CM Chandrababu: జమిలి ఎన్నికలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
- జమిలి ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
- జమిలి ఎన్నికలు వచ్చినా ఏపీలో 2029లోనే ఎన్నికలు..
- పార్లమెంట్, అసెంబ్లీలకు కేంద్రం జమిలి ఎన్నికలు పెట్టినా..
- షెడ్యూల్ ప్రకారం 2029లోనే ఏపీ ఎన్నికలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలపై చర్చ సాగుతోంది.. వన్ నేషన్ – వన్ ఎలక్షన్ నినాదంతో నరేంద్ర మోడీ సర్కార్ ముందుకు వెళ్తోంది.. జమిలి ఎన్నికలే వస్తే.. 2027లోనే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరుగుతాయనే చర్చ సాగుతోంది.. అయితే, ఈ తరుణంలో టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. జమిలి ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు.. జమిలి ఎన్నికలు వచ్చినా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు మాత్రం 2029లోనే ఉంటాయన్నారు.. పార్లమెంట్, అసెంబ్లీలకు కేంద్రం జమిలి ఎన్నికలు పెట్టినా.. అవి షెడ్యూల్ ప్రకారం 2029లోనే వస్తాయని.. ముందుగా రాబోవని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు..
Read Also: Nani : పవన్ కళ్యాణ్ పై న్యాచురల్ స్టార్ నాని ఆసక్తికర వ్యాఖ్యలు
Also Read
ఇక, విజన్-2047ను కింది స్థాయి వరకూ ప్రజల్లోకి తీసుకెళ్లడంపై ఆలోచనలు చేస్తున్నామని తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు.. మరోవైపు.. వైఎస్ జగన్ కు అదానీ 1750 కోట్ల రూపాయలు లంచం ఇచ్చారనే అంశంపై న్యాయ సలహా తీసుకుని స్పందిస్తాం అన్నారు.. విజన్ 2047 కోసం నిధుల సమీకరణకు వినూత్న పంథాలో ముందుకు వెళ్తామని చెప్పారు.. కాలేజీలు, విశ్వవిద్యాలయాల వంటి వేదికలపై చర్చిస్తాం. ఈ విజన్ ద్వారా రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నామో అన్ని వర్గాలవారికీ తెలియడానికి ప్రణాళిక రూపొందించుకుని పనిచేయనున్నట్టు వెల్లడించారు.. ఈ ప్రక్రియ నిరంతరం జరుగుతూ ఉంటుంది. ప్రతి నెల, ప్రతి క్వార్టర్, ప్రతి ఏడాదికి లక్ష్యాలు పెట్టుకుని సాధించడానికి ప్రయత్నిస్తామన్నారు.. అయితే, సోమవారం నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో శుక్రవారం రాత్రి తన నివాసంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు సీఎం చంద్రబాబు.. సమావేశం అనంతరం.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో ప్రాజెక్టుల గురించి చర్చించాం.. ఇరిగేషన్, నదుల అనుసంధానం ప్రాజెక్టుల గురించి చర్చించామన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047ను కూడా చంద్రబాబు రిలీజ్ చేసారు.. దానిలోనూ కేంద్ర అనుసంధాన పనులున్నాయని తెలిపారు. పెట్టుబడులను తీసుకురావడంలో కేంద్రంతో అనుసంధానం చేసి పూర్తి చేయడంలో ముందుండాలని సీఎం సూచించారని పేర్కొన్నారు. అయితే, జమిలి ఎన్నికలపై మీడియా చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు నాయుడు.
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!