Nara Lokesh: పిల్లలకు అర్ధమయ్యేలా రాజ్యాంగం..
- ప్రతి విద్యార్ధికి బాలల భారత రాజ్యాంగం ఇవ్వాలని నిర్ణయం..
- పిల్లలకు అర్ధమయ్యేలా రాజ్యాంగం గురించి ఇందులో వివరిస్తాం..
- రాజ్యాంగ ప్రతిని పిల్లలకు అర్ధమయ్యేలా అందుబాటులోకి తెస్తాం..
- 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో మంత్రి నారా లోకేష్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Lokesh: విద్యా శాఖలో వచ్చే ఏడాది నుంచి, ప్రతి విద్యార్ధికి బాలల భారత రాజ్యాంగం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. పిల్లలకు అర్ధమయ్యేలా రాజ్యాంగం గురించి ఇందులో వివరిస్తాం. రాజ్యాంగ ప్రతిని పిల్లలకు అర్ధమయ్యేలా అందుబాటులోకి తేవాలని సూచించారు మంత్రి నారా లోకేష్.. ఏపీ సెక్రటేరియట్ లో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇతర మంత్రులతో కలిసి పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలకు నిజమైన స్వాతంత్ర్యం 26 నవంబర్ 1949న వచ్చిందన్నారు.. రాజ్యాంగ రూపకర్తలను మనం స్మరించుకోవాలి.. హోం సెక్రెటరీ తప్ప మిగతా ఐపీఎస్ లు ఎవరూ లేరు ఈ సమావేశంలో… రాజ్యాంగ ప్రతిని పిల్లలకు అర్ధమయ్యేలా అందుబాటులోకి తేవాలి.. పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా రాజ్యాంగ ప్రతిని అర్ధమయ్యేలా అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉంది.. ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది తేవాలన్నారు.. Be the people of India కాదు.. Be the children of India.. పిల్లలే భారత భవిష్యత్తు అని పేర్కొన్నారు మంత్రి నారా లోకేష్..
Read Also: Pan Card 2.0 Use: QR కోడ్తో వస్తున్న కొత్త పాన్ కార్డ్.. ఫీచర్లు ఏంటంటే
Also Read
- Pawan Kalyan: ‘ఇది ఎవరి జాగీరు కాదు.. నా మాతృభూమి’.. మీ అయ్య జాగీరా అనొద్దా?
- Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
- Heavy Rain and Thunderstorms: రెడ్ అలర్ట్.. రాబోయే 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!
- AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు.. IATOతో చారిత్రాత్మక ఒప్పందం
ఇక, ఈ సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా ప్రపంచంలో నిలబెట్టింది మన రాజ్యాంగమే.. సమాన పనికి సమాన వేతనం, మహిళల పట్ల ప్రత్యేకత చూస్తే తెలుస్తుంది.. రాసే వారు ఎలా రాసినా… అమలు చేసే వారు సరిగా ఉండాలన్నారు.. మరోవైపు.. సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ.. 26 నవంబరు 1949 నరాజ్యాంగాన్ని ఆమోదించారు.. 1946లో బీఆర్ అంబేద్కర్ చైర్మన్ గా రాజ్యాంగ రచన ప్రారంభించారు.. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది రాజ్యాంగ రచనకు.. మనది అతిపెద్ద రచనా రాజ్యాంగం అని గుర్తుచేశారు.. ఇక, మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ.. 75వ రాజ్యాంగ దినోత్సవం నిర్వహించుకుంటున్నాం.. సమగ్ర పరిష్కారంగా పనిచేసేలా రాజ్యాంగ రచన జరగడం విశేషంగా వెల్లడించారు.. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వం నడిపే విధానాలు ఇందులో ఉన్నాయన్నారు.. సున్నితమైన సునిశిత అంశాలు రాజ్యాంగంలో ఉన్నాయి అని వెల్లడించారు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి.
తాజావార్తలు
-
Allu Aravind: ఇప్పుడు లవ్ స్టోరీస్ అన్నిటికీ ఓయోలో ఎండ్ కార్డ్.. అల్లు అరవింద్ సంచలనం
-
NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్పై ఫోకస్
-
Nuclear Warheads: ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్న భారత్ నిర్ణయం.. ఆ 12 న్యూక్లియర్ వార్ హెడ్ల కథేంటి?
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
YS Jagan: ప్రశ్నించే ప్రతి ఒక్కరూ ‘కాక్రోచ్లే’.. నేను కూడా వారిలో ఒకడిని!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?