CM Chandrababu: కలెక్టర్ల కాన్ఫరెన్స్.. క్లాస్ తీసుకున్న సీఎం చంద్రబాబు..
- కలెక్టర్ట కాన్ఫరెన్స్లో వివిధ శాఖల అధికారులకు చురకలు..
- కాంతిలాల్ దండేకు క్లాస్ తీసుకున్న సీఎం చంద్రబాబు..
- పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కొన్ని అంశాలు ప్రస్తావించ లేదన్న సీఎం..
- డిప్యూటీ సీఎం పవన్ సమక్షంలోనే అటవీ శాఖ అధికారుల తీరును ప్రస్తావిస్తున్నాన్న చంద్రబాబు..
- ముసి ముసిగా నవ్వుకున్న పవన్ కల్యాణ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: కలెక్టర్ట కాన్ఫరెన్స్లో వివిధ శాఖల అధికారులకు చురకలు అంటించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కాంతిలాల్ దండేకు క్లాస్ తీసుకున్నారు సీఎం చంద్రబాబు. దండే ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కొన్ని అంశాలు ప్రస్తావించ లేదన్న సీఎం.. ఏపీలో మొత్తం 12 వేల కిలోమీటర్ల మేర స్టేట్ హైవేస్ ఉంటే.. 1000 కిలో మీటర్ల పీపీపీ ప్రాతిపదికన రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు దండే పేర్కొనడంపై స్పందిస్తూ.. 1000 కిలో మీటర్లు ఏ మూలకు సరిపోవన్నారు చంద్రబాబు. అధికారులకు ఇంకా మూస పద్దతిలోనే వెళ్తున్నారన్న సీఎం.. కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాలతో వెళ్తోంటే దాన్ని అందిపుచ్చుకోలేక పోతున్నారని.. రైల్ ఓవర్ బ్రిడ్జిలపై కాంతి లాల్ దండే తన ప్రజెంటేషనులో ప్రస్తావించ లేదంటూ చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు..
Read Also: Mallu Bhatti Vikramarka: మధిరలో ఆగ్రో ఇండస్ట్రీస్ కేంద్రం.. రింగ్ రోడ్ల నిర్మాణాకి ప్రణాళికలు..
Also Read
- CM Chandrababu : చంద్రబాబు ఫుల్ బిజీ.. ఉత్తరాంధ్రలో ఒక్కరోజే 3 జిల్లాలు..
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- YS Viveka M*urder Case: వైఎస్ వివేకా కేసులో ఈడీ కీలక ప్రకటన.. అవినాష్ రెడ్డి ఇంట్లో రూ.24 లక్షలు సీజ్
- Deputy CM Pawan Kalyan: పవన్ కల్యాణ్కు ఆయుర్వేద థెరపీ.. రేపు కేరళకు డిప్యూటీ సీఎం
ఇక, అటవీ శాఖ అధికారుల తీరుపై చంద్రబాబు ఆసక్తికర కామెంట్లు చేశారు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలోనే అటవీ శాఖ అధికారుల తీరును ప్రస్తావిస్తున్నానన్న ఏపీ సీఎం. అటవీ శాఖ వద్ద భారీ ఎత్తున ఫైళ్లు పెండింగులో ఉన్నాయన్నారు.. అటవీ సంపదను దోచుకెళ్తోంటే చూస్తూ ఉంటున్న అటవీ అధికారులు.. ఓ రోడ్ నిర్మించాలంటే మాత్రం అనుమతులివ్వడం లేదన్నారు.. చంద్రబాబు కామెంట్లతో ముసి ముసిగా నవ్వుకున్నారు పవన్ కల్యాణ్.. గత ప్రభుత్వం భారీ ఎత్తున దోచేశారన్న చంద్రబాబు. మరోవైపు.. చీరాలలో చేనేత దినోత్సవం చేపడుతున్నామన్నారు.. చీరాల కాదు.. విజయవాడలో పెట్టామన్న చేనేత శాఖ ముఖ్య కార్యదర్శి సునీత. ఏమమ్మా.. చీరాల రావడానికి ఏమైనా ఇబ్బందా..? అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.. ఎలాంటి కార్యక్రమాన్నైనా రూరల్ ప్రాంతాల్లోనే పెట్టాలని స్పష్టం చేశారు.. అజెండా హెవీగా ఉందా.. అంటూ అధికారులను నవ్వుతూ ప్రశ్నించిన సీఎం. ఇవన్నీ రెగ్యులర్గా మీరు చేసే పనులే.. అలవాటు తప్పడం వల్ల హెవీగా ఉన్నట్టు అనిపిస్తోందంటూ సెటైర్లు వేశారు.. త్వరలోనే పని చేయడం అలవాటు అవుతుందని వ్యాఖ్యానించారు సీఎం చంద్రబాబు నాయుడు.
తాజావార్తలు
-
Welcome To The Jungle OTT: పొట్ట చెక్కలయ్యే కామెడీతో 192 కోట్ల గ్రాస్.. ఓటీటీలో 24 గంటల్లోనే నంబర్ 1 ట్రెండింగ్!
-
Pawan Kalyan: ‘నా అన్నయ్యే నా ఏకైక హీరో’.. ‘చిరు’ పుట్టినరోజున తమ్ముడు ఎమోషనల్ పోస్ట్..!
-
Mugguru Kothulu First Look: గాంధీజీ మూడు సూత్రాలతో ‘ముగ్గురు కోతులు’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్
-
TVS Ronin Price Hike: టీవీఎస్ Ronin ఆరు వేరియంట్ల ధరలు పెంపు.. కొత్త ప్రైస్ లిస్ట్ ఇదే
-
Toxic Censor Report: ‘టాక్సిక్’కు సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చిందా.?
ట్రెండింగ్
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?