JC Prabhakar Reddy Meets YS Vijayamma: వైఎస్ విజయమ్మతో జేసీ ప్రభాకర్రెడ్డి భేటీ..
- ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామం..
- వైఎస్ విజయమ్మతో జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ..
- లోటస్పాండ్లోని విజయమ్మ నివాసానికి వెళ్లి కలిసిన జేసీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JC Prabhakar Reddy Meets YS Vijayamma: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది.. హైదరాబాద్ వెళ్లిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మను కలిశారు.. హైదరాబాద్ లోటస్పాండ్లోని విజయమ్మ నివాసానికి వెళ్లి భేటీ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఆమెతో అప్యాయంగా మాట్లాడారు.. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, వైఎస్ హయాంలో జేసీ ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న విషయం విదితమే.. వైఎస్ కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు జేసీ దివాకర్రెడ్డి.. అయితే, వైఎస్ రెండో కేబినెట్లో జేసీ కుటుంబానికి మంత్రి పదవి దక్కలేదు..
Read Also: MQ-9B Drones: ‘హంటర్-కిల్లర్స్’ కొనుగోలుకు భారత్ ప్రతిపాదన..ఉగ్రవాదులకు చుక్కలే..!
Also Read
- Botsa Satyanarayana : కూటమి రెండేళ్ల పాలన ‘సున్నా’.. తిరుపతి సభ ఒక వెన్నుపోటు సభ
- YS Jagan: డీఎస్సీ నియామకాలపై జగన్ సంచలన ఆరోపణలు.. సీబీఐ విచారణకు డిమాండ్
- Minister Satyakumar Yadav: ఆరోగ్యశ్రీ క్రెడిట్ వైఎస్ రాజశేఖర్రెడ్డిదే.. మంత్రి సత్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
- Minister Narayana: అందువల్లే ఖర్చు ఎక్కువ.. అమరావతి నిర్మాణాలపై మంత్రి నారాయణ వివరణ
ఇక, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఫ్యామిలీలు కాంగ్రెస్ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.. 2014 ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం ఎంపీగా, ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా బరిలోకి దిగి గెలుపొందారు.. ఆ త్వాత ఎన్నికల్లో వారి వారసులను బరిలోకి దింపినా.. విజయం సాధించలేదు.. ఇక, వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత జేసీ ట్రావెల్స్పై, తమపై కేసులు పెట్టి.. తీవ్రంగా వేధించారని జేసీ దివాకర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం విదితమే.. ఈ కేసుల్లో జేసీ ప్రభాకర్రెడ్డి జైలు జీవితాన్ని కూడా గడిపారు.. జేసీ ట్రావెల్స్ కేసుల విషయంలో.. అధికారులపై కేసులు పెడతానంటూ హెచ్చరిస్తూ వస్తున్నారు జేసీ.. మరో వైపు తాజా ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో పాటు.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. అయితే, జేసీ ప్రభాకర్రెడ్డి ఇప్పుడు వైఎస్ విజయమ్మను కలవడం ఆసక్తికరంగా మారింది. తమ బద్ధ శత్రువు అయిన వైఎస్ జగన్ తల్లి విజయమ్మను జేసీ ప్రభాకర్రెడ్డి ఎందుకు కలిశారు..? ఏం మాట్లాడారు అనే చర్చ ఏపీ పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారిపోయింది.
తాజావార్తలు
-
Telangana Record : భారతదేశపు అన్నపూర్ణ – మన తెలంగాణ.. ధాన్య సేకరణలో సరికొత్త రికార్డుల విజేత
-
OTR : పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఆ ఎమ్మెల్యే పరిస్థితి?
-
IND Vs AFG: రోహిత్ ‘చారిత్రాత్మక’ రికార్డు.. గిల్ ‘మెరుపు’ ఇన్నింగ్స్.. అఫ్గాన్పై భారత్ ఘనవిజయం..
-
Chiranjeevi : కొడుకు నటనపై చిరంజీవి ఎమోషనల్! “‘పుత్రోత్సాహం’ అంటే ఇప్పుడే తెలిసింది..
-
Shubman Gill: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. శుభ్మన్ గిల్ అరుదైన మైలురాయి..
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!