AP Employee unions: ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల హెచ్చరికలు..!
- ఏపీలో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి హెచ్చరికలు..
- మాకు రావాల్సినవి ఇవ్వకపోతే ఉద్యమిస్తాం అంటూ అల్టిమేటం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Employee unions: ఏపీలో ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.. మాకు రావాల్సినవి ఇవ్వకపోతే ఉద్యమిస్తాం అంటూ అల్టిమేటం ఇస్తున్నాయి… ఒకటో తేదీనే జీతం ఇస్తున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూనే, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఆర్టీసీ ఉద్యోగులు అసంతృప్తి ప్రకటిస్తున్నారు.. ఏపీజేఏసీ నాయకులు.. ఉద్యోగ, ఉపాధ్యాయుల విషయంలో ప్రభుత్వ జగన్నాథ రథచక్రాలు పని చేయడం లేదని, సంవత్సర కాలం ఎదురుచూసాం.. ప్రభుత్వ జగన్నాథ రథచక్రాలు ఉద్యోగుల వైపు చూడాలి అంటూ మనసులో మాటను బయటపెట్టారు.. పీఆర్సీ సవరణకు రెండు సంవత్సరాలైనా కమిషనర్ ను నియమించకపోవడం పై ఉద్యోగ సంఘాలు సీరియస్ వ్యాఖ్యలు చేస్తున్నాయి.. అలాగే సీఎం చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇచ్చిన హామీలే నెరవేర్చాలని అడుగుతున్నామని జెఏసీ నేతలు అంటున్నారు..
Read Also: Tollywood : లక్ అంటే ఇలా ఉండాలి.. జాక్ పాట్ కొట్టిన మైత్రీ మూవీ మేకర్స్
Also Read
- Nara Lokesh South Korea visit: సౌత్ కొరియాలో మంత్రి లోకేష్ పర్యటన.. 50కి పైగా కంపెనీలతో చర్చలు
- Pawan Kalyan Health Update: పవన్ కల్యాణ్కు శస్త్రచికిత్స విజయవంతం.. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే..?
- Social Media Monitoring: సోషల్ మీడియాకు బ్రేక్లు..! ప్రత్యేక మెకానిజం
- Ambati Rambabu: రావణ్పై యూఏపీఏ కేసు అన్యాయం.. పోరాటానికి మా మద్దతు
ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు ఇప్పటికే గేట్ మీటింగ్లు, ధర్నాలు అంటూ ఉద్యమ బాట పట్టారు.. ప్రమోషన్లు ఇవ్వడం లేదని, డీఏలు, సరెండ్ ల అంశంలోనూ ఎలాంటి నిర్ణయం రాకపోవడం పై ఇప్పటికే ఎంప్లాయిస్ యూనియన్ ఉద్యమ బాట పట్టింది… ప్రభుత్వ పరిధిలో ఉన్న పీటీడీ (ఆర్టీసీ) ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, రాష్ట్రవ్యాప్తంగా 129 డిపోలలోను, నాలుగు వర్కుషాపులలో ఆర్టీసీ ఉద్యోగులు ఎర్రబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు.. ఆర్టీసీ ఈయూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల వద్ద ధర్నాలు జరిపారు… ఏకంగా సీఎం చంద్రబాబు అనుమతి కోసం వేచి ఉన్న ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతలకు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటూ కోరారు. ఆగస్టు 15 నుండి మహిళలకు ఉచిత ప్రయాణం స్కీమ్ విజయవంతం కావాలంటే 3వేల బస్సులు కొనుగోలు చేయాలి/10 వేల మంది సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.. పీఆర్సీ బకాయిలు కూడా చెల్లించాలని కోరుతున్నారు.
Read Also: Mrunal Thakur : 6ఏళ్లుగా ఒక్క హిట్ లేదు.. అయినా ఆఫర్స్ తగ్గడం లేదు
పెన్షనర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశారు జెఏసీ నాయకులు.. పంచాయితీ కార్యదర్శులు సైతం తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ ఏపీఎన్జీజీజీవోతో కలిసి ఉద్యమానికి సిద్ధమవుతున్నారు.. అటు చేసే టైం లేక… ఉదయం నుంచి గ్రీన్ అంబాసిడర్ ల కోసం ఎదురు చూడలేక నానా అవస్థలు పడుతున్నాం అంటున్నారు. వాళ్లకి ఇచ్చే రెండు వందలకు పని చేయడం లేదని, అదనంగా డబ్బులు అడుగుతున్బారని అంటున్నారు.. అలాగే ప్రమోషన్ల విషయంలోనూ తమ గోడు పట్టించుకోవాలని అంటున్నారు.. అలా పట్టించుకుని ప్రమోషన్లు ఇవ్వకపోతే ఉద్యమ బాట పడతామని అంటున్నారు.. మా డబ్బులు ప్రభుత్వం దగ్గర ఉన్నవే అడుగుతున్నాం, ప్రభుత్వం స్పందించని పక్షంలో ఆందోళన చేయడానికి సిద్ధం అని స్పష్టం చేశారు. ఏపీలో ఉద్యోగులు సంఘాల వారోగా ఒక తాటి మీదకు వచ్చి తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ, రెండు నెలల టైం పెట్టడం పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి..
తాజావార్తలు
-
Nagarjuna: కొడుకు సక్సెస్ కోసం నాగార్జున తపన.. ‘లెనిన్’ స్క్రిప్ట్లో కింగ్ రైటింగ్!
-
CM Revanth Reddy : కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్, బీజేపీ కుట్రలను తిప్పికొడతాం
-
Shravan Month Dreams: శ్రావణ మాసంలో మీ కలలో ఇవి కనిపిస్తే.. మీ దరిద్రం తీరిపోయినట్లే! అవి ఏంటో తెలుసా?
-
TMC CRISIS: మమతా బెనర్జీకి షాక్.. రెబల్ వర్గంలో చేరిన కీలక అనుచరుడు..
-
Jananayagan : విజయ్ లాస్ట్ మూవీతో కిరణ్కు తిప్పలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!