Chandrababu On Urea: యూరియాపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన.. అలా చేస్తేనే రైతులకు లాభాలు!
- యూరియా వాడకం తగ్గించడంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన..
- రైతులు వచ్చే ఏడాది నుంచి యూరియా వాడకాన్ని తగ్గిస్తే, ఆ మేరకు ప్రోత్సాహం..
- ప్రస్తుతం వాడుతున్న యూరియాను తగ్గిస్తే, ప్రతి కట్టకు రూ. 800 రైతులకు ఇస్తాం..
- కొన్ని యూరప్ దేశాలు కూడా మన ఉత్పత్తుల ధరలను తగ్గిస్తున్నాయి: సీఎం చంద్రబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu On Urea: ఏపీ సచివాలయంలో కొనసాగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో వ్యవసాయంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. యూరియా వాడితే అధిక దిగుబడి వస్తుందనడం కరెక్ట్ కాదు అన్నారు. దీనికి పంజాబ్ను కేసు స్టడీగా తీసుకోవాలి అని సూచించారు. యూరియాను అవసరం మేరకే వాడాలని తెలిపారు. అయితే, రైతులు వచ్చే ఏడాది నుంచి యూరియా వాడకాన్ని తగ్గిస్తే, ఆ మేరకు ప్రోత్సాహం ఇస్తామని చెప్పుకొచ్చారు. కాగా, ప్రస్తుతం వాడుతున్న యూరియాను తగ్గించే ప్రతి కట్టకు రూ. 800 నేరుగా రైతులకు అందజేస్తామని వెల్లడించారు. మన రైతులు ఎక్కువ ఎరువులు వాడుతున్నారు, దాని వల్ల మిరప పంటను చైనా తిప్పి పంపించిందన్నారు. అలాగే, కొన్ని యూరప్ దేశాలు కూడా మన ఉత్పత్తులపై ధరలను తగ్గిస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలియజేశారు.
Read Also: Mirai : మిరాయ్ మూడు రోజుల కలెక్షన్స్.. సూపర్ సెన్షేషన్
Also Read
- YS Jagan: పార్లమెంట్ వ్యూహాలపై వైసీపీ భేటీ.. ఎంపీలకు జగన్ దిశానిర్దేశం.. సర్కార్పై తీవ్ర ఆరోపణలు..
- CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
- Deputy CM Pawan Kalyan: సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. షాబాద్ ఘటన ప్రస్తావన..
- Deputy CM Pawan Kalyan: సీఎస్, డీజీపీకి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేఖ.. పోక్సో కేసులపై కీలక సూచనలు
అయితే, ప్రజారోగ్యం దృష్ట్యా పంటల్లో యూరియా వినియోగం తగ్గిస్తే మంచిదని చంద్రబాబు అన్నారు. యూరియా వినియోగం తగ్గించే రైతులకు ప్రోత్సాహకాలు అందజేస్తామన్నారు. ఇప్పటికే, ఏపీ క్యాన్సర్లో టాప్ 5 స్థానంలో ఉంది.. ఇలాగే, కొనసాగితే క్యాన్సర్లో ప్రథమస్థానంలోకి వెళ్తామన్నారు. త్వరలోనే దానికి సంబంధించిన విధి విధానాలను ప్రకటిస్తామన్నారు. పీఎం ప్రణామ్ కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే సబ్సిడీని రైతులకే ఇచ్చేద్దాం.. ఇక, యూరియా కొరత లేదు.. అవసరమైతే డోర్ డెలివరీ చేద్దామన్నారు. నియోజకవర్గానికో యానిమల్ హాస్టల్ నిర్మాణం చేపట్టాలని సూచించారు. అర్బన్ నియోజకవర్గాలను మినహాయించి 157 నియోజకవర్గాల్లో యానిమల్ హాస్టళ్ల నిర్మాణం చేపట్టాలి అన్నారు. అలాగే, గోశాలల నిర్మాణం వల్ల పశు సంపద రాష్ట్రానికి రిటన్ గిఫ్ట్ ఇస్తోంది.. జీఎస్డీపీ వృద్ధిలో లైవ్ స్టాక్ పాత్ర కీలకం కానుంది. పాడి పరిశ్రమ అనేది చక్కటి ఆదాయ మార్గంగా ఉంటుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Team India: రోహిత్ శర్మపై వేటు.. జట్టులోకి యువరాజ్ సింగ్, సచిన్..
-
DC Release: దళపతి కోసం వెనక్కి తగ్గిన లోకేష్.. రిలీజ్ డేట్ను మార్చేసిన స్టార్ డైరెక్టర్!
-
Bhatti Vikramarka : సీతారామ ప్రాజెక్టుపై భట్టి కీలక ప్రకటన.. ఇక వెనక్కి తగ్గేది లేదు..
-
JD Vance-Iran: జేడీ వాన్స్కు ఇరాన్ రహస్య హెచ్చరిక? అంతర్జాతీయంగా తీవ్ర కలకలం
-
Amitabh Bachchan: అయోధ్యలో అమితాబ్ బచ్చన్ మెగా ప్లాన్ ? రూ.100 కోట్లతో బిగ్ బీ ఏం చేశారో తెలుసా!
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!