Andhra Pradesh: ఉద్యోగులకు సర్కార్ గుడ్న్యూస్.. అర్హులందరికీ పూర్తి స్థాయి పదోన్నతులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెబుతూ కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రంలో అర్హత కలిగిన అన్ని ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి స్థాయిలో పదోన్నతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ అంశంపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్తో మంత్రి సమావేశమై, పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఉద్యోగికి న్యాయం జరిగేలా పూర్తి స్థాయి ప్రమోషన్లు ఇవ్వాలని స్పష్టంగా ఆదేశించారు.
ఇక చాలా కాలంగా పెండింగ్లో ఉన్న న్యాయ వివాదాల పరిష్కారంపై కూడా దృష్టి సారించారు మంత్రి పయ్యావుల.. ముఖ్యంగా 10/1999 గ్రూప్-2 నోటిఫికేషన్కు సంబంధించిన సీనియారిటీ వివాదాలు కోర్టుల్లో ఉండటం వల్ల ఏర్పడిన అడ్డంకులను వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఈ సమస్యను ఇరు వర్గాలకు ఆమోదయోగ్యంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. సీనియారిటీ వివాదాల కారణంగా కింది స్థాయి ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా మంత్రి ప్రస్తావించారు. పదోన్నతుల్లో వారికి ఎలాంటి అన్యాయం జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మొత్తంగా, ఈ నిర్ణయాలు అమలు అయితే ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉత్సాహం పెరగడంతో పాటు, పరిపాలన వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
Also Read
- JC Prabhakar Reddy: భిక్షగాళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.. తాడిపత్రిలో జేసీ కొత్త ప్లాన్.. డెడ్లైన్ పెట్టి మరి..!
- AP Building Rules: ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. బిల్డింగ్ రూల్స్లో భారీ మార్పులు.. అమల్లోకి కొత్త నిబంధనలు..
- Bhuma Akhila Priya: అహోబిలం అంశంపై స్పందించిన భూమా అఖిలప్రియ.. ‘వాస్తవాలు వెలుగులోకి రావాలి’
- AP Job Calendar 2026: ఏపీ జాబ్ క్యాలెండర్.. ఈసారి 10,660 ఉద్యోగాలు భర్తీ.. మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు..
తాజావార్తలు
-
CJP: కాక్రోచ్ పార్టీ నిరసనల్లో 2873 మంది క్రిమినల్స్.. కేంద్రం కీలక ప్రకటన..
-
Akhil Akkineni : వంద కోట్ల క్లబ్లో అయ్యగారు.. అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్
-
Srinivasa Mangapuram OTT: మహేష్ మేనల్లుడు డిజిటల్ ఎంట్రీ.. రిలీజ్ రోజే ఓటీటీ డీల్ ఫిక్స్ చేసుకున్న ‘శ్రీనివాస మంగపురం’
-
West Bengal Cash Haul: ఎక్స్- బస్ డ్రైవర్ ఇంట్లో రూ. 28 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం..
-
PM Modi AP Visit: భోగాపురం విమానాశ్రయం చుట్టూ ఆంక్షలు.. 5 కిలోమీటర్ల మేర నో ఫ్లైయింగ్ జోన్
ట్రెండింగ్
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?