CM Chandrababu: కొత్త పాలసీలపై ఫోకస్.. సీఎం వరుస సమీక్షలు..
- వివిధ పాలసీల రూపకల్పనపై సీఎం ఫోకస్..
- పాలసీలపై వరుసగా రెండో రోజు చంద్రబాబు సమీక్షలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివిధ పాలసీల రూపకల్పనపై ఫోకస్ పెట్టారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వివిధ పాలసీలపై వరుసగా రెండో రోజున సీఎం చంద్రబాబు సమీక్షలు జరపనున్నారు.. మద్యం, ఇసుక పాలసీలను ఇప్పటికే అమలు చేస్తోన్న ప్రభుత్వం. రీచుల్లో తవ్వకాలను అనుమతించాలని ఇటీవలే ఇసుక పాలసీలో మార్పులు చేసింది.. ఇక, ఏపీలో మైనింగ్ పాలసీపై తుది కసరత్తు చేస్తున్నారు సీఎం చంద్రబాబు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ విధానామా..? లేక క్వారీల వేలం వేసే విధానామా..? అనే అంశంపై మైనింగ్ పాలసీ విషయంలో తర్జన భర్జన పడుతోంది..
Read Also: World Students Day 2024: నేడు ప్రపంచ విద్యార్థి దినోత్సవం.. అబ్దుల్ కలాం జయంతి రోజునే ఎందుకు..?
Also Read
- Botsa Satyanarayana : కూటమి రెండేళ్ల పాలన ‘సున్నా’.. తిరుపతి సభ ఒక వెన్నుపోటు సభ
- YS Jagan: డీఎస్సీ నియామకాలపై జగన్ సంచలన ఆరోపణలు.. సీబీఐ విచారణకు డిమాండ్
- Minister Satyakumar Yadav: ఆరోగ్యశ్రీ క్రెడిట్ వైఎస్ రాజశేఖర్రెడ్డిదే.. మంత్రి సత్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
- Minister Narayana: అందువల్లే ఖర్చు ఎక్కువ.. అమరావతి నిర్మాణాలపై మంత్రి నారాయణ వివరణ
ఇక, ఈ రోజు సాయంత్రం ఏపీ ఆర్థిక పరిస్థితిపై సమీక్షించనున్నారు సీఎం చంద్రబాబు. బడ్జెట్ ప్రవేశపెట్టే అంశంపై సమీక్షలో ప్రస్తావనకు వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు.. ఆదాయార్జన శాఖలను మరింత మెరుగుపరిచి ఏ విధంగా ఆదాయం సముపార్జించాలనే అంశంపై చర్చించనున్నారు ఏపీ సీఎం.. కేంద్ర పథకాలకు యూసీల చెల్లింపులు ఏ మేరకు జరుగుతున్నాయనే అంశంపై ఆరా తీయనున్నారు చంద్రబాబు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో ఏమైనా పెండింగ్ ఉన్నాయా..? ఉంటే వాటిని ఏ విధంగా తీసుకు రావాలనే అంశంపై ఈ సమావేశంలో సమీక్షించబోతున్నారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కాగా, నిన్నటినిన్న ఐటీ, ఎలక్ట్రానిక్స్, డ్రోన్ పాలసీలపై సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు.. వివిధ రాష్ట్రాల్లో ఉన్న పాలసీలు, ఆయా రంగాల్లో ఉన్న నిపుణులతో చర్చించి కొత్త పాలసీలు రూపొందించినట్లు వివరించారు. ఎలక్ట్రానిక్స్ పాలసీపై చర్చించిన ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే క్యాబినెట్ లో ఎలక్ట్రానిక్ పాలసీని తీసుకురావాలని సూచించారు. అదేవిధంగా ఐటీ పాలసీ, డ్రోన్ పాలసీపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. వీటిని మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. ఈనెల 22, 23వ తేదీల్లో తలపెట్టిన అమరావతి డ్రోన్ సమ్మిట్ పై అధికారులు ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్ ఇచ్చారు. కేంద్ర సివిల్ ఏవియేషన్ శాఖ భాగస్వామ్యంతో ఎపి డ్రోన్ కార్పొరేషన్ ఈ సమ్మిట్ ను నిర్వహిస్తోన్న విషయం విదితమే.
తాజావార్తలు
-
Telangana Record : భారతదేశపు అన్నపూర్ణ – మన తెలంగాణ.. ధాన్య సేకరణలో సరికొత్త రికార్డుల విజేత
-
OTR : పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఆ ఎమ్మెల్యే పరిస్థితి?
-
IND Vs AFG: రోహిత్ ‘చారిత్రాత్మక’ రికార్డు.. గిల్ ‘మెరుపు’ ఇన్నింగ్స్.. అఫ్గాన్పై భారత్ ఘనవిజయం..
-
Chiranjeevi : కొడుకు నటనపై చిరంజీవి ఎమోషనల్! “‘పుత్రోత్సాహం’ అంటే ఇప్పుడే తెలిసింది..
-
Shubman Gill: విరాట్ కోహ్లీ రికార్డు బద్దలు.. శుభ్మన్ గిల్ అరుదైన మైలురాయి..
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!