సొంతిల్లు కట్టుకోవాలనే నిరుపేదల కలను నిజం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది పండుగ ముందే అదిరిపోయే శుభవార్తను అందించింది. తిరుపతి జిల్లా నాయుడుపేట సమీపంలోని బిరదవాడ వద్ద నిర్మించిన 2,064 టిడ్కో (TIDCO) ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు కూటమి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తెలుగు కొత్త సంవత్సరం ఉగాదిని పురస్కరించుకుని, మార్చి 17న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ భారీ గృహ సముదాయాన్ని అధికారికంగా ప్రారంభించి, నిరుపేదలకు పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వం…