Deputy CM Pawan Kalyan tweet: వాటిపైనే ఫిర్యాదులు.. పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్..
- తనకు వస్తున్న ఫిర్యాదులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ట్వీట్..
- ప్రభుత్వ భూముల ఆక్రమణ.. బలవంతపు భూసేకరణపై అనేక ఫిర్యాదులు..
- ఫిర్యాదులు అందిన వెంటనే పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలన్న పవన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan tweet: తనకు ఎక్కువగా వస్తున్న ఫిర్యాదులను సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. రెవెన్యూ, పంచాయతీ, దేవాదాయ శాఖల పరిధిలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలతోపాటు బలవంతపు భూసేకరణ ఘటనలపై నాకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్న ఆయన.. బాధితులు, సంబంధిత శాఖల నుంచి ఇలాంటి ఫిర్యాదులు అందిన వెంటనే పోలీసు శాఖ చర్యలు తీసుకోవాలని కోరారు.. ఈ ఫిర్యాదులలో గణనీయమైన సంఖ్యలో @KAKINADAPOLICE మరియు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుండి వస్తున్నాయని తెలిపారు.. అన్ని జిల్లాల కలెక్టర్లు మరియు కాకినాడ పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఈ ఫిర్యాదులపై దృష్టి సారించి, కఠినంగా వ్యవహరించాలని నేను కోరుతున్నాను అన్నారు.
Read Also: Pushpa 2 : ‘కిసిక్’ సాంగ్ పాడింది వీళ్లే.. ఏయే భాషలో ఎవరు పాడారంటే ?
Also Read
- Speaker Ayyanna Patrudu: ఉచిత పథకాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
- COVID-19: ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. నలుగురు మృతి.. ప్రజలకు కీలక సూచనలు
- AP Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..
- Talliki Vandanam Scheme: గుడ్న్యూస్.. రూ.10,049 కోట్లు విడుదల.. 'తల్లికి వందనం'కి సొమ్ము ఖాతాల్లో పడేది ఎప్పుడంటే..?
ఇక, ఈ ఫిర్యాదులకు ప్రాధాన్యమివ్వాలని మరియు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నేను అన్ని జిల్లాల కలెక్టర్లు మరియు పోలీసు సూపరింటెండెంట్లను కోరుతున్నాను అని ట్విట్టర్లో రాసుకొచ్చారు పవన్ కల్యాణ్.. ఈ సమస్యను సమర్థవంతంగా పరిష్కరించడానికి, మా ప్రభుత్వం నాలుగు దశాబ్దాల నాటి ఫ్రేమ్వర్క్ను సమగ్రంగా మార్చే ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ (నిషేధం) చట్టాన్ని తీసుకొచ్చింది.. ఈ కొత్త చట్టంలో కఠినమైన జరిమానాలు, బాధితులకు పరిహారం, ప్రభుత్వ భూముల రక్షణ, ప్రత్యేక కోర్టుల ఏర్పాటు, నివారణ చర్యలు, మెరుగైన భూ రికార్డులు మరియు టైటిల్ వెరిఫికేషన్ మరియు సమర్థవంతమైన ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ ఉంటాయని తెలిపారు.. మా NDA ప్రభుత్వం ప్రభుత్వ భూములను రక్షించడం, బాధితులకు న్యాయం చేయడం మరియు రాష్ట్ర వనరులను రక్షించడంలో నేరస్థులను బాధ్యులను చేయడంలో కట్టుబడి ఉందని ట్విట్టర్ (ఎక్స్)లో పోస్టు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
I have been receiving numerous complaints about the encroachment of government lands, including those under Revenue, Panchayat, and Endowments departments, as well as incidents of forceful land grabbing. The police department must act immediately upon receiving such complaints…
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) November 22, 2024
తాజావార్తలు
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
-
Sir Garfield Sobers: ప్రముఖ క్రికెట్ దిగ్గజం కన్నుమూత.. బర్త్డేకు ముందు గార్ఫీల్డ్ సోబర్స్ మృతి
-
Parthiv Patel: హిట్మ్యాన్ను తక్కువ అంచనా వేయొద్దు’.. రోహిత్ రిటైర్మెంట్ మధ్య మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
-
Trump: ట్రక్ డ్రైవర్లకు ట్రంప్ బిగ్ షాక్.. భారతీయులపై తీవ్ర ప్రభావం!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?