Chandrababu On Urea: యూరియాపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన.. అలా చేస్తేనే రైతులకు లాభాలు!
- యూరియా వాడకం తగ్గించడంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..
- రైతులు వచ్చే ఏడాది నుంచి యూరియా వాడకాన్ని తగ్గిస్తే, ఆ మేరకు ప్రోత్సాహం..
- ప్రస్తుతం వాడుతున్న యూరియాను తగ్గిస్తే, ప్రతి కట్టకు రూ. 800 రైతులకు ఇస్తాం..
- కొన్ని యూరప్ దేశాలు కూడా మన ఉత్పత్తుల ధరలను తగ్గిస్తున్నాయి: సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu On Urea: ఏపీ సచివాలయంలో కొనసాగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో వ్యవసాయంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. యూరియా వాడితే అధిక దిగుబడి వస్తుందనడం కరెక్ట్ కాదు అన్నారు. దీనికి పంజాబ్ను కేసు స్టడీగా తీసుకోవాలి అని సూచించారు. యూరియాను అవసరం మేరకే వాడాలని తెలిపారు. అయితే, రైతులు వచ్చే ఏడాది నుంచి యూరియా వాడకాన్ని తగ్గిస్తే, ఆ మేరకు ప్రోత్సాహం ఇస్తామని చెప్పుకొచ్చారు. కాగా, ప్రస్తుతం వాడుతున్న యూరియాను తగ్గించే ప్రతి కట్టకు రూ. 800 నేరుగా రైతులకు అందజేస్తామని వెల్లడించారు. మన రైతులు ఎక్కువ ఎరువులు వాడుతున్నారు, దాని వల్ల మిరప పంటను చైనా తిప్పి పంపించిందన్నారు. అలాగే, కొన్ని యూరప్ దేశాలు కూడా మన ఉత్పత్తులపై ధరలను తగ్గిస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలియజేశారు.
Read Also: Mirai : మిరాయ్ మూడు రోజుల కలెక్షన్స్.. సూపర్ సెన్షేషన్
Also Read
- Amaravati Land Pooling: అమరావతిలో మరో విడత ల్యాండ్ పూలింగ్.. 1,654 ఎకరాల భూమి సమీకరణకు నోటిఫికేషన్..
- Amaravati: రాజధాని గ్రామాలకు గుడ్ న్యూస్.. 29 గ్రామాలకు భారీగా నిధులు..
- RK Roja: స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి.. ప్రతిచోటా పోటీ చేస్తాం..
- YS Jagan: వ్యవస్థలన్నీ కుప్పకూలాయి.. ప్రతి ఇంట్లో వైసీపీ, కూటమి పాలనపై చర్చ జరుగుతోంది..
అయితే, ప్రజారోగ్యం దృష్ట్యా పంటల్లో యూరియా వినియోగం తగ్గిస్తే మంచిదని చంద్రబాబు అన్నారు. యూరియా వినియోగం తగ్గించే రైతులకు ప్రోత్సాహకాలు అందజేస్తామన్నారు. ఇప్పటికే, ఏపీ క్యాన్సర్లో టాప్ 5 స్థానంలో ఉంది.. ఇలాగే, కొనసాగితే క్యాన్సర్లో ప్రథమస్థానంలోకి వెళ్తామన్నారు. త్వరలోనే దానికి సంబంధించిన విధి విధానాలను ప్రకటిస్తామన్నారు. పీఎం ప్రణామ్ కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే సబ్సిడీని రైతులకే ఇచ్చేద్దాం.. ఇక, యూరియా కొరత లేదు.. అవసరమైతే డోర్ డెలివరీ చేద్దామన్నారు. నియోజకవర్గానికో యానిమల్ హాస్టల్ నిర్మాణం చేపట్టాలని సూచించారు. అర్బన్ నియోజకవర్గాలను మినహాయించి 157 నియోజకవర్గాల్లో యానిమల్ హాస్టళ్ల నిర్మాణం చేపట్టాలి అన్నారు. అలాగే, గోశాలల నిర్మాణం వల్ల పశు సంపద రాష్ట్రానికి రిటన్ గిఫ్ట్ ఇస్తోంది.. జీఎస్డీపీ వృద్ధిలో లైవ్ స్టాక్ పాత్ర కీలకం కానుంది. పాడి పరిశ్రమ అనేది చక్కటి ఆదాయ మార్గంగా ఉంటుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!
-
Sonal Dinusha: టీమిండియాపై సెంచరీలు.. ఆ కిక్కే వేరప్పా.. గాల్లో తేలిపోతున్న శ్రీలంక హీరో!
-
Tollywood : టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ నెక్ట్స్ లైనప్ సినిమాలు ఇవే
-
I Am Game: దుల్కర్ సల్మాన్ స్వయంగా పాడిన ‘లూజర్’ సాంగ్.. అభిమానులకు అదిరిపోయే స్టైలిష్ ట్రీట్
-
ACB Raids: భారీగా అక్రమ ఆస్తులు బట్టబయలు.. గనుల శాఖ అధికారి జయరాజ్ అరెస్ట్.!
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!