Deputy CM Pawan Kalyan tweet: వాటిపైనే ఫిర్యాదులు.. పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్..
- తనకు వస్తున్న ఫిర్యాదులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ట్వీట్..
- ప్రభుత్వ భూముల ఆక్రమణ.. బలవంతపు భూసేకరణపై అనేక ఫిర్యాదులు..
- ఫిర్యాదులు అందిన వెంటనే పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలన్న పవన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan tweet: తనకు ఎక్కువగా వస్తున్న ఫిర్యాదులను సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రెవెన్యూ, పంచాయతీ, దేవాదాయ శాఖల పరిధిలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలతోపాటు బలవంతపు భూసేకరణ ఘటనలపై నాకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్న ఆయన.. బాధితులు, సంబంధిత శాఖల నుంచి ఇలాంటి ఫిర్యాదులు అందిన వెంటనే పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలని కోరారు.. ఈ ఫిర్యాదులలో గణనీయమైన సంఖ్యలో @KAKINADAPOLICE మరియు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండి వస్తున్నాయని తెలిపారు.. అన్ని జిల్లాల కలెక్టర్లు మరియు కాకినాడ పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఈ ఫిర్యాదులపై దృష్టి సారించి, కఠినంగా వ్యవహరించాలని నేను కోరుతున్నాను అన్నారు.
Read Also: Pushpa 2 : ‘కిసిక్’ సాంగ్ పాడింది వీళ్లే.. ఏయే భాషలో ఎవరు పాడారంటే ?
Also Read
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
- Deputy CM Pawan Kalyan: రాష్ట్ర సంపదను కాపాడుతాం.. స్మగ్లర్లకు పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
ఇక, ఈ ఫిర్యాదులకు ప్రాధాన్యమివ్వాలని మరియు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నేను అన్ని జిల్లాల కలెక్టర్లు మరియు పోలీసు సూపరింటెండెంట్లను కోరుతున్నాను అని ట్విట్టర్లో రాసుకొచ్చారు పవన్ కల్యాణ్.. ఈ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించడానికి, మా ప్రభుత్వం నాలుగు దశాబ్దాల నాటి ఫ్రేమ్వర్క్ను సమగ్రంగా మార్చే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ (నిషేధం) చట్టాన్ని తీసుకొచ్చింది.. ఈ కొత్త చట్టంలో కఠినమైన జరిమానాలు, బాధితులకు పరిహారం, ప్రభుత్వ భూముల రక్షణ, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు, నివారణ చర్యలు, మెరుగైన భూ రికార్డులు మరియు టైటిల్ వెరిఫికేషన్ మరియు సమర్థవంతమైన ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ ఉంటాయని తెలిపారు.. మా NDA ప్రభుత్వం ప్రభుత్వ భూములను రక్షించడం, బాధితులకు న్యాయం చేయడం మరియు రాష్ట్ర వనరులను రక్షించడంలో నేరస్థులను బాధ్యులను చేయడంలో కట్టుబడి ఉందని ట్విట్టర్ (ఎక్స్)లో పోస్టు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
I have been receiving numerous complaints about the encroachment of government lands, including those under Revenue, Panchayat, and Endowments departments, as well as incidents of forceful land grabbing. The police department must act immediately upon receiving such complaints…
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) November 22, 2024
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!