Andrha Pradesh: నేడు ఉద్యోగ సంఘతో ప్రభుత్వం కీలక చర్చలు.. దీపావళి ముందు గుడ్న్యూస్..!
- ఇవాళ ఉద్యోగ సంఘ నేతలతో ప్రభుత్వం చర్చలు.
- మ. 12 గంటలకు ముగ్గురు మంత్రులు ఆధ్వర్యంలో చర్చలు..
- మంత్రులు పయ్యావుల, సత్యకుమర్, నాదెండ్లతో ఉద్యోగ సంఘాల భేటీ..
- ఉద్యోగుల డీఏ.. ఇతర ఆర్ధిక అంశాలపై చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టింది.. దీపావళికి రెండు రోజుల ముందు గుడ్ న్యూస్ చెప్పాలనుకుందో.. ఏమో.. కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. మంత్రులతో.. ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు.. ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులతో ఉద్యోగుల డీఏ.. ఇతర అంశాలు చర్చించారు… ఇవాళ ముగ్గురు మంత్రులు.. ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపనున్నారు.. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సహా మంత్రులు సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్ లను ఉద్యోగ సంఘాలతో చర్చించాలని ఆదేశాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు..
Read Also: IVF: ముసలోడే కానీ.. 93ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న తాత
Also Read
- Pawan Kalyan: సంక్షేమ పథకాలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దానికి వైసీపీనే ఉదాహరణ..!
- Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!
- Amaravati Tension: ఉండవల్లిలో హైటెన్షన్.. వైసీపీ నేతలపై కోడిగుడ్లు, రాళ్ల దాడి
- Andhra Pradesh Rain Alert: ద్రోణి, తుఫాన్ ఆవర్తనం ప్రభావం.. ఏపీలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
ఇక, సీఎం చంద్రబాబు ఆదేశాలతో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘ ప్రతినిధులతో ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు.. మంత్రులు పయ్యావుల కేశవ్, సత్య కుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్ చర్చలు జరుపనున్నారు.. ఉద్యోగుల ఆర్ధిక పరమైన సమస్యలకు సంబంధించి చర్చ జరగనుంది.. డీఏ బకాయిలకు సంబంధించి ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ జరిగే చర్చల్లో డీఏ కు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.. ఏపీ ప్రభుత్వం ఉద్యోగులు.. పెండింగ్ లో ఉన్న డీఏలతో పాటు కొత్త పీఆర్సీ కోరుతున్నారు.. జీపీఎఫ్ బకాయిలు.. కారుణ్య నియామకాలు. ప్రమోషన్లు.. అంతర్గత సమస్యలు… మెడికల్ రీ ఎంబర్స్మెంట్.. ఇలా అనేక సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. ఇవాళ జరిగే సమావేశంలో ఇవన్నీ కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది.
Read Also: Ram Gopal Varma: ఆర్జీవీకి మరో షాక్.. రాజమండ్రిలో మరో కేసు నమోదు
మరోవైపు, ఉద్యోగ సంఘ ప్రతినిధులతో చర్చలు జరిపిన తర్వాత… సాయంత్రం సీఎం చంద్రబాబుతో ముగ్గురు మంత్రులు భేటీ కానున్నారు.. ఇవాళ రాత్రి కీలక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీపావళి కానుకగా డీఏ ప్రకటించే అవకాశం ఉందని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.. ఏపీ సచివాలయంలో ఉద్యోగుల సమస్యలపై మంత్రుల బృందం సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అని ఉద్యోగుల్లో బాగా చర్చ జరుగుతోంది.. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ సచివాలయం 5వ భవనంలో మంత్రుల బృందం ఆధ్వర్యంలో చర్చలు జరగనున్నాయి.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం అవుతారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తో పాటు… సర్వీసెస్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు.. అదే విధంగా గుర్తింపు పొందిందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొనున్నారు.
తాజావార్తలు
-
Sudan Civil War: సుడాన్లో ఊచకోత.. 72 గంటల్లోనే ముంచెత్తిన ముప్పు.. రంగంలోకి దిగిన ప్రపంచ దేశాలు!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Pawan Kalyan: సంక్షేమ పథకాలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దానికి వైసీపీనే ఉదాహరణ..!
-
Wedding Rumours: హార్దిక్ పాండ్యా రహస్యంగా పెళ్లి చేసుకున్నాడా? వైరల్ ఫోటోపై నిజమేంటి?
-
Harish Rao: కర్ణాటకలో ముగ్గురు సీఎంల చీకటి ఒప్పందాలేంటి? భేటీపై హరీష్రావు ఫైర్..
ట్రెండింగ్
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..