Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Amaravathi Cm Chandrababu Naidu In Collectors And Sps Conference

CM Chandrababu: పెరిగిన క్రైమ్‌ రేట్..! శాంతిభద్రతలపై కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం కీలక ఆదేశాలు..

Published Date :September 16, 2025 , 7:39 pm
By Sudhakar Ravula
  • కలెక్టర్ కాన్ఫెరెన్స్ లో శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు సమీక్ష..
  • యూరియా అంశంలో కొందరు కావాలనే ప్రభుత్వంపై దుష్ప్రచారం..
  • వదంతులు సృష్టించి శాంతిభద్రతల సమస్య తీసుకురావాలనే ప్రయత్నం..
  • అత్యుత్తమ పనితీరు.. టెక్నాలజీ సాయంతో..
  • క్రైం రేట్ తగ్గించడంలో ముఖ్యమైనవన్న సీఎం చంద్రబాబు.
CM Chandrababu: పెరిగిన క్రైమ్‌ రేట్..! శాంతిభద్రతలపై కలెక్టర్లు, ఎస్పీలకు సీఎం కీలక ఆదేశాలు..
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

CM Chandrababu: కలెక్టర్ కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు కలెక్టర్లు.. ఎస్పీలతో కలిసి శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించారు.. యూరియా కొరతకు సంబంధించి ప్రధానంగా చర్చకు వచ్చింది.. రాష్ట్రంలో యూరియా కొరత ఉందని.. తప్పుడు ప్రచారం జరిగిందన్నారు సీఎం చంద్రబాబు.. అనవసర అసత్య ప్రచారం చేసారన్నారు… అమెరికా నుంచి కూడా వందల్లో పోస్టింగ్స్ పెట్టారన్నారు. ఇలాంటి వాటినే రియల్ టైమ్ గవర్నెన్సులో విశ్లేషించి తక్షణ నిర్ణయాలు తీసుకోవాలన్నారు చంద్రబాబు.. క్రైమ్ రేట్ 4 శాతం మేర, సైబర్ క్రైమ్ 16 శాతం పెరిగిందని చెబుతున్నారని.. శాంతిభద్రతల విషయంలో ప్రజల్లో మరింత చైతన్యం తీసుకురావాలన్నారు సీఎం చంద్రబాబు.. డ్రగ్స్‌ నివారణపై ఇంకా ప్రచారం పెరగాలన్నారు.. గంజాయి వినియోగం అరికట్టేలా మరింత ఫోకస్ పెట్టాలని.. గంజాయి రవాణాను పూర్తి స్థాయిలో అరికట్టేలా నిఘా పెంచాలన్నారు. డ్రగ్స్‌ ను ఓవర్ నైట్ నియంత్రించాలి అనుకోవటం సరికాదని… అదో నిరంతర ప్రక్రియగా కొనసాగాలన్నారు.. సీసీటీవీ కెమెరాలు భద్రతా పర్యవేక్షణకు ఉపయోగపడతాయన్నారు. నియంత్రణ లేకపోవటం వల్లే 90 శాతం మేర రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు చంద్రబాబు.

Read Also: Mirai: ఫ్యామిలీతో మిరాయ్ చూసిన బాలయ్య!

Also Read

  • CM Chandrababu : ఇనుప ఖనిజంతో ఏపీకి జాక్‌పాట్.!
  • Proddatur : ప్రొద్దుటూరు మహిళ మిస్టరీ డెత్ కేసును ఛేదించిన పోలీసులు
  • Minister Narayana : గోదావరి పుష్కరాలకు ముందస్తు ప్లాన్.. నిధుల కోసం ప్రధానితో సీఎం చర్చలు
  • CM Chandrababu : గ్లోబల్ బ్రాండ్లుగా స్థానిక ఉత్పత్తులు.. ఏపీలో ప్రొడక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్లపై చంద్రబాబు సమీక్ష
Add as a preferred
source on google

సైబర్ క్రైమ్ లో ప్రజలు నెలకు రూ.30 కోట్ల మేర కోల్పోతున్నారని.. క్రిమినల్స్ టెక్నాలజీ మాస్టర్లుగా ఉన్నారన్నారు.. వారికంటే అడ్వాన్స్‌గా మనవాళ్లు మారాలన్నారు సీఎం చంద్రబాబు.ఫోరెన్సిక్స్ కూడా మరింత సమర్ధవంతంగా ఉండాలన్నారు. క్రైమ్ జరిగిన తర్వాత ఎంత సమయంలోగా ఘటనా స్థలికి వెళ్లగలుగుతున్నారు, క్రైమ్ సీన్ ప్రోటెక్షన్ ఎలా జరుగుతోందన్నది కూడా ముఖ్యం అన్నారు సీఎం చంద్రబాబు.. పోలీసు డాగ్స్ శిక్షణ, ప్రతీ రెవెన్యూ డివిజన్ లో డాగ్ స్క్వాడ్ ఉండాలన్నారు. క్రైమ్ సీన్ సైట్ ను డెస్ట్రాయ్ చేయటం పెద్ద నేరమన్నారు.. వివేకా హత్యకేసు అతిపెద్ద ఘటన. ఒక సీఐ దగ్గరుండి రక్తం కడిగించటం ఏమిటని ప్రశ్నించారు.. అప్పట్లో ఆ వివరాలను ఎవరూ నా నోటీసుకు తేలేకపోయారన్నారు చంద్రబాబు..

Read Also: Pakistan: మధ్యవర్తిత్వానికి భారత్ ఒప్పుకోలేదు.. ట్రంప్ వాదనలపై పాక్ మంత్రి సంచలనం..

అంతర్గత భద్రత అనేది ఇప్పుడు ఓ అంశంగా మారిపోయిందని.. దీనిపైనా దృష్టి పెట్టాలన్నారు సీఎం చంద్రబాబు. ఇంటెలిజెన్స్ నిఘా మరింతగా పెరగాలని.. టూరిజం రావాలి అంటే భద్రత ఉండాలన్నారు చంద్రబాబు. జిల్లాల్లో బ్యాండ్ విడ్త్ పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నాం అన్నారు. ఆర్టీజీఎస్ తో లింక్ చేసి సమాచారం ప్రభుత్వం నుంచి ఇస్తామన్నారు సీఎం.. అవేర్ ద్వారానూ 42 పారామీటర్లలో సమాచారం పోలీసులకు అందేలా చేస్తాం అన్నారు. సింగపూర్ లో విజిబుల్ పోలీసింగ్, ఇన్విజిబుల్ పోలీస్.. టెక్నాలజీ అందిపుచ్చుకుని మనం అదే స్థాయికి వెళ్లాలన్నారు చంద్రబాబు. క్రైమ్ కన్విక్షన్ రేట్ ను పెంచాల్సి ఉందని.. లా ఆండ్ ఆర్డర్ లో నో కాంప్రమైజ్, జీరో టాలరెన్స్ ప్రభుత్వ విధానం అన్నారు.. సుగాలీ ప్రీతి కేసును ఇప్పుడు సీబీఐకి పంపించామని.. పాత సెన్సిటివ్ కేసులు వెలికితీయాలన్నారు..

ఇక, గత ప్రభుత్వంలో జరిగిన సుబ్రహ్మణ్యం హత్య, డాక్టర్ సుధాకర్, చంద్రయ్య హత్యకేసు, అమర్నాథ్ గౌడ్ కేసు వంటివాటిల్లో బాధితులకు న్యాయం చేయాలన్నారు చంద్రబాబు. యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ విస్తృతం కావాలని.. సీరియస్ క్రైమ్ ను 50 శాతానికి తగ్గించగలిగామన్నారు.. ఈ విషయంలో కొందరిని గట్టిగా డీల్ చేసి నేరస్తుల్లో భయం తేవాలన్నారు. గత ఏడాది కంటే ఈసారి 30 శాతం నేరాల రేటు తగ్గేలా పోలీస్ యంత్రాంగం కృషి చేయాలన్నారు. అలాగే ప్రజల్లో సంతృప్త స్థాయి పెరగాలని. మనసుపెట్టి పనిచేస్తే అన్నీ సాధ్యమే అన్నారు.. శాంతిభద్రతల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ లేదని.. గతంలో కమ్యూనల్ వయలెన్స్ విషయంలో తాను స్పాట్ కు కూడా వెళ్లానన్నారు సీఎం చంద్రబాబు. గంటలోగా క్రైమ్ సీన్ కు వెళ్లగలిగితే నేరాలకు పాల్పడేందుకు నేరస్థులు ఎవరూ ధైర్యం చేయలేరన్నారు. లా అండ్ ఆర్డర్ లో ఫర్మ్ నెస్ ఉంది అనే భావన ప్రజల్లో ఉండాలన్నారు సీఎం చంద్రబాబు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • CM Chandrababu Naidu
  • Collectors Conference
  • SPs

తాజావార్తలు

  • Jana Nayagan: ‘జననాయగన్’ టైటిల్ కార్డ్‌తో సోషల్ మీడియా షేక్! దళపతి విజయ్ కాదు.. ఇకపై ‘తమిళనాడు సీఎం’

  • Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..

  • Esther Anil : మోహన్ లాల్’ను పొగడాలంటే వెంకీని తగ్గించాలా?

  • Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్‌లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..

  • Maa Inti Bangaram: ఇట్స్ అఫీషియల్.. సమంత సినిమా వాయిదా

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions