Liquor Sales: మందుబాబులకు ఏపీ సర్కార్ శుభవార్త.. అర్ధరాత్రి వరకు లిక్కర్ అమ్మకాలు
- మందుబాబులకు గుడ్న్యూస్ చెప్పిన సర్కార్..
- అర్ధరాత్రి 1 గంట వరకు మద్యం అమ్మకాలను అనుమతి..
- డిసెంబర్ 31వ తేదీతో పాటు.. జనవర్ 1వ తేదీన కూడా అనుమతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Liquor Sales: మందుబాబులకు గుడ్న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. 2024కు గుడ్బై చెప్పి.. 2025కి స్వాగతం పలికేందుకు అంతా స్వాగతం సిద్ధం అవుతోన్న తరుణంలో.. మద్యం అమ్మకాలు జోరుగా సాగుతాయనే అంచనాలు ఉన్నాయి.. అయితే, మద్యం అమ్మకాలకు ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని అర్ధరాత్రి వరకు లిక్కర్ సేల్స్కు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.. నూతన సంవత్సరం సందర్భంగా మద్యం అమ్మకాల సమయాన్ని ఎక్సైజ్ శాఖ పెంచింది. మద్యం షాపులు, బార్లు, క్లబ్లు, ఈవెంట్లకు రాత్రి ఒంటిగంట వరకు అనుమతిచ్చింది. సాధారణంగా ప్రతీరోజు రాత్రి 10 గంటల వరకు మద్యం అమ్మకాలు జరుగుతాయి. అయితే, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో మద్యం వినియోగం ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో.. మద్యం షాపులు, బార్లు అందుబాటులో లేకపోతే మందుబాబులు బెల్టు షాపుల్లో అధిక ధరలకు మద్యం కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంటుందని భావించిన ప్రభుత్వం.. అర్ధరాత్రి 1 గంట వరకు మద్యం అమ్మకాలను అనుమతి ఇచ్చింది.. డిసెంబర్ 31వ తేదీతో పాటు.. జనవర్ 1వ తేదీన కూడా అర్ధరాత్రి 1 గంటల వరకు మద్యం అమ్మకాలను అనుమతి ఇచ్చింది సర్కార్.. అయితే, ఇప్పటికే బెల్టు షాపుల ద్వారా మద్యం విక్రయాలు జరిగితే బెల్ట్ తీస్తానంటూ సీఎం చంద్రబాబు హెచ్చరించిన విషయం విదితమే..
Also Read
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
కాగా, ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లిక్కర్ సేల్స్ భారీగా పెరిగినట్టు ఎక్సైజ్ శాఖ చెబుతోంది.. ప్రైవేట్ లిక్కర్ షాపులు అందుబాటులోకి వచ్చిన తర్వాత అంటే.. ఈ ఏడాది అక్టోబర్ 16వ తేదీ నుంచి డిసెంబర్ 29వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 6,312 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్టు ఏపీ ఎక్సైజ్ శాఖ ప్రకటించింది.. ఈ 75 రోజుల కాలంలో 26,78,547 కేసులు బీర్ల అమ్మకాలు సాగగా.. 83,74,116 కేసుల మద్యం అమ్మినట్టు చెబుతున్నారు. బార్లు, వైన్ షాపులకు కలిపి ఈ అమ్మకాలు జరిగినట్టు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది.. ఇక, డిసెంబర్ 31, జనవరి 1కి సంబంధించి వచ్చిన ఇండెంట్ బట్టి ఈ రోజుకి ఆరోజు సరుకు పంపుతున్నట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు..
తాజావార్తలు
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
YS Jagan: ప్రశ్నించే ప్రతి ఒక్కరూ ‘కాక్రోచ్లే’.. నేను కూడా వారిలో ఒకడిని!
-
Supreme Court: ‘గృహిణులు జాతి నిర్మాతలు’.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడు.. అదుపులోకి ఏ1 నిందితుడు రాజ్ కేశిరెడ్డి.!
-
6G Technology In India: 5Gకి మించి.. 6G కోసం సిద్ధమవుతున్న భారత్.. కేంద్రం మాస్టర్ ప్లాన్
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?