CPM Raghavulu: డీలిమిటేషన్పై అమిత్ షా వ్యాఖ్యలు మోసపూరితం
- డీలిమిటేషన్పై అమిత్ షా వ్యాఖ్యలు మోసపూరితం
- బీజేపీ రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు పెరిగితే.. అది మోసం కాదా..?
- సీపీఎం రాఘవులు ఆగ్రహం
డీలిమిటేషన్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను సీపీఎం రాఘవులు తప్పుపట్టారు. అమిత్ షా చాలా మోసపూరితంగా మాట్లాడారన్నారు. బీజేపీ అనుకున్న రాష్ట్రాలకు మాత్రమే ఎంపీ సీట్లు పెరిగితే.. అది మోసం కాదా..? అని నిలదీశారు. పార్లమెంటు సీట్లు పెంచాలంటే అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. డీలిమిటేషన్ మీద చంద్రబాబు, పవన్ కల్యాణ్.. అమిత్ షాకి వంతపాడతారా..? ఎదురుతిరుగుతారో చెప్పాలని రాఘవులు డిమాండ్ చేశారు.
కోతల బడ్జెట్..
ఏపీ బడ్జెట్ కోతల బడ్జెట్ తప్ప నిజాయితీ కలిగిన బడ్జెట్ కాదు అని రాఘవులు ధ్వజమెత్తారు. ‘‘బడ్జెట్లో చూపిస్తున్న అంకెలు సంవత్సరంలో కోతబడతాయి. పన్నేతర ఆదాయం రూ. 12 వేలు పెరుగుతుందని.. అది ఎలా తెస్తారో చెప్పలేదన్నారు. మభ్యపెట్టడానికి చేసినదే ఏపీ బడ్జెట్. బడ్జెట్ ప్రారంభంలోనే మూడు సిక్స్లు లేకుండా పోయాయి. మిగిలిన మూడు సిక్స్ల్లో లబ్ధిదారుల కోత పెడతారని అర్థమవుతుంది. ప్రకటించిన డీఎస్సీని వర్గీకరణ అనంతరమే ప్రకటిస్తాంమంటూ వాయిదా వేసే పరిస్ధితి కనిపిస్తోంది. బడ్జెట్ చూస్తే సంవత్సరం పాటు ఆకలి లేకుండా పోయేలా ఉంది. వెలిగొండ తక్కువ ఖర్చుతో పూర్తయ్యేది చేయడం లేదు. సంతృప్తి పరచడానికి మాత్రమే బడ్జెట్ కేటాయింపులు.’’ ఉన్నాయని రఘవులు ఆరోపించారు.
Also Read
- Governor Abdul Nazeer: ఏపీ గవర్నర్కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..
- CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. సమన్వయంతో పని చేయండి.. ఆత్మ విమర్శ అవసరం..
- Vijayasai Reddy: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన.. మళ్లీ రాజకీయ ప్రవేశం..
- CM Chandrababu: టీడీపీలో కార్యకర్తలే అధినేతలు... రైట్ రాయల్గా బతకాలి..
ఇది కూడా చదవండి: Sankranthiki Vasthunnam: నేటి నుండి ఓటీటీలో సందడి చేయనున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’
జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్చేస్తే ఏపీ, తెలంగాణలో 3 చొప్పునే సీట్లు పెరగనున్నాయి. తెలంగాణలో 17 లోక్సభ సీట్లుండగా 20 వరకు పెరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 25 ఉండగా 28కి పెరుగుతాయి. తమిళనాడులో 39 సీట్లుండగా రెండు పెరిగి 41కి చేరుకుంటాయి. యూపీ, బిహార్లో మాత్రం భారీగా పెరగనున్నాయి. ప్రస్తుతం యూపీలో 80 లోక్సభ స్థానాలు ఉండగా.. 128కి పెరిగే అవకాశం. బీహార్లో 40 సీట్లు ఉండగా 70కి, మధ్యప్రదేశ్లో 29 నుంచి 47కి, మహారాష్ట్రలో 48 నుంచి 68కి, రాజస్థాన్లో 25 నుంచి 44కి లోక్సభ స్థానాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కర్నాటకలో 28 స్థానాలుండగా.. 36కి పెరుగుతాయి.
ఇది కూడా చదవండి: Kannappa Teaser: కన్నప్ప టీజర్ వచ్చేసిందోచ్.. మరి ఎలా ఉందంటే!
తాజావార్తలు
-
New OTT Rules 2026 : ఓటీటీలో కొత్త రూల్స్.. నిర్మాతలకు ‘షాక్’.. వసూళ్లు లేకపోతే రైట్స్ కట్!
-
Ashu Reddy: ప్రేమ, పెళ్లి పేరుతో 9 కోట్లు స్వాహ.. బిగ్ బాస్ అషు రెడ్డి పై సైబర్ కేసు
-
న్యూ లుక్లో YS Jagan.. యూరప్ టూర్కు బయల్దేరిన మాజీ సీఎం.!
-
Lungi Ngidi Injury: లుంగి ఎంగిడికి తీవ్ర గాయం.. 11 నిమిషాల్లోనే ఆస్పత్రికి అంబులెన్స్, తాజా అప్డేట్ ఇదే!
-
Amani: అందుకే మెగాస్టార్ సరసన నటించలేదు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!