంతెన పైన సిమెంటుతో ఉండగా కింద ఇనుముతో నిర్మించారు. వంతెనకు పగుళ్లు ఎక్కువగా ఉన్నాయని, అందుకే పూర్తిగా మూసివేశామని పోలీసులు చెబుతున్నారు. కాన్పూర్ని ఉన్నావ్-లక్నోతో కలిపేలా బ్రిటీష్ వారు 1875లో ఈ గంగా వంతెనను నిర్మించారని సమాచారం. ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన ఇంజనీర్లు నిర్మాణ పనులు చేపట్టగా.. దీన్ని తయారు చేయడానికి 7 సంవత్సరాల 4 నెలలు పట్టిందని రికార్డ్స్ చెబుతున్నాయి.
#उन्नाव में गंगा नदी पर अंग्रेजों के जमाने का ऐतिहासिक डबल स्टोरी पुल का एक हिस्स ढह गया।
पुल की जर्जर स्थिति को देखते हुए तीन साल पहले ही इस पर आवागमन बंद कर दिया गया था।
करीब 150 साल पहले अंग्रेजों द्वारा निर्मित यह पुल कानपुर और उन्नाव को जोड़ने के लिए बनाया गया था।… pic.twitter.com/RTcllvGqb5
— Vinay Saxena (@vinaysaxenaj) November 26, 2024
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో