US-Iran: మధ్యప్రాచ్యంలో టెన్షన్.. టెన్షన్.. తక్షణమే ఇరాన్ ఖాళీ చేయాలని అమెరికన్లకు ట్రంప్ వార్నింగ్
- మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం
- ఏ క్షణంలోనైనా ఇరాన్పై దాడి జరిగే సూచనలు
- తక్షణమే ఇరాన్ ఖాళీ చేయాలని అమెరికన్లకు వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ వైపు ఒమన్ వేదికగా ఇరాన్-అమెరికా మధ్య చర్చలు జరుగుతుండగానే ట్రంప్ దగ్గర నుంచి తీవ్ర వార్నింగ్లు వచ్చాయి. చర్చలు విఫలమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అణు ఒప్పందంపై చర్చించేందుకు ఇరాన్ నిరాకరించింది. ఈ నేపథ్యంలో మరోసారి రెండు దేశాల మధ్య టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఇరాన్ వదిలిపెట్టండి…
ఇదిలా ఉంటే తక్షణమే అమెరికన్లు ఇరాన్ను విడిచిపెట్టాలని అమెరికా అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్ నుంచి బయలుదేరడానికి సిద్ధం కావాలని అమెరికన్లకు తాజాగా ఆదేశాలు వెళ్లాయి. ఇరాన్లోని తమ పౌరులు వెంటనే పశ్చిమాసియా దేశాన్ని విడిచి వెళ్లాలని హెచ్చరించింది. ఈ మేరకు ఇరాన్లోని యూఎస్ ఎంబసీ సలహా జారీ చేసింది. దేశ వ్యాప్తంగా అశాంతి, ప్రయాణ అంతరాయాలు కొనసాగుతున్నందున వెంటనే దేశం విడిచి వెళ్లాలని కోరింది.
Also Read
- Trump: ‘ఐ లవ్ ఇండియా.. ఐ లవ్ మోడీ’’ సోషల్ మీడియాలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఆసక్తి రేపుతోన్న కామెంట్స్
- Nepal VS India Explained: భారత్-నేపాల్ మధ్య మళ్లీ మంటలు.. ఈ రాజకీయ భూకంపానికి కారణం ఏంటి?
- Trump VS Netanyahu: ఫోన్ కాల్లో నెతన్యాహును బండబూతులు తిట్టిన ట్రంప్..! స్నేహితుడితో అమెరికా ప్రెసిడెంట్కు ఎక్కడ చెడింది?
- Weather News: మరో 5ఏళ్లు నరకమే.. ఐక్యరాజ్యసమితి హెచ్చరిక.. UN రిపోర్ట్లో ఏముంది?
ఇక అమెరికా పౌరులు ప్రత్యామ్నాయ కమ్యూనికేషన్ మార్గాలను ప్లాన్ చేసుకోవాలని కోరింది. అర్మేనియా లేదు టర్కీ వెళ్లిపోవాలని సూచించింది. విమాన సంస్థలను నేరుగా సంప్రదించాలని తెలిపింది. ఒకవేళ వెళ్లడం సాధ్యం కాకపోతే సురక్షితమైన ప్రదేశానికి వెళ్లాలని చెప్పింది. ఆహారం, నీరు, మందులు, ఇతర ముఖ్యమైన వస్తువులు దగ్గర ఉంచుకోవాలని కోరింది. అలాగే ఫోన్ ఛార్జ్లో ఉంచుకోవాలని సూచించింది. నిరంతరం కుటుంబ సభ్యులు, స్నేహితులతో టచ్లో ఉండాలని హెచ్చరించింది.
ఇది కూడా చదవండి: Supreme Court: ప్రశాంత్ కిషోర్కు సుప్రీంకోర్టు షాక్.. పిటిషన్ తీరుపై చీవాట్లు
గత డిసెంబర్ 28 నుంచి ఇరాన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగాయి. ఈ నిరసనల్లో 30 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే రక్తపాత అణచివేతకు ప్రతిస్పందనగా దాడి చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. అంతేకాకుండా యూఎస్ఎస్ అబ్రహం లింకన్ నౌక ఇప్పటికే అరేబియా సముద్రంలో మోహరించింది. అలాగే అమెరికా యుద్ధ విమానాలు కూడా చేరుకున్నాయి. అయితే అణు కార్యక్రమంపై ఇరాన్ చర్చించేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. అరబ్ దేశాలు మధ్యవర్తిత్వం వహించి అమెరికాను ఒప్పించేందుకు ప్రయత్నించినా విఫలమైనట్లుగా సమాచారం. మొత్తం మీద మరోసారి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏమవుతుందో చూడాలి.
తాజావార్తలు
-
India-Venezuela: భారత్కు వెనిజులా అధ్యక్షురాలు.. ఇంధన రంగంపై ప్రత్యేక దృష్టి
-
Mango Salad Recipe: చల్లదనాన్ని అందించే తీపి-పులుపు రుచుల మామిడి సలాడ్.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండి!
-
Randhir Jaiswal: జమ్మూకాశ్మీర్, లడఖ్ గురించి నోరు జారొద్దు.. ఈయూకు భారత్ సూచన
-
PM Modi: మరో రికార్డ్ దిశగా మోడీ.. 7 రోజుల్లో సరికొత్త చరిత్ర
-
Janhvi Kapoor: ‘స్టార్ కిడ్ అనే అహంకారం అస్సలు లేదు’.. ‘పెద్ది’ హీరోయిన్ రియల్ క్యారెక్టర్ను బయటపెట్టిన బుచ్చిబాబు!
ట్రెండింగ్
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!