Andhra Pradesh: గుడ్న్యూస్.. ఉల్లి నుంచి బియ్యం వరకు.. నిత్యావసర ధరల తగ్గింపునకు ప్లాన్.. కిలో ఉల్లి రూ.35కే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: రాష్ట్రంలో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించేందుకు మంత్రులు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్ సమావేశమయ్యారు. ధరల తగ్గింపు, సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడం వంటి అంశాలపై చర్చించారు. నిత్యావసర ధరలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు మంత్రులకు సూచించిన విషయం తెలిసిందే.
ఉల్లి ధరపై కీలక నిర్ణయం
ధరల పెరుగుదలకు కొన్ని కారణాలతో పాటు స్వార్థపరుల చర్యలు, యుద్ధ పరిస్థితులు, ఎల్నినో ప్రభావం కూడా కారణమయ్యాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ముందుగా ఉల్లిపాయల సరఫరాపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. మంత్రులు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడితో సమన్వయం చేసుకుని కిలో ఉల్లిని రూ.35కే సరఫరా చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
Also Read
- AP Cabinet Decisions: రైతులకు గుడ్న్యూస్.. అమరావతిపై ఫోకస్.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
- Guntur Girl Missing Case: పోలీసుల వైఫల్యంపై హైకోర్టు సీరియస్.. డీజీపీ స్వయంగా హాజరు కావాలని ఆదేశం
- Deputy CM Pawan Kalyan: ఎవ్వరినీ వదలని పవన్ కల్యాణ్.. ప్రధాని నుంచి జనసైనికుల వరకు..!
పామాయిల్ ధర తగ్గింపునకు చర్యలు
పామాయిల్ ధరలను కూడా నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మార్కెట్ ధరతో పోలిస్తే లీటరుకు సుమారు రూ.10 తక్కువగా పామాయిల్ అందించేలా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
350 ఔట్లెట్లలో బియ్యం సరఫరా
ప్రజలకు అందుబాటులో ఉండేలా రాష్ట్రవ్యాప్తంగా 350 ఔట్లెట్లలో బియ్యం సరఫరాపై దృష్టి పెట్టినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే బియ్యం కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. బియ్యం సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వంతో కూడా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
కందిపప్పుపైనా త్వరలో నిర్ణయం
నిత్యావసర సరుకుల్లో కీలకమైన కందిపప్పు ధరపై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రజలపై ధరల భారం తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. అయితే, ధరల నియంత్రణ, ధరల తగ్గింపుపై నాలుగు రోజుల్లో స్పష్టత వస్తుందని మంత్రి తెలిపారు. మార్కెట్ పరిస్థితులను పరిశీలిస్తూ ప్రజలకు తక్కువ ధరలకు నిత్యావసర వస్తువులు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమావేశం
నిత్యావసర ధరల నియంత్రణపై సీఎం చంద్రబాబు త్వరలో ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపిన అనంతరం మరిన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందన్నారు. ధరల నియంత్రణకు ప్రభుత్వం సమన్వయంతో ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Andhra Pradesh: గుడ్న్యూస్.. ఉల్లి నుంచి బియ్యం వరకు.. నిత్యావసర ధరల తగ్గింపునకు ప్లాన్.. కిలో ఉల్లి రూ.35కే..
-
KTR : సాగర్ నీళ్లపై కేటీఆర్ సమరశంఖం.. 10 రోజుల డెడ్లైన్..
-
Trump: మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్పై డెమొక్రాట్ల ప్లాన్ ఇదేనా? పదవికి ముప్పుందా!
-
VVS Laxman: ముంబైలో బీసీసీఐ కీలక భేటీ.. వీవీఎస్ లక్ష్మణ్కు అదిరే శుభవార్త..
-
Imran Masood: ‘నా కూతురు 6 నెలలుగా ఇంట్లోనే ఉంది’.. అల్లుడు ఎస్పీలో చేరడంపై కాంగ్రెస్ ఎంపీ ఆవేదన
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!