Amaravati Land Pooling: రాజధాని ప్రాంతంలో భూ సమీకరణకు బ్రేక్..!
- రాజధాని ప్రాంతంలో జరిగే భూ సమీకరణకు బ్రేక్..
- కరేడులో ఇండోసోల్ కంపెనీకి భూములు కేటాయింపు..
- సారవంతమైన భూములు రైతులకే చెందాలని ఆందోళన..
- గత ప్రభుత్వం చేవూరు ప్రాంతంలో ఇండోసోల్కు భూ కేటాయింపులు..
- కుప్పం, దగదర్తి ఎయిర్పోర్టుకు భూ సమీకరణకు రెడీ ..
- జిందాల్ కంపెనీ కోసం భూములు ఇచ్చిన రైతులు ఆందోళన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati Land Pooling: ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాజెక్టులకు సంబంధించి…భూ సమీకరణ, భూసేకరణ అంశంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అమరావతి ప్రాంతంలో రెండో విడత భూసమీకరణ చేయాలనే ఆలోచనతో ఉంది. దీనిపై కేబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. స్థానిక రైతులు సానుకూలంగా లేకపోవడంతో…రాజధాని ప్రాంతంలో జరిగే భూ సమీకరణకు బ్రేక్ పడింది. దీనిపై త్వరలోనే స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పరిస్థితి చక్కబడిన తర్వాత రెండో విడత భూసమీకరణపై నిర్ణయం తీసుకోనుంది సర్కార్.
Read Also: Kannappa : రాష్ట్రపతి భవన్ లో కన్నప్ప మూవీ ప్రదర్శన..
Also Read
- Are Shyamala: కులాలు, మతాలు మార్చేశారా?.. డీఎస్సీపై ఆరె శ్యామల సంచలన వ్యాఖ్యలు
- TDP Leadership Conclave: నీళ్లు, పరిశ్రమలు, ఉద్యోగాలు.. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు భారీ బ్లూప్రింట్
- CM Chandrababu: అన్ని సర్వేల్లో కూటమిదే గెలుపు.. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా విజయం మనదే..!
- TDP Leadership Conclave: ఎమ్మెల్యేలకు చంద్రబాబు టాస్క్.. స్థానిక ఎన్నికల్లో గెలవాల్సిందే.. లేదంటే పని చేయనట్టే..!
కరేడులో ఇండోసోల్ కంపెనీకి సంబంధించిన భూములు కేటాయింపు అంశం ఆందోళన కలిగిస్తోంది. ఇండోసోల్ ప్రైవేట్ లిమిటెడ్కు ప్రభుత్వం భూమిని కేటాయించడాన్ని నిరసిస్తూ…రైతులు ఆందోళన చేస్తున్నారు. నిరుపయోగంగా ఉన్న భూములు ఇస్తే ఎలాంటి అభ్యంతరం లేదని…కానీ సారవంతమైన భూములు రైతులకే చెందాలని ఆందోళన జరుగుతోంది. రెండు పంటలు పండే భూములు ఎలా ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వంలో చేవూరు ప్రాంతంలో ఇండోసోల్కు భూ కేటాయింపులు జరిగాయి. పరిహారం కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ ప్రాంతంలో కాకుండా మరో చోట భూమి ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కరేడు భూములను…బలవంతంగా సేకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రైతులు అంటున్నారు. ప్రభుత్వానికి సెంట్ భూమి ఇచ్చే ప్రసక్తి లేదంటున్నారు అన్నదాతలు.
Read Also: Kingdom: అమెరికాలో సత్తా చాటుతున్న విజయ్.. “కింగ్డమ్” కు భారీగా అడ్వాన్స్ బుకింగ్స్..!
కుప్పం, దగదర్తి ప్రాంతాల్లో ఎయిర్పోర్టుకు…ప్రభుత్వం భూ సమీకరణకు రెడీ అవుతోంది. ఈ ప్రాంతాల్లో కూడా వ్యతిరేక వస్తోంది. ఎయిర్పోర్టులకైనా…వేల ఎకరాల్లో భూములు కావాల్సి ఉంటుంది. దీంతో రైతుల నుంచి వచ్చే వ్యతిరేకతపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఇక ఉత్తరాంధ్ర కొత్తవలస ప్రాంతంలో జిందాల్ కంపెనీ కోసం భూములు ఇచ్చిన రైతులు ఆందోళన చేస్తున్నారు. నిబంధనల ప్రకారం తమకు రావాల్సిన సదుపాయాలు రాలేదంటున్నారు. ఇంటికో ఉద్యోగం, ఆర్ధిక సహాయం ఇవి సక్రమంగా అమలు కాలేదని అంటున్నారు. అయితే పారిశ్రామిక అభివృద్ధి, రాజధాని నిర్మాణం కోసం భూములు అవసరమే…కానీ రైతులకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
తాజావార్తలు
-
AI Danger Warning: Anthropic పరిశోధకుడు రాజీనామా.. షాకింగ్ వార్నింగ్.. ఈ దశాబ్దం చివరికి AIతో మానవాళికి ముప్పు?
-
Central Cabinet Decision: తెలుగు రాష్ట్రాల్లో 4 లేన్ల రైల్వే ట్రాక్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
Uday Krishna Reddy : ఉదయ్ కృష్ణారెడ్డికి హైకోర్టు బిగ్ రిలీఫ్.. పొటెన్సీ టెస్ట్పై కీలక ఆదేశాలు.!
-
Ayyappa Prasadam: శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం ఇంట్లోనే చేసుకోండిలా!
-
Tollywood Stars : ఆరోగ్యాన్ని పక్కన పెట్టి షూటింగ్స్కు పరుగులు ఎందుకు?
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!