JC Prabhakar Reddy Meets YS Vijayamma: వైఎస్ విజయమ్మతో జేసీ ప్రభాకర్రెడ్డి భేటీ..
- ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామం..
- వైఎస్ విజయమ్మతో జేసీ ప్రభాకర్ రెడ్డి భేటీ..
- లోటస్పాండ్లోని విజయమ్మ నివాసానికి వెళ్లి కలిసిన జేసీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JC Prabhakar Reddy Meets YS Vijayamma: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది.. హైదరాబాద్ వెళ్లిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మను కలిశారు.. హైదరాబాద్ లోటస్పాండ్లోని విజయమ్మ నివాసానికి వెళ్లి భేటీ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఆమెతో అప్యాయంగా మాట్లాడారు.. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, వైఎస్ హయాంలో జేసీ ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న విషయం విదితమే.. వైఎస్ కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు జేసీ దివాకర్రెడ్డి.. అయితే, వైఎస్ రెండో కేబినెట్లో జేసీ కుటుంబానికి మంత్రి పదవి దక్కలేదు..
Read Also: MQ-9B Drones: ‘హంటర్-కిల్లర్స్’ కొనుగోలుకు భారత్ ప్రతిపాదన..ఉగ్రవాదులకు చుక్కలే..!
Also Read
- Kadambari Jethwani : సీఐడీ ఛార్జ్షీట్పై కాదంబరి జెత్వానీ ఫైర్.!
- CM Chandrababu : భూములకు బ్లాక్చెయిన్ రక్షణ.. ఏపీలో కొత్త వ్యవస్థ ప్రారంభం
- AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, నేతన్నలకు భరోసా..
- Vallabhaneni Vamsi: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ.. పట్టిసీమ నీటిపై జోక్యం చేసుకోండి..
ఇక, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఫ్యామిలీలు కాంగ్రెస్ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.. 2014 ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం ఎంపీగా, ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా బరిలోకి దిగి గెలుపొందారు.. ఆ త్వాత ఎన్నికల్లో వారి వారసులను బరిలోకి దింపినా.. విజయం సాధించలేదు.. ఇక, వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత జేసీ ట్రావెల్స్పై, తమపై కేసులు పెట్టి.. తీవ్రంగా వేధించారని జేసీ దివాకర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం విదితమే.. ఈ కేసుల్లో జేసీ ప్రభాకర్రెడ్డి జైలు జీవితాన్ని కూడా గడిపారు.. జేసీ ట్రావెల్స్ కేసుల విషయంలో.. అధికారులపై కేసులు పెడతానంటూ హెచ్చరిస్తూ వస్తున్నారు జేసీ.. మరో వైపు తాజా ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో పాటు.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. అయితే, జేసీ ప్రభాకర్రెడ్డి ఇప్పుడు వైఎస్ విజయమ్మను కలవడం ఆసక్తికరంగా మారింది. తమ బద్ధ శత్రువు అయిన వైఎస్ జగన్ తల్లి విజయమ్మను జేసీ ప్రభాకర్రెడ్డి ఎందుకు కలిశారు..? ఏం మాట్లాడారు అనే చర్చ ఏపీ పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారిపోయింది.
తాజావార్తలు
-
Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
-
Kadambari Jethwani : సీఐడీ ఛార్జ్షీట్పై కాదంబరి జెత్వానీ ఫైర్.!
-
CJP Protest: ప్రధాని మోడీకి అభిజిత్ దీప్కే తాజా హెచ్చరిక..
-
Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
-
ZIM vs IND: జింబాబ్వేను వణికించిన టీమిండియా.. భారత్ ముందు 126 పరుగుల టార్గెట్!
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?