Minister Kolusu Parthasarathy: ఏపీలో పేదలకు శుభవార్త.. 9 లక్షలకు పైగా ఇళ్ల దరఖాస్తులకు అర్హత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Kolusu Parthasarathy: ఆంధ్రప్రదేశ్లో పేదలకు గృహ వసతి కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు మంత్రి కొలుసు పార్థసారథి.. ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం కూడా సహాయ సహకారాలు అందిస్తోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేస్తోంది. మంత్రి పార్థసారథి వెల్లడించిన వివరాల ప్రకారం, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు 8 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు అధిక నిధులు కేటాయించి ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసినట్లు తెలిపారు..
2019-24 మధ్య 6 లక్షల ఇళ్ల నిర్మాణం
2019 నుంచి 2024 మధ్య కాలంలో రాష్ట్రంలో సుమారు 6 లక్షల ఇళ్ల నిర్మాణం మాత్రమే జరిగినట్లు పేర్కొన్నారు పార్థసారథి.. దీంతో గృహ నిర్మాణ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని భావిస్తోంది. అయితే, పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించగా, 10 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. వీటిలో పరిశీలన అనంతరం 9 లక్షలకు పైగా దరఖాస్తులు అర్హత సాధించినట్లు వెల్లడించారు.
Also Read
- CM Chandrababu: రెండు నెలల్లో ప్రతీ జిల్లాకు డిస్ట్రిక్ట్ ఎకనామిక్ ప్రొఫైల్.. సీఎం కీలక వ్యాఖ్యలు
- AP Liquor Scam Case: లిక్కర్ స్కామ్లో కీలక మలుపు.. సత్యప్రసాద్కు ముందస్తు బెయిల్.. ఏసీబీ కోర్టు ఉత్తర్వులు రద్దు..
- AP Employee Transfers Ban: ఉద్యోగుల బదిలీలపై నిషేధం.. కొత్త జోనల్ విధానంపై కీలక ఉత్తర్వులు
- IPS Officers: ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ..
కేంద్రం నుంచి మరిన్ని ఇళ్ల మంజూరుపై దృష్టి
అర్హులైన ప్రతి కుటుంబానికి గృహం అందించేందుకు కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం కొనసాగిస్తున్నట్లు తెలిపారు మంత్రి పార్థసారథి… త్వరలో కేంద్రం నుంచి మరిన్ని ఇళ్ల మంజూరు పొందేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తామని వెల్లడించారు.. రాష్ట్రంలోని పేదలకు సొంత ఇల్లు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం గృహ నిర్మాణ కార్యక్రమాన్ని విస్తరిస్తోంది. కేంద్ర సహకారంతో మరిన్ని ఇళ్లు మంజూరు చేయించి అర్హులైన ప్రతి కుటుంబానికి గృహ వసతి కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు మంత్రి కొలుసు పార్థసారథి..
తాజావార్తలు
-
Minister Kolusu Parthasarathy: ఏపీలో పేదలకు శుభవార్త.. 9 లక్షలకు పైగా ఇళ్ల దరఖాస్తులకు అర్హత
-
VenkyAnil5: సెట్స్పైకి వెంకటేష్.. #VenkyAnil5 షూటింగ్ కు మరింత ఊపు.. కీలక షెడ్యూల్ షురూ!
-
Sanju Samson: సంజు శాంసన్కు బైబై చెప్పేశారా..? మౌనం వీడిన బీసీసీఐ
-
AA23 Update: లోకేష్ స్టైల్ రెడీ.. అల్లు అర్జున్ అభిమానులకు త్వరలో బిగ్ సర్ప్రైజ్!
-
Lenin: థియేటర్లకు ముందే ‘లెనిన్’ జాక్పాట్.. నాన్ థియేట్రికల్ రైట్స్తో రూ.34 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!
-
TGPSC Recruitment: ఉద్యోగార్థులకు గుడ్న్యూస్.. టీజీపీఎస్సీ నుంచి రెండు నోటిఫికేషన్లు విడుదల.!
-
Telangana Drought Alert: వాన జాడే లేదు.. కరువు కోరల్లోకి తెలంగాణ.. రైతుల్లో పెరుగుతున్న ఆందోళన!