Sanju Samson: సంజు శాంసన్కు బైబై చెప్పేశారా..? మౌనం వీడిన బీసీసీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanju Samson: జింబాబ్వేతో జరగనున్న టీ20 సిరీస్కు భారత జట్టులో వికెట్ కీపర్-బ్యాటర్ సంజు శాంసన్కు చోటు దక్కకపోవడంతో అతడిని జట్టు నుంచి తప్పించారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే ఈ ఊహాగానాలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తెరదించింది. సంజును జట్టు నుంచి తొలగించలేదని, రాబోయే బిజీ షెడ్యూల్తో పాటు ఆసియా క్రీడలను దృష్టిలో ఉంచుకుని అతడికి విశ్రాంతి ఇచ్చినట్లు బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి.
జింబాబ్వే సిరీస్లో చోటు ఎందుకు దక్కలేదు?
జూలై 6న ప్రకటించిన జింబాబ్వే టీ20 సిరీస్కు భారత జట్టులో ప్రభ్సిమ్రన్ సింగ్, అభిషేక్ శర్మ, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ వంటి యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించారు. అయితే సంజు శాంసన్ పేరు లేకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. దీనిపై స్పందించిన బీసీసీఐ వర్గాలు, జింబాబ్వే పర్యటనలో సంజుకు తుది జట్టులో అవకాశం లభించే పరిస్థితి లేకపోవడంతో, అతడిని పర్యటనకు తీసుకెళ్లకుండా విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించాయి. అదే సమయంలో యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి.
Also Read
- Rohit Sharma New Look: హిట్మ్యాన్ ఫొటో లీక్ చేసిన రవిశాస్త్రి.. కొత్త లుక్తో ట్రెండింగ్లో రోహిత్ శర్మ
- Vaibhav Sooryavanshi: ఐసీసీ ర్యాంకింగ్స్లో రాకెట్ వేగంతో దూసుకెళ్లిన వైభవ్.. ఏకంగా 230 స్థానాలు జంప్..
- VVS Laxman vs Gautam Gambhir: ఇప్పుడు గంభీర్ వర్సెస్ లక్ష్మణ్ చర్చ ఎందుకు..?
- Rohit Sharma: 2027 ప్రపంచకప్లో రోహిత్ శర్మ ఉండాలా..? మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఆసియా క్రీడల కోసం సంజు సిద్ధం
బీసీసీఐ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, సెప్టెంబర్లో జరిగే ఆసియా క్రీడల్లో సంజు శాంసన్ భారత జట్టులో కీలక సభ్యుడిగా ఉండనున్నాడు. ఈ నేపథ్యంలో అతని పనిభారాన్ని దృష్టిలో ఉంచుకుని విశ్రాంతి కల్పించినట్లు పేర్కొన్నారు. “అతను ఆడని సిరీస్కు తీసుకెళ్లడం కంటే విశ్రాంతి ఇవ్వడం మంచిదని భావించాం. అతను సీనియర్ ఆటగాడు. సెలక్షన్ కమిటీ నిర్ణయంపై విమర్శలు చేసే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలి” అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
ఇటీవలి ప్రదర్శనపై విమర్శలు
ఇటీవల జరిగిన కొన్ని మ్యాచ్ల్లో సంజు శాంసన్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఐర్లాండ్ పర్యటనలో అతడు డకౌట్ కాగా, ఇంగ్లాండ్తో జరిగిన తొలి టీ20లో కేవలం ఒకే పరుగు చేశాడు. వరుసగా పేలవ ప్రదర్శనల తర్వాత రెండో టీ20లో అతని స్థానంలో వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో జింబాబ్వే సిరీస్కు కూడా అతడిని ఎంపిక చేయకపోవడంతో, జట్టు నుంచి పూర్తిగా తొలగించారనే ప్రచారం జరిగింది.
టీ20 ప్రపంచకప్లో అద్భుత ప్రదర్శన
అయితే, ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్లో సంజు శాంసన్ అద్భుతంగా రాణించాడు. నాకౌట్ దశలో 97 నాటౌట్, 89, 89 పరుగులతో కీలక ఇన్నింగ్స్లు ఆడి భారత్ విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనకు గుర్తింపుగా అతడు ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డును కూడా అందుకున్నాడు. అదేవిధంగా, ఐపీఎల్ 2026 సీజన్లో 14 మ్యాచ్ల్లో 477 పరుగులు చేసి తన బ్యాటింగ్ సామర్థ్యాన్ని మరోసారి నిరూపించాడు. మొత్తంగా.. జింబాబ్వే పర్యటనకు సంజు శాంసన్ ఎంపిక కాకపోవడం వెనుక కారణం ఫామ్ కాదని, రాబోయే కీలక టోర్నమెంట్లను దృష్టిలో ఉంచుకుని అతడికి విశ్రాంతి ఇవ్వడమేనని బీసీసీఐ స్పష్టం చేసింది. దీంతో సంజు భవిష్యత్పై వస్తున్న ఊహాగానాలకు చెక్ పడినట్టైంది.
తాజావార్తలు
-
Vijay Varma: హీరో కాకముందు కాస్టింగ్ కౌచ్.. విజయ్ వర్మ షాకింగ్ వ్యాఖ్యలు.. హైదరాబాద్లో జరిగిన ఘటన ఏంటి?
-
Instagram Reel: ఇంద్రకీలాద్రిపై ఇన్స్టాగ్రామ్ రీల్ వివాదం.. పోలీసులకు దేవస్థానం ఫిర్యాదు..
-
Abhishek Sharma: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకు.. 91 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి..
-
Salman Khan: రూ.120 కోట్ల నుంచి రూ.70 కోట్లకు సల్మాన్ పారితోషికం.. అసలు కారణం ఇదేనా?
-
Tirumala Laddu: 311 ఏళ్లు పూర్తి చేసుకున్న తిరుమల శ్రీవారి లడ్డూ..!
ట్రెండింగ్
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
120dB స్పీకర్, IP64 రేటింగ్తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane Pension: అజింక్య రహానేకు పెన్షన్.. నెలనెలా ఎంత వస్తుందో తెలుసా?
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!