Deputy CM Pawan Kalyan tweet: వాటిపైనే ఫిర్యాదులు.. పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్..
- తనకు వస్తున్న ఫిర్యాదులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ట్వీట్..
- ప్రభుత్వ భూముల ఆక్రమణ.. బలవంతపు భూసేకరణపై అనేక ఫిర్యాదులు..
- ఫిర్యాదులు అందిన వెంటనే పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలన్న పవన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan tweet: తనకు ఎక్కువగా వస్తున్న ఫిర్యాదులను సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రెవెన్యూ, పంచాయతీ, దేవాదాయ శాఖల పరిధిలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలతోపాటు బలవంతపు భూసేకరణ ఘటనలపై నాకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్న ఆయన.. బాధితులు, సంబంధిత శాఖల నుంచి ఇలాంటి ఫిర్యాదులు అందిన వెంటనే పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలని కోరారు.. ఈ ఫిర్యాదులలో గణనీయమైన సంఖ్యలో @KAKINADAPOLICE మరియు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండి వస్తున్నాయని తెలిపారు.. అన్ని జిల్లాల కలెక్టర్లు మరియు కాకినాడ పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఈ ఫిర్యాదులపై దృష్టి సారించి, కఠినంగా వ్యవహరించాలని నేను కోరుతున్నాను అన్నారు.
Read Also: Pushpa 2 : ‘కిసిక్’ సాంగ్ పాడింది వీళ్లే.. ఏయే భాషలో ఎవరు పాడారంటే ?
Also Read
- Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
- AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
- IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
- AP NDA: కూటమి భారీ ప్లాన్.. రెండేళ్ల పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ
ఇక, ఈ ఫిర్యాదులకు ప్రాధాన్యమివ్వాలని మరియు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నేను అన్ని జిల్లాల కలెక్టర్లు మరియు పోలీసు సూపరింటెండెంట్లను కోరుతున్నాను అని ట్విట్టర్లో రాసుకొచ్చారు పవన్ కల్యాణ్.. ఈ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించడానికి, మా ప్రభుత్వం నాలుగు దశాబ్దాల నాటి ఫ్రేమ్వర్క్ను సమగ్రంగా మార్చే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ (నిషేధం) చట్టాన్ని తీసుకొచ్చింది.. ఈ కొత్త చట్టంలో కఠినమైన జరిమానాలు, బాధితులకు పరిహారం, ప్రభుత్వ భూముల రక్షణ, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు, నివారణ చర్యలు, మెరుగైన భూ రికార్డులు మరియు టైటిల్ వెరిఫికేషన్ మరియు సమర్థవంతమైన ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ ఉంటాయని తెలిపారు.. మా NDA ప్రభుత్వం ప్రభుత్వ భూములను రక్షించడం, బాధితులకు న్యాయం చేయడం మరియు రాష్ట్ర వనరులను రక్షించడంలో నేరస్థులను బాధ్యులను చేయడంలో కట్టుబడి ఉందని ట్విట్టర్ (ఎక్స్)లో పోస్టు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
I have been receiving numerous complaints about the encroachment of government lands, including those under Revenue, Panchayat, and Endowments departments, as well as incidents of forceful land grabbing. The police department must act immediately upon receiving such complaints…
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) November 22, 2024
తాజావార్తలు
-
MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
-
NBK 112 : బాలయ్య సినిమాలో విలన్ గా యాంగ్రీ యంగ్ సీనియర్ హీరో?
-
Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
-
Shreyas Iyer: కేక్పై ఐసింగ్ లాంటిది.. టీమిండియా కెప్టెన్సీపై తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్!
-
Sriram Krishnan: ట్రంప్ ప్రభుత్వానికి షాక్.. AI విధాన సలహాదారు పదవికి శ్రీరామ్ కృష్ణన్ రాజీనామా
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!