CM Chandrababu: సీఎం కీలక ఆదేశాలు.. వారి నుంచి పెన్షన్ మొత్తం రికవరీ..
- కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
- అర్హతలేకున్నా పించన్లు తీసుకున్న వారి నుంచి పెన్షన్ మొత్తం రికవరీ..
- తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చిన డాక్టర్లను ప్రాసిక్యూట్ చేయండి..
- పింఛన్ల కోసం మెడికల్ బోర్డుల నుంచి భోగస్ సర్టిఫికెట్స్ ఇస్తున్నారని ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: అర్హతలేకున్నా పించన్లు తీసుకున్న వారి నుంచి అప్పటి వరకు తీకున్న పెన్షన్ మొత్తం రికవరీ చేయండి అంటూ ఆదేశాలు జారీ చేశారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అయితే, ఏపీలో అనర్హులు కూడా పెన్షన్లు అందుకుంటున్నట్టు స్పష్టం అవుతోంది.. ప్రతీ 10 వేల మందిలో ఏకంగా దాదాపు ఐదు వందల మంది అనర్హులే పెన్షన్లు తీసుకుంటున్నట్టు గుర్తించారు.. రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణపేదరిక నిర్మూలన శాఖలపై ప్రజెంటేషన్ ఇచ్చారు ఆ శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్.. పెన్షన్ లు అర్హత లేనివారికి వస్తున్నాయనే ఫిర్యాదులు ఉన్నాయని వెల్లడించిన ఆయన.. తాము నిర్వహించిన సర్వేలో ప్రతీ పదివేలకూ 500 మంది వరకూ అనర్హులని తేలినట్టు స్పష్టం చేశారు.. దీనిపై సీరియస్గా స్పందించారు సీఎం చంద్రబాబు. వచ్చే మూడు నెలల్లోగా ప్రతీ పెన్షన్ ను జిల్లా కలెక్టర్లు పరిశీలించాలని ఆదేశించారు.. అర్హతలేకున్నా పించన్లు తీసుకున్న వారి ఆ మొత్తాన్ని రికవరీ చేయాలని స్పష్టం చేశారు..
Read Also: Mallu Bhatti Vikramarka: సంక్రాంతి నుంచి రైతు భరోసా.. ఇప్పటికే ప్రకటించామన్న భట్టి
Also Read
- Atchannaidu: ఎరువుల అక్రమ రవాణాపై మంత్రి సీరియస్.. డీలర్లపై కఠిన చర్యలకు ఆదేశాలు
- AP Heatwave Alert: ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
- TDP Mahanadu 2026: మహానాడులో 20 కీలక తీర్మానాలు.. తెలంగాణ నుంచి 4 ప్రత్యేక ప్రతిపాదనలు!
- Deputy CM Pawan Kalyan: పంచాయతీరాజ్ శాఖలో ప్రత్యేక డ్యాష్బోర్డులు.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు..
ఇక, పింఛన్ల కోసం తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చిన డాక్టర్లను ప్రాసిక్యూట్ చేయండి అని ఆదేశించారు సీఎం చంద్రబాబు.. పింఛన్ల కోసం మెడికల్ బోర్డుల నుంచి భోగస్ సర్టిఫికెట్స్ ఇస్తున్నారు.. ప్రత్యేకంగా కొన్ని ఆస్పత్రుల నుంచే ఈ భోగస్ సర్టిఫికెట్స్ ఇస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలోని దంతా నియోజకవర్గంలో 484 పింఛన్లు ఉంటే అందులో 78 వికలాంగ పింఛన్లే.. 78 ఫించన్ దారులను పరిశీలిస్తే అందులో 22 మందే అర్హులుగా తేలింది.. అనర్హులైన 56 మందిలో 27 మంది విచారణకు కూడా రాలేదని ఆ జిల్లా కలెక్టర్ వివరించారు..
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!