Andhra Pradesh: ఉద్యోగులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు.. దాదాపు 6,200 కోట్ల రూపాయాలు చెల్లించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి ఉద్యోగుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయి. GLI, GPF బకాయిలు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం.. మొత్తం 6 వేల 200 కోట్ల రూపాయలు విడుదల చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేయడంతో.. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు విడుదల అవుతున్నాయి.. నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయి.. రేపు లేదా ఎల్లుండి సాయంత్రానికి పూర్తి స్థాయిలో నిధులు విడుదల అవుతాయని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. దీనిపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఏపీ ఎన్జీవో అసోసియేషన్ నేతలు.. ఉద్యోగుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ నేతలు ధృవీకరించారు.. బకాయిలు విడుదల చేసిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నారు ఏపీ ఎన్జీవో అసోసియేషన్ నేతలు, ఉద్యోగులు..
Read Also: Heavy Rain: హైదరాబాద్ లో భారీ వర్షం.. ట్రాఫిక్ జామ్!