YS Jagan: అందుకే “మావిగన్” ప్రతిపాదన.. స్పష్టం చేసిన జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: రాజధాని ప్రాంత రైతులతో సమావేశమైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రైతుల అభిప్రాయాలకు అనుగుణంగానే ముందుకు సాగుతామని హామీ ఇచ్చారు. రైతులను బలవంతపెట్టి నిర్ణయాలు అమలు చేయడం మంచిది కాదని ఆయన పేర్కొన్నారు. రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడంతో పాటు వారిని సంతోషపెట్టే విధంగా ప్రభుత్వ చర్యలు ఉండాలని, ఇబ్బందులకు గురిచేసే నిర్ణయాలు తీసుకోకూడదని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాజధాని ప్రాంతానికి చెందిన పలువురు రైతులు కలిశారు. ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, నేలపాడు తదితర గ్రామాలకు చెందిన రైతులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
అయితే, రాజధాని నిర్మాణానికి ఇప్పటికే తీసుకున్న 50 వేల ఎకరాల భూముల పరిస్థితికే స్పష్టమైన దిశ లేదని జగన్ విమర్శించారు. అలాంటప్పుడు మరో 50 వేల ఎకరాలు అవసరమని ప్రభుత్వం చెప్పడం సమంజసం కాదన్నారు. అందుకే ప్రత్యామ్నాయంగా “మావిగన్” ప్రతిపాదనను సూచించినట్లు వెల్లడించారు. విజయవాడలో ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయం ఉండగా మరో ఎయిర్పోర్టు అవసరం ఏమిటని జగన్ ప్రశ్నించారు. ప్రస్తుతం విజయవాడ విమానాశ్రయంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, అవి వచ్చే నెలల్లో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అలాగే మచిలీపట్నం పోర్టు తమ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభించామని, నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని గుర్తుచేశారు.
Also Read
- Pramod Sawant: అనుభవం.. స్థిరత్వం.. ఆ తర్వాతే రాజకీయాలు.. 40 ఏళ్ల తర్వాతే పాలిటిక్స్లోకి రావాలి..!
- CM Chandrababu : చంద్రబాబు ఫుల్ బిజీ.. ఉత్తరాంధ్రలో ఒక్కరోజే 3 జిల్లాలు..
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- YS Viveka M*urder Case: వైఎస్ వివేకా కేసులో ఈడీ కీలక ప్రకటన.. అవినాష్ రెడ్డి ఇంట్లో రూ.24 లక్షలు సీజ్
రాష్ట్రంలో జాతీయ రహదారులు, రైల్వే స్టేషన్లు వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని జగన్ ఆరోపించారు. ప్రస్తుత విధానాల వల్ల భవిష్యత్తులో కూడా రాజధానికి స్పష్టమైన రూపం లేకుండా పోతుందని అన్నారు. రాజధాని ప్రాంతంలో కనీస మౌలిక సదుపాయాల కల్పనకే ఎకరాకు రూ.2 కోట్ల వరకు ఖర్చు అవుతుందని జగన్ పేర్కొన్నారు. రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీరు, విద్యుత్ వంటి సదుపాయాల కోసం జీవితాంతం భారీ వ్యయం చేయాల్సి వస్తుందని చెప్పారు. ఈ మొత్తం ఖర్చు దాదాపు రూ.2 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేశారు.
రాజధాని అభివృద్ధి పేరుతో భారీ అవినీతి జరుగుతోందని జగన్ ఆరోపించారు. ఎక్కడ చూసినా స్కాములే కనిపిస్తున్నాయని, రాజధాని పేరుతో వరుసగా అక్రమాలు జరుగుతున్నాయని విమర్శించారు. మావిగన్ను గ్రోత్ కారిడార్గా ప్రకటిస్తే వేగంగా అభివృద్ధి సాధ్యమవుతుందని జగన్ అభిప్రాయపడ్డారు. సుమారు 110 కిలోమీటర్ల పరిధిలో గ్రోత్ కారిడార్ అభివృద్ధికి నిధులు కేటాయిస్తే మొత్తం ప్రాంతం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి..
తాజావార్తలు
-
Allu Arjun: అల్లు ఆర్మీకి షాకింగ్ న్యూస్! బన్నీతో సినిమా ఉంటుందా? ఉండదా? సందీప్ బ్రదర్ కామెంట్స్ వైరల్!
-
Cheque Book New Rules 2026: చెక్బుక్ కొత్త రూల్స్.. మీ చెక్పై ఈ సెక్యూరిటీ కోడ్ ఉందా? చెక్ చేసుకోండి!
-
Super EL Nino: ముంచుకొస్తున్న సూపర్ ఎల్నినో ముప్పు.. 100 ఏళ్ల రికార్డ్ బద్దలవుతోందా?
-
Hyderabad: బిల్డింగ్ కుప్పకూలడానికి అసలు కారణం ఇదే.. గచ్చిబౌలి ఘటనలో సంచలన నిజాలు
-
Toxic: టాక్సిక్ సెన్సార్ కట్స్.. నిజంగా షాకింగే!
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!