Free Bus Scheme in AP: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. నేడు సీఎం చంద్రబాబు కీలక సమీక్ష..
- మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం దిశగా ఏపీ సర్కార్ కసరత్తు..
- నేడు రవాణాశాఖ అధికారులతో ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష.. ఏపీఎస్ఆర్టీసీలో ప్రతీరోజూ 15 లక్షల వరకూ మహిళల ప్రయాణం..
- ఉచిత బస్సు ప్రయణానికి నెలకు రూ. 250 కోట్ల వరకు ఖర్చు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Free Bus Scheme in AP: ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నాయి.. ఆయా ప్రభుత్వాలు.. దీనిపై విపక్షాలు కొన్ని విమర్శలు చేసినా.. ఉచిత బస్సు ప్రయాణంతో.. బస్సుల్లో మహిళల రద్దీ మాత్రం పెరిగిపోయింది.. ఇక, ఆంధ్రప్రదేశ్లోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వైపు అడుగులు పడుతున్నాయి.. దీనిపై ఎన్నికల ప్రచార సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన విషయం విదితమే కాగా.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై దృష్టిసారించారు సీఎం చంద్రబాబు.. అందులో భాగంగా నేడు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రవాణా శాఖలో పలు అంశాలపై ఈ రోజు సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు.
Read Also: Delhi Court: వ్యక్తిపై నకిలీ అత్యాచార కేసు పెట్టిన మహిళ.. కోర్టు ఏం చెప్పిందంటే..?
Also Read
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
- PM Modi 12 Years Governance: డిజిటల్ విప్లవం నుంచి గ్లోబల్ ప్రభావం వరకు.. మోడీ 12 ఏళ్ల పాలనపై చంద్రబాబు ప్రశంసలు..
- AP Weather Alert: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. పల్నాడు సహా 7 జిల్లాలకు అలర్ట్
మహిళలకు ఫ్రీ బస్సు దిశగా ఆర్టీసీ అధికారులు కసరత్తు పూర్తి చేశారు. తెలంగాణ, కర్ణాటకలలో ఫ్రీ బస్సుల అమలును అధ్యయనం చేసే దిశగా నిర్ణయించే అవకాశం ఉంది. అధ్యయనం అనంతరం ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు విధి విధానాలు నిర్ణయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఏపీఎస్ఆర్టీసీలో నిత్యం ప్రయాణించే ప్రయాణికులలో 15 లక్షల వరకూ మహిళలు ఉన్నారు. ఉచిత బస్సు ప్రయణానికి నెలకు రూ. 250 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు అధికారులు.. మహిళలకు ఉచిత బస్సు అమలుకు ప్రభుత్వం నెలకు 25 శాతం వరకూ కార్పొరేషన్ కు వదిలేయాలి.. మరో రూ. 125 కోట్ల వరకూ నెలకు ఆర్టీసీకే ప్రభుత్వం రీఎంబర్సుమెంటు ఇవ్వాల్సి ఉంటుంది.. ఆక్యుపెన్సీ రేషియో పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే.. ఇవాళ్టి సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షలో మహిళలకు ఉచిత బస్సుపై చర్చించి.. ఓ నిర్ణయానికి వస్తారని తెలుస్తోంది.
తాజావార్తలు
-
LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్ను ముంచేసిన భారీ వర్షం
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి