MLA Adimulam case: ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో కీలక పరిణామాలు..
- ఆసుపత్రి నుంచి ఎమ్మెల్యే ఆదిమూలం డిశ్చార్జ్..
- టెస్ట్ లకు అంగీకరించి ఆస్పత్రిలో చేరిన బాధిత మహిళ..
- హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Adimulam case: సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో తాజాగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.. ఎమ్మెల్యే ఆదిమూలంపై ఫిర్యాదుచేసిన తెలుగు మహిళా నాయకురాలు బుధవారం మరోసారి తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్కు వచ్చారు. వైద్య పరీక్షలకు ఒప్పుకుని ప్రసూతి ఆస్పత్రిలో జాయినయ్యారు. సోమవారం ఉదయం భర్తతో కలసి స్టేషన్కు వచ్చిన ఆమె కేసు దర్యాప్తు చేస్తున్న సీఐ మహేశ్వర్రెడ్డిని కలిసి వైద్య పరీక్షల పేరిట తనను ఇబ్బంది పెట్టవద్దని, తాను హాజరుకాలేనని తేల్చి చెప్పారు. దీంతో సీఐ మహేశ్వర్రెడ్డి విషయాన్ని డీఎస్పీ వెంకటనారాయణ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సూచన మేరకు సీఐ ఆమె నుంచి లిఖితపూర్వకంగా స్టేట్మెంట్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం వచ్చిన ఆమె వైద్య పరీక్షలను రుయాస్పత్రిలో కాకుండా ప్రసూతి ఆస్పత్రిలో చేయించుకుంటానడంతో పోలీసుల సహకారంతో ఆమె బుధవారం మెటర్నిటీ ఆస్పత్రిలో వైద్య పరీక్షల కోసం జాయినయ్యారు. మరో రెండు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి సిద్ధపడి ఆమె వచ్చిందన్నారు పోలీసులు..
Also Read
- Atchannaidu: ఎరువుల అక్రమ రవాణాపై మంత్రి సీరియస్.. డీలర్లపై కఠిన చర్యలకు ఆదేశాలు
- AP Heatwave Alert: ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
- Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక డ్యాష్బోర్డులు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
మరోవైపు.. చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే ఆదిమూలం డిశ్చార్జ్ అయ్యారు.. ఆ తర్వాత పుత్తూరులోని తన నివాసానికి చేరుకున్నారు.. అయితే, ఎమ్మెల్యే ఇంటి వద్ద భారీ గేట్లు ఏర్పాటు చేసి ఎవరిని అనుమతించడం లేదు కుటుంబ సభ్యులు.. సెక్యూరిటీ సిబ్బంది.. ఇప్పటికే ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అత్యాచారం కేసులో తిరుపతి ఇంటెలిజెన్స్ డీఎస్పీ నేతృత్వంలో విచారించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించినట్లుగా తెలుస్తోంది.. మరోవైపు పోలీసులు నమోదు చేసిన కేసుపై ఎమ్మెల్యే ఆదిమూలం హైకోర్టును ఆశ్రయించారు.. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని మంగళవారం క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు.. దర్యాప్తు జరపకుండానే పోలీసులు కేసు నమోదు చేశారని పిటిషన్ లో ప్రస్తావించారు.. ఇక, బాధితురాలు కూడా వైద్య పరీక్షలు ముందుకు వచ్చిన నేపథ్యంలో.. రిపోర్టు ఆధారంగా ఎమ్మెల్యేను విచారించేందుకు సిద్ధం అవుతున్నారు పోలీసులు.. ఇప్పటికే తిరుపతిలోని బీమాస్ పేరడైజ్ లో ఎమ్మెల్యే గడిపిన 109, 105 రూమ్లు సీజ్ చేశారు.. సీసీ టీవీ ఫుటేజ్ ను సైతం స్వాధీనం చేసుకున్నారు.. మరోవైపు.. అశ్లీల వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు పోలీసులు. ఎమ్మెల్యేపై ఆరోపణలు రావడంతో.. టీడీపీ ఇప్పటికే ఆయనను పార్టీ నుంచి బహిష్కరించిన విషయం విదితమే.
తాజావార్తలు
-
IPL 2026: RCB ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. జట్టులోకి మరో విధ్వంసకర బ్యాట్స్మెన్ ఎంట్రీ..
-
AC: భారత్లో తొలి ఏసీ ఎక్కడ పెట్టారో తెలుసా? ఆసక్తికర చరిత్ర గురించి తెలుసుకోండి..
-
RC 17: చరణ్ ఫాన్స్.. రెడీ అవండమ్మా!
-
E30 Petrol: పెట్రోల్లో పెరగనున్న ఇథనాల్ శాతం.. వాహనదారులకు లాభమా? నష్టమా?
-
Drishyam 3: దృశ్యం క్రేజ్ అదృశ్యం!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!