CM Chandrababu: పెరిగిన క్రైమ్ రేట్..! శాంతిభద్రతలపై కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం కీలక ఆదేశాలు..
- కలెక్టర్ కాన్ఫెరెన్స్ లో శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు సమీక్ష..
- యూరియా అంశంలో కొందరు కావాలనే ప్రభుత్వంపై దుష్ప్రచారం..
- వదంతులు సృష్టించి శాంతిభద్రతల సమస్య తీసుకురావాలనే ప్రయత్నం..
- అత్యుత్తమ పనితీరు.. టెక్నాలజీ సాయంతో..
- క్రైం రేట్ తగ్గించడంలో ముఖ్యమైనవన్న సీఎం చంద్రబాబు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: కలెక్టర్ కాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు కలెక్టర్లు.. ఎస్పీలతో కలిసి శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించారు.. యూరియా కొరతకు సంబంధించి ప్రధానంగా చర్చకు వచ్చింది.. రాష్ట్రంలో యూరియా కొరత ఉందని.. తప్పుడు ప్రచారం జరిగిందన్నారు సీఎం చంద్రబాబు.. అనవసర అసత్య ప్రచారం చేసారన్నారు… అమెరికా నుంచి కూడా వందల్లో పోస్టింగ్స్ పెట్టారన్నారు. ఇలాంటి వాటినే రియల్ టైమ్ గవర్నెన్సులో విశ్లేషించి తక్షణ నిర్ణయాలు తీసుకోవాలన్నారు చంద్రబాబు.. క్రైమ్ రేట్ 4 శాతం మేర, సైబర్ క్రైమ్ 16 శాతం పెరిగిందని చెబుతున్నారని.. శాంతిభద్రతల విషయంలో ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావాలన్నారు సీఎం చంద్రబాబు.. డ్రగ్స్ నివారణపై ఇంకా ప్రచారం పెరగాలన్నారు.. గంజాయి వినియోగం అరికట్టేలా మరింత ఫోకస్ పెట్టాలని.. గంజాయి రవాణాను పూర్తి స్థాయిలో అరికట్టేలా నిఘా పెంచాలన్నారు. డ్రగ్స్ ను ఓవర్ నైట్ నియంత్రించాలి అనుకోవటం సరికాదని… అదో నిరంతర ప్రక్రియగా కొనసాగాలన్నారు.. సీసీటీవీ కెమెరాలు భద్రతా పర్యవేక్షణకు ఉపయోగపడతాయన్నారు. నియంత్రణ లేకపోవటం వల్లే 90 శాతం మేర రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు చంద్రబాబు.
Read Also: Mirai: ఫ్యామిలీతో మిరాయ్ చూసిన బాలయ్య!
Also Read
- Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
- Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్ సీసీటీవీలపై ఏసీపీ టీమ్ ఫోకస్..
- Annadata Sukhibhava: అన్నదాతలకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్.. ఖాతాల్లోకి సుఖీభవ నిధులు
- AP Women's Commission Notice: గుడివాడ అమర్నాథ్కు మహిళా కమిషన్ షాక్.. విచారణకు రావాలంటూ నోటీసులు..
సైబర్ క్రైమ్ లో ప్రజలు నెలకు రూ.30 కోట్ల మేర కోల్పోతున్నారని.. క్రిమినల్స్ టెక్నాలజీ మాస్టర్లుగా ఉన్నారన్నారు.. వారికంటే అడ్వాన్స్గా మనవాళ్లు మారాలన్నారు సీఎం చంద్రబాబు.ఫోరెన్సిక్స్ కూడా మరింత సమర్ధవంతంగా ఉండాలన్నారు. క్రైమ్ జరిగిన తర్వాత ఎంత సమయంలోగా ఘటనా స్థలికి వెళ్లగలుగుతున్నారు, క్రైమ్ సీన్ ప్రోటెక్షన్ ఎలా జరుగుతోందన్నది కూడా ముఖ్యం అన్నారు సీఎం చంద్రబాబు.. పోలీసు డాగ్స్ శిక్షణ, ప్రతీ రెవెన్యూ డివిజన్ లో డాగ్ స్క్వాడ్ ఉండాలన్నారు. క్రైమ్ సీన్ సైట్ ను డెస్ట్రాయ్ చేయటం పెద్ద నేరమన్నారు.. వివేకా హత్యకేసు అతిపెద్ద ఘటన. ఒక సీఐ దగ్గరుండి రక్తం కడిగించటం ఏమిటని ప్రశ్నించారు.. అప్పట్లో ఆ వివరాలను ఎవరూ నా నోటీసుకు తేలేకపోయారన్నారు చంద్రబాబు..
Read Also: Pakistan: మధ్యవర్తిత్వానికి భారత్ ఒప్పుకోలేదు.. ట్రంప్ వాదనలపై పాక్ మంత్రి సంచలనం..
అంతర్గత భద్రత అనేది ఇప్పుడు ఓ అంశంగా మారిపోయిందని.. దీనిపైనా దృష్టి పెట్టాలన్నారు సీఎం చంద్రబాబు. ఇంటెలిజెన్స్ నిఘా మరింతగా పెరగాలని.. టూరిజం రావాలి అంటే భద్రత ఉండాలన్నారు చంద్రబాబు. జిల్లాల్లో బ్యాండ్ విడ్త్ పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నాం అన్నారు. ఆర్టీజీఎస్ తో లింక్ చేసి సమాచారం ప్రభుత్వం నుంచి ఇస్తామన్నారు సీఎం.. అవేర్ ద్వారానూ 42 పారామీటర్లలో సమాచారం పోలీసులకు అందేలా చేస్తాం అన్నారు. సింగపూర్ లో విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీస్.. టెక్నాలజీ అందిపుచ్చుకుని మనం అదే స్థాయికి వెళ్లాలన్నారు చంద్రబాబు. క్రైమ్ కన్విక్షన్ రేట్ ను పెంచాల్సి ఉందని.. లా ఆండ్ ఆర్డర్ లో నో కాంప్రమైజ్, జీరో టాలరెన్స్ ప్రభుత్వ విధానం అన్నారు.. సుగాలీ ప్రీతి కేసును ఇప్పుడు సీబీఐకి పంపించామని.. పాత సెన్సిటివ్ కేసులు వెలికితీయాలన్నారు..
ఇక, గత ప్రభుత్వంలో జరిగిన సుబ్రహ్మణ్యం హత్య, డాక్టర్ సుధాకర్, చంద్రయ్య హత్యకేసు, అమర్నాథ్ గౌడ్ కేసు వంటివాటిల్లో బాధితులకు న్యాయం చేయాలన్నారు చంద్రబాబు. యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ విస్తృతం కావాలని.. సీరియస్ క్రైమ్ ను 50 శాతానికి తగ్గించగలిగామన్నారు.. ఈ విషయంలో కొందరిని గట్టిగా డీల్ చేసి నేరస్తుల్లో భయం తేవాలన్నారు. గత ఏడాది కంటే ఈసారి 30 శాతం నేరాల రేటు తగ్గేలా పోలీస్ యంత్రాంగం కృషి చేయాలన్నారు. అలాగే ప్రజల్లో సంతృప్త స్థాయి పెరగాలని. మనసుపెట్టి పనిచేస్తే అన్నీ సాధ్యమే అన్నారు.. శాంతిభద్రతల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ లేదని.. గతంలో కమ్యూనల్ వయలెన్స్ విషయంలో తాను స్పాట్ కు కూడా వెళ్లానన్నారు సీఎం చంద్రబాబు. గంటలోగా క్రైమ్ సీన్ కు వెళ్లగలిగితే నేరాలకు పాల్పడేందుకు నేరస్థులు ఎవరూ ధైర్యం చేయలేరన్నారు. లా అండ్ ఆర్డర్ లో ఫర్మ్ నెస్ ఉంది అనే భావన ప్రజల్లో ఉండాలన్నారు సీఎం చంద్రబాబు..
తాజావార్తలు
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!