AP DSC: నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
- నేటి నుంచి ఏపీలో DSC ఆన్లైన్ పరీక్షలు..
- ఈనెల 30 వరకు కొనసాగనున్న DSC పరీక్షలు..
- ఏపీ వ్యాప్తంగా DSC పరీక్షల నిర్వహణ..
- ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు..
- మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 వరకు పరీక్షలు..
- పరీక్షా కేంద్రంలోకి గంటన్నర ముందే అనుమతి..
- ఒక్క నిమిషం లేటైనా నో ఎంట్రీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP DSC: నేటి నుంచి ఆంధ్రప్రదేశ్లో మెగా డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి.. డీఎస్సీ ఆన్లైన్ పరీక్షలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.. నేటి నుంచి ఈనెల 30వ తేదీ వరకు DSC పరీక్షలు కొనసాగుతాయి.. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.. పరీక్షా కేంద్రంలోకి గంటన్నర ముందే అనుమతిస్తారు… కానీ, ఒక్క నిమిషం లేటైనా నో ఎంట్రీ నిబంధన అమలు చేస్తున్నారు.
Read Also: Kaleshwaram Investigation: నేటి నుంచి ప్రారంభం కానున్న కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ
Also Read
- Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
- Nara Lokesh: మంత్రి లోకేష్తో చాగంటి కోటేశ్వరరావు భేటీ.. నైతిక విలువలతోనే విద్యా వికాసం
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ క్లారిటీ.. అప్పుడేనా..?
- Gudapati Srinivasa Rao: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన గూడపాటి శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు..
కాకినాడలో 6 కేంద్రాలలో పరీక్షలు నిర్వహించనున్నారు.. 41,107 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు.. విక, విజయనగరంలో ఐదు పరీక్షా కేంద్రాల్లో 36,495 మంది అభ్యర్థులు పరీక్షలు రాయబోతున్నారు.. సీతం కాలేజ్, ఐయాన్ డిజిటల్, లెండి ఇంజనీరింగ్, ఎంవిజిఆర్ ఇంజనీరింగ్, అవంతి కళాశాలల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.. ఏలూరు జిల్లాలో డీఎస్సీ పరీక్షలకు సర్వం సిద్ధం చేశారు.. పరీక్షా కేంద్రాలుగా వట్లూరు సిద్ధార్థ క్విస్ట్ సిబిఎస్ఈ స్కూల్, వట్లూరు సర్ సి ఆర్ ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఉండగా.. 17,584 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.. ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ ఫోన్లు, గడియారాలు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబడవు.. సందేహాలు, వివరణల కోసం అభ్యర్థులు డీఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు 90307 23444, 95056 44555 సంప్రదించవచ్చు..
ఇక, విశాఖలో 12 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించబోతున్నారు.. 57,895 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.. కొమ్మాది చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్, పెద గంట్యాడ ఎస్.వి.ఎస్. సొల్యూషన్స్, షీలా నగర్, చినముషిడివాడ-1, 2 ఐయాన్ డిజిటల్ సెంటర్లు, ఎన్ఎస్టీఎల్ దగ్గర ఏడీజడ్ ఆర్వోనా డిజిటల్, మధురువాడ, రుషికొండ గాయిత్రీ విద్యా పరిషత్, దువ్వాడ విజ్ఞాన్, కాపు జగ్గరాజుపేట విజ్ఞాన్, శొంఠ్యాం ఎన్.ఎస్.ఆర్.ఐ.టి., నరవ విట్స్ కళాశాలల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.. అన్నమయ్య జిల్లాలో మదనపల్లెలో 3, రాజంపేటలో 1, రాయచోటిలో 2 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 17851 మంది అభ్యర్థులు మెగా డీఎస్సీ రాయబోతున్నారు..
తాజావార్తలు
-
Salman Khan: ఒక బాత్రూమ్కు 70 మంది.. జైల్లో గడిపిన రోజులు గుర్తు చేసుకున్న సల్మాన్ ఖాన్..
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు “బ్రాండెడ్ విషం” తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని అడ్డంకులే, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకూడదు!
-
Oppo A7 Pro Max: ఒప్పో A7 ప్రో మాక్స్ రిలీజ్.. 10000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!