Amaravati Land Pooling: రాజధాని ప్రాంతంలో భూ సమీకరణకు బ్రేక్..!
- రాజధాని ప్రాంతంలో జరిగే భూ సమీకరణకు బ్రేక్..
- కరేడులో ఇండోసోల్ కంపెనీకి భూములు కేటాయింపు..
- సారవంతమైన భూములు రైతులకే చెందాలని ఆందోళన..
- గత ప్రభుత్వం చేవూరు ప్రాంతంలో ఇండోసోల్కు భూ కేటాయింపులు..
- కుప్పం, దగదర్తి ఎయిర్పోర్టుకు భూ సమీకరణకు రెడీ ..
- జిందాల్ కంపెనీ కోసం భూములు ఇచ్చిన రైతులు ఆందోళన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati Land Pooling: ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాజెక్టులకు సంబంధించి…భూ సమీకరణ, భూసేకరణ అంశంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అమరావతి ప్రాంతంలో రెండో విడత భూసమీకరణ చేయాలనే ఆలోచనతో ఉంది. దీనిపై కేబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. స్థానిక రైతులు సానుకూలంగా లేకపోవడంతో…రాజధాని ప్రాంతంలో జరిగే భూ సమీకరణకు బ్రేక్ పడింది. దీనిపై త్వరలోనే స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పరిస్థితి చక్కబడిన తర్వాత రెండో విడత భూసమీకరణపై నిర్ణయం తీసుకోనుంది సర్కార్.
Read Also: Kannappa : రాష్ట్రపతి భవన్ లో కన్నప్ప మూవీ ప్రదర్శన..
Also Read
- CM Chandrababu: చిట్చాట్లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది అనివార్యం..!
- AP Liquor Case: లిక్కర్ కేసులో మరో ఛార్జిషీట్ దాఖలు.. కీలక వివరాలు వెల్లడి
- Amaravati Land Allocation: అమరావతిలో 114 సంస్థలకు 1,269 ఎకరాలు కేటాయింపు..
- Pawan Kalyan : పోలవరం అడవుల్లో పులి సంచారం.. అధికారులతో పవన్ అత్యవసర సమీక్ష.!
కరేడులో ఇండోసోల్ కంపెనీకి సంబంధించిన భూములు కేటాయింపు అంశం ఆందోళన కలిగిస్తోంది. ఇండోసోల్ ప్రైవేట్ లిమిటెడ్కు ప్రభుత్వం భూమిని కేటాయించడాన్ని నిరసిస్తూ…రైతులు ఆందోళన చేస్తున్నారు. నిరుపయోగంగా ఉన్న భూములు ఇస్తే ఎలాంటి అభ్యంతరం లేదని…కానీ సారవంతమైన భూములు రైతులకే చెందాలని ఆందోళన జరుగుతోంది. రెండు పంటలు పండే భూములు ఎలా ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వంలో చేవూరు ప్రాంతంలో ఇండోసోల్కు భూ కేటాయింపులు జరిగాయి. పరిహారం కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ ప్రాంతంలో కాకుండా మరో చోట భూమి ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కరేడు భూములను…బలవంతంగా సేకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రైతులు అంటున్నారు. ప్రభుత్వానికి సెంట్ భూమి ఇచ్చే ప్రసక్తి లేదంటున్నారు అన్నదాతలు.
Read Also: Kingdom: అమెరికాలో సత్తా చాటుతున్న విజయ్.. “కింగ్డమ్” కు భారీగా అడ్వాన్స్ బుకింగ్స్..!
కుప్పం, దగదర్తి ప్రాంతాల్లో ఎయిర్పోర్టుకు…ప్రభుత్వం భూ సమీకరణకు రెడీ అవుతోంది. ఈ ప్రాంతాల్లో కూడా వ్యతిరేక వస్తోంది. ఎయిర్పోర్టులకైనా…వేల ఎకరాల్లో భూములు కావాల్సి ఉంటుంది. దీంతో రైతుల నుంచి వచ్చే వ్యతిరేకతపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఇక ఉత్తరాంధ్ర కొత్తవలస ప్రాంతంలో జిందాల్ కంపెనీ కోసం భూములు ఇచ్చిన రైతులు ఆందోళన చేస్తున్నారు. నిబంధనల ప్రకారం తమకు రావాల్సిన సదుపాయాలు రాలేదంటున్నారు. ఇంటికో ఉద్యోగం, ఆర్ధిక సహాయం ఇవి సక్రమంగా అమలు కాలేదని అంటున్నారు. అయితే పారిశ్రామిక అభివృద్ధి, రాజధాని నిర్మాణం కోసం భూములు అవసరమే…కానీ రైతులకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..