CM relief fund: సీఎం రిలీఫ్ ఫండ్కు విరివిగా విరాళాలు
- ఏపీని ముంచెత్తిన వరదలు..
- విజయవాడ నగరాన్ని అతలాకుతలం చేసిన వరదలు..
- సీఎం సహాయ నిధికి భారీగా విరాళాలు..
CM relief fund: ఏపీ వరదలు ముంచెత్తాయి.. ముఖ్యంగా విజయవాడ నగరాన్ని భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి.. వరదలతో అపార నష్టం జరిగింది.. అంచనా వేస్తుంటే.. నష్టం పెరిగిపోతూనే ఉంది.. ఓవైపు ప్రజల ఆస్తులు.. వాహనాలు.. పంటలు.. విద్యుత్ వ్యవస్థ.. రవాణా వ్యవస్థ.. మున్సిపల్ వ్యవస్థ.. పంచాయతీరాజ్ వ్యవస్థ.. ఇలా అనేక రకాలుగా భారీ నష్టాన్ని చవిచూడాల్సిన వచ్చింది.. అయితే, మేం ఉన్నామంటూ దాతలు ముందుకు వస్తున్నారు.. సినీ, రాజకీయ ప్రముఖులు.. ఉద్యోగులు.. సంఘాలు.. రాజకీయ పార్టీలు.. వ్యక్తులు.. సంస్థలు.. సీఎం సహాయ నిధికి విరాళాలు ఇస్తున్నారు.. ఇక, ఈ రోజు కూడా సీఎం సహాయ నిధికి భారీగా విరాళాలు వస్తున్నాయి..
Read Also: Raj Tarun : లావణ్య, రాజ్ తరుణ్ కేసులో మరో ట్విస్ట్.. ఈసారి ట్విస్ట్ వేరే లెవల్..
Also Read
- Governor Abdul Nazeer: ఏపీ గవర్నర్కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..
- CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. సమన్వయంతో పని చేయండి.. ఆత్మ విమర్శ అవసరం..
- Vijayasai Reddy: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన.. మళ్లీ రాజకీయ ప్రవేశం..
- CM Chandrababu: టీడీపీలో కార్యకర్తలే అధినేతలు... రైట్ రాయల్గా బతకాలి..
మంత్రి గొట్టిపాటి రవి నేతృత్వంలో సీఎం చంద్రబాబును కలిశారు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ.. తమ ఒక్క రోజు జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా ఇచ్చారు.. రూ.10.60 కోట్లని వరద సాయంగా అందజేశారు.. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవి మాట్లాడుతూ.. వరదల్లో విద్యుత్ ఉద్యోగులు కష్టపడి పని చేశారు. విద్యుత్ పునరుద్దరించడంలో విద్యుత్ ఉద్యోగులు అద్బుతంగా పని చేశారు. వరద బాధితులకు సేవలతో పాటు.. వరద సాయం కింద ఒక్క రోజు జీతాన్ని ఇచ్చారు. చంద్రబాబు పడుతున్న కష్టానికి ఊడతా భక్తిగా విద్యుత్ ఉద్యోగులూ చేయూనిచ్చారనరి పేర్కొన్నారు మంత్రి గొట్టిపాటి రవి.
Read Also: Top Headlines @ 1 PM: టాప్ న్యూస్
మరోవైపు.. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి నేతృత్వంలోని సర్వేపల్లి నియోజకవర్గ పారిశ్రామిక వేత్తలు సీఎం చంద్రబాబును కలిశారు.. రూ. 2.97 కోట్ల మేర నిధులు వరద సాయం కింద సీఎం రిలీఫ్ ఫండ్ కు అందించారు సోమిరెడ్డి నేతృత్వంలోని పారిశ్రామిక వేత్తలు. వరద బాధితుల్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చారు సర్వేపల్లి పారిశ్రామికవేత్తలు. ముఖ్యమంత్రి సహాయ నిధికి జెమినీ ఎడిబుల్ ఆయిల్స్ అండ్ ఫాట్స్ లిమిటెడ్ రూ.2 కోట్ల విరాళం.. seil semcorp థర్మల్ పవర్ ప్రాజెక్టు తరఫున మరో రూ.50 లక్షల విరాళం.. ఇతర పామాయిల్ పారిశ్రామిక వేత్తలు నుంచి దాదాపు మరో రూ. 47 లక్షలు విరాళం కలిపి మొత్తం రూ. 2.97 కోట్లు సీఎం చంద్రబాబుకు అందజేశారు.. కనివినీ ఎరుగని రీతిలో వరద వచ్చింది. ఒక్క రోజులోనే 30-40 సెంటి మీటర్ల మేర వర్షం కురిసింది. కేంద్రం కూడా పెద్ద ఎత్తున స్పందించి సాయం అందిస్తుందని ఆశిస్తున్నాం. ప్రతి ఒక్కరూ వరద సాయం అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు సోమిరెడ్డి..
Read Also: Hyundai Alcazar 2024: ‘హ్యుందాయ్ అల్కాజార్’ నయా వెర్షన్ వచ్చేసింది.. ధర ఎంతంటే?
ఇక, సీఎం చంద్రబాబును కలిశారు ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల జేఏసీ… తమ వంతు సాయంగా వరద సాయం అందించారు ఎక్సైజ్ ఉద్యోగులు. మా శాఖ నుంచి రూ. 2.70 కోట్ల మేర వరదబాధితులకు సాయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అందించారు ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు.
తాజావార్తలు
-
SSC Stenographer: ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 731 స్టెనోగ్రాఫర్ పోస్టులకు రిజిస్ట్రేషన్ ప్రారంభం
-
PM Modi : మే 9న తెలంగాణకు ప్రధాని మోడీ.. పరేడ్ గ్రౌండ్స్లో భారీ బహిరంగ సభ.!
-
Hyderabad Metro : మెట్రోపై ప్రభుత్వ హక్కు.. L&Tకి గుడ్బై!
-
Diamond Chips Recipe: టీ టైమ్ స్నాక్ అంటే ఇదే.. పర్ఫెక్ట్ ‘డైమండ్ చిప్స్’ ఇలా చేయండి!
-
PBSK Vs DC: SRH రికార్డు కనుమరుగు.. విధ్వంసం స్పష్టించిన పంజాబ్ ఓపెనర్స్..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!