AP DSC: నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
- నేటి నుంచి ఏపీలో DSC ఆన్లైన్ పరీక్షలు..
- ఈనెల 30 వరకు కొనసాగనున్న DSC పరీక్షలు..
- ఏపీ వ్యాప్తంగా DSC పరీక్షల నిర్వహణ..
- ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు..
- మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 వరకు పరీక్షలు..
- పరీక్షా కేంద్రంలోకి గంటన్నర ముందే అనుమతి..
- ఒక్క నిమిషం లేటైనా నో ఎంట్రీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP DSC: నేటి నుంచి ఆంధ్రప్రదేశ్లో మెగా డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి.. డీఎస్సీ ఆన్లైన్ పరీక్షలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.. నేటి నుంచి ఈనెల 30వ తేదీ వరకు DSC పరీక్షలు కొనసాగుతాయి.. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.. పరీక్షా కేంద్రంలోకి గంటన్నర ముందే అనుమతిస్తారు… కానీ, ఒక్క నిమిషం లేటైనా నో ఎంట్రీ నిబంధన అమలు చేస్తున్నారు.
Read Also: Kaleshwaram Investigation: నేటి నుంచి ప్రారంభం కానున్న కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ
Also Read
- AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
- NDA Meeting Andhra Pradesh: ఎన్డీఏ భేటీలో రాజ్యసభ స్థానాల పంపకం.. టీడీపీకి 3, జనసేనకు 1..?
- Pawan Kalyan: పాత వీడియో షేర్ చేసిన పవన్ కల్యాణ్.. తెలంగాణపై నా వైఖరి ఇదే..!
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అభివృద్ధి అజెండాపై ఫోకస్.. 37 అంశాలకు గ్రీన్ సిగ్నల్..
కాకినాడలో 6 కేంద్రాలలో పరీక్షలు నిర్వహించనున్నారు.. 41,107 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు.. విక, విజయనగరంలో ఐదు పరీక్షా కేంద్రాల్లో 36,495 మంది అభ్యర్థులు పరీక్షలు రాయబోతున్నారు.. సీతం కాలేజ్, ఐయాన్ డిజిటల్, లెండి ఇంజనీరింగ్, ఎంవిజిఆర్ ఇంజనీరింగ్, అవంతి కళాశాలల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.. ఏలూరు జిల్లాలో డీఎస్సీ పరీక్షలకు సర్వం సిద్ధం చేశారు.. పరీక్షా కేంద్రాలుగా వట్లూరు సిద్ధార్థ క్విస్ట్ సిబిఎస్ఈ స్కూల్, వట్లూరు సర్ సి ఆర్ ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఉండగా.. 17,584 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.. ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ ఫోన్లు, గడియారాలు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబడవు.. సందేహాలు, వివరణల కోసం అభ్యర్థులు డీఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్లు 90307 23444, 95056 44555 సంప్రదించవచ్చు..
ఇక, విశాఖలో 12 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించబోతున్నారు.. 57,895 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.. కొమ్మాది చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్, పెద గంట్యాడ ఎస్.వి.ఎస్. సొల్యూషన్స్, షీలా నగర్, చినముషిడివాడ-1, 2 ఐయాన్ డిజిటల్ సెంటర్లు, ఎన్ఎస్టీఎల్ దగ్గర ఏడీజడ్ ఆర్వోనా డిజిటల్, మధురువాడ, రుషికొండ గాయిత్రీ విద్యా పరిషత్, దువ్వాడ విజ్ఞాన్, కాపు జగ్గరాజుపేట విజ్ఞాన్, శొంఠ్యాం ఎన్.ఎస్.ఆర్.ఐ.టి., నరవ విట్స్ కళాశాలల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.. అన్నమయ్య జిల్లాలో మదనపల్లెలో 3, రాజంపేటలో 1, రాయచోటిలో 2 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 17851 మంది అభ్యర్థులు మెగా డీఎస్సీ రాయబోతున్నారు..
తాజావార్తలు
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
-
Mohali Love Murder: కిరాతకుడిగా మారిన సహోద్యోగి.. ఆఫీస్లోనే యువతి హత్య
-
Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
-
CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!