Polavaram Project: పోలవరం ప్రాజెక్టుపై విదేశీ నిపుణుల కీలక సూచనలు.. డిజైన్ మార్పులతో..!
- పోలవరం ప్రాజెక్టు సవాళ్లపై విదేశీ నిపుణుల బృందం కీలక సూచనలు..
- వర్షాకాలం దాటగానే పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించాలి..
- డిజైన్.. నిర్మాణ అంశాలు చర్చించేందుకు వర్క్ షాప్ ఏర్పాటు చేయాలి..
- ప్రాజెక్ట్ డిజైనర్.. ఇంజినీర్ల బృందం.. విదేశీ నిపుణుల బృందం వర్క్ షాప్ లో ఉండాలని సూచన..
Polavaram Project: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రాజెక్టుల్లో కీలకమైనది పోలవరం ప్రాజెక్టులు.. అయితే, పోలవరం ప్రాజెక్టు సవాళ్లపై అధ్యయనం చేసిన విదేశీ నిపుణుల బృందం కీలక సూచనలు చేసింది. వర్షాకాలం దాటగానే పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించేందుకు వీలుగా డిజైన్, నిర్మాణ అంశాలు చర్చించేందుకు వర్క్ షాప్ ఏర్పాటు చేయాలని సూచించింది. ఇందులో పోలవరం ప్రాజెక్ట్ డిజైనర్, ప్రాజెక్టను పర్యవేక్షించే ఇంజినీర్ల బృందం, విదేశీ నిపుణుల బృందం ఉండాలని సూచించింది. డిజైన్ల రూపకల్పన, నిర్మాణ షెడ్యూలు నిర్ణయించడం, అందుకుతగ్గ వనరులు ఏవేంకావాలో ఈ వర్క్షాప్లో ఒక స్పష్టతకు రావాలని అభిప్రాయపడింది.. ప్రధాన డ్యాం ప్రాంతం పొడవునా సీపేజీ నీటిమట్టానికి 8 మీటర్ల ఎత్తులో ఒక ప్లాట్ఫాం నిర్మించాలని.. దాన్నుంచి ఎప్పుడూ నీటి మట్టం 8 మీటర్ల కన్నా దిగువన ఉండేలా పంపింగ్ ఏర్పాట్లు చేయాలని బృందం స్పష్టం చేసింది.. ఈ ఏర్పాట్లు వచ్చే వానాకాలంలో కూడా డయాఫ్రం వాల్ నిర్మాణానికి అవాంతరాలు కలిగించని స్థితిలో ఉండేలా చూడాలని విదేశీ నిపుణుల బృందం సూచించింది.
Read Also: Railway Jobs: ఆ అభ్యర్థులకు రైల్వే ఉద్యోగాలు..
Also Read
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- AP SSC Results 2026: టెన్త్ ఫలితాల్లో సత్తా చాటిన ఎంజేపీ బీసీ గురుకులాలు.. 96.02 శాతం ఉత్తీర్ణత..
- AP SSC Supplementary Exams 2026: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల..
- AP SSC Results 2026: ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల.. పెరిగిన ఉత్తీర్ణత..
కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన సీఎం చంద్రబాబు.. అప్పటి వరకు జరిగిన పనులపై ఆరా తీశారు.. ఆ తర్వాత.. పోలవరం ప్రాజెక్టు సవాళ్లపై అధ్యయనం చేసేందుకు విదేశీ నిపుణుల బృందాన్ని నియమించిన విషయం విదితమే.. ఇక, ఆ విదేశీ నిపుణుల బృందం.. క్షేత్రస్థాయిలో ప్రాజెక్టును పరిశీలించింది.. ఇప్పుడు డిజైన్ మార్పులతో కొత్త డయాఫ్రం వాల్, ప్రధాన డ్యాం నిర్మించాలని కీలక సూచనలు చేసింది.. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల సీపేజిని పూర్తిగా నియంత్రించాలంటే ఎక్కువ ఖర్చవతుంది కాబట్టి.. వాటి జోలికి పోకుండా.. ఆ కాఫర్ డ్యాంలతోనే ముందుకు సాగాలని విదేశీ నిపుణుల కమిటీ సూచించింది.. ఇక, ఈ ఏడాది వర్షాకాలం దాటగానే పననులు ప్రారంభించేందుకు వీలుగా డిజైన్, నిర్మాణ అంశాలు చర్చించేందుకు ఒక వర్క్షాప్ ఏర్పాటు చేయాలని పేర్కొన్న నిపుణుల కమిటీ.. ఆ వర్క్షాప్లో ప్రాజెక్టుపై ఒక స్పష్టతకు రావాలని సూచించింది.
తాజావార్తలు
-
Motorola Moto G87: 200MP కెమెరా, 5200mAh బ్యాటరీతో మోటో G87 విడుదల
-
Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
-
AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
-
Ajit Doval: ఢిల్లీలో ఇటలీ రక్షణ మంత్రి పర్యటన.. అజిత్ దోవల్తో సమావేశం
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
ట్రెండింగ్
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!