CM Chandrababu: రెవెన్యూ, ఆదాయార్జన శాఖలపై సీఎం సమీక్ష.. కలెక్టర్లకు దిశానిర్దేశం.
- రెవెన్యూ, ఆదాయార్జన శాఖలపై సీఎం సమీక్ష..
- జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu:రెవెన్యూ, ఆదాయార్జన శాఖలపై సమీక్షించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు.. కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.. తిరుపతి ఎర్రచందనం డిపో సీసీటీవీలను ఏర్పాటు చేసి పర్యవేక్షించాలన్నారు.. ఎర్రచందనం దుంగలను వ్యాల్యూ అడిషన్ చేసి ఉత్పత్తులు తయారు చేయాలి.. అలాగే ఎర్రచందనం ఉత్పత్తులు, ఇతర అంశాలు తెలియచేసేలా డిపో వద్ద ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను ఏర్పాటు చేయాలన్నారు.. ప్రపంచ వ్యాప్తంగా ఎర్రచందనం అనేది ఓ అరుదైన జాతి వృక్షంగా పేర్కొన్నారు.. ఇక, మోటారు వాహనాల పన్నులపై కలెక్టర్లు దృష్టి సారించాలి.. మున్సిపల్ విభాగం శాటిలైట్ చిత్రాల ఆధారంగా అక్రమ కట్టడాలను గుర్తించేలా ప్రక్రియ చేపట్టాలి.. బీపీఎస్, ఎల్ఆర్ఎస్ స్కీమ్ ను పూర్తి చేసేలా కలెక్టర్లు ఫోకస్ చేయాలి.. కొత్త లేఔట్లలో డ్రైన్లకు స్థలం కేటాయించేలా అధికారులు దృష్టి సారించాలని స్పష్టం చేశారు..
Read Also: Meghalaya Political Crisis: మేఘాలయలో ఒకేరోజు 8 మంది మంత్రులు రాజీనామా.. ఈశాన్య రాష్ట్రంలో గందరగోళం
Also Read
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
ఇక, స్వర్ణ పంచాయత్ పోర్టల్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి.. గ్రామకంఠంలోని ఆస్తులకు కోటికి పైగా యాజమాన్య పత్రాలు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్లకు సూచించారు సీఎం చంద్రబాబు.. 60 శాతం ఫిర్యాదులు రెవెన్యూ శాఖ లోనే వస్తున్నాయన్న ఆయన.. కులధృవీకరణ, భూములు ఇలా వేర్వేరు అంశాలు ఉన్నాయి.. 22 ఏలో భూములు పెట్టేయటం లాంటి చర్యల వల్ల దుష్పలితాలు వచ్చాయన్నారు.. గత ప్రభుత్వ హయాంలో, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తీసుకువచ్చి ఇష్టానుసారం వ్యవహరించారు.. ఇప్పుడా చట్టాన్ని రద్దు చేసి ప్రజల ఆస్తుల రక్షణకు వీలుగా చట్టాన్ని తెచ్చాం.. భూముల్ని కాజేయడానికి 22ఏలో పెట్టి బ్లాక్ మెయిల్ చేశారు. రీసర్వే చేసి ఈ రికార్డులను సరిచేయాలి. నిర్దేశిత గడువులోగా వీటిని ప్రక్షాళన చేయాని కలెక్టర్లను ఆదేశించారు సీఎం చంద్రబాబు..
Read Also: Indiramma Housing Scheme: ఇందిరమ్మ లిస్ట్లో పేర్లు తొలగించారని నిరసన.. వాటర్ ట్యాంక్ ఎక్కిన మహిళల!
కులం ఎవరిదీ మారిపోదు దానిని శాశ్వతప్రాతిపదికన ఇవ్వాలి.. నివాస, వయో ధృవీకరణ కోసం ప్రతీ ఏటా జారీ చేయొచ్చు.. అభ్యంతరం లేని భూములన్నీ రెగ్యులర్ చేస్తే సమస్య శాశ్వతంగా పరిష్కృతం అవుతుందన్నారు సీఎం చంద్రబాబు.. 2027 కంటే ముందే రీసర్వే ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రయత్నించండి అని సలహా ఇచ్చిన ఆయన.. రికార్డులన్నీ ప్రక్షాళన చేయటమే లక్ష్యంగా పని చేయాలి.. జియో ట్యాగింగ్, క్యూఆర్ కోడ్ కూడా పెట్టి రికార్డులు ఇస్తాం.. వీఎంలు, కేఎంలు మార్చాం కానీ రెవెన్యూ విలేజిలను మార్చలేకపోతున్నాం అన్నారు.. ఇక, అక్టోబరు 22 వరకూ నెల రోజుల పాటు జీఎస్టీ ప్రయోజనాలు వివరించేలా విస్తృత ప్రచారం చేయాలన్నారు సీఎం చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి