Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ.. సర్కార్ నిర్ణయం
- తిరుపతిలో తొక్కిసలాటపై న్యాయ విచారణ..
- ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం..
- రిటైర్డ్ జడ్జి సత్యనారాయణ మూర్తి నేతృత్వంలో విచారణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirupati Stampede: వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జ్యూడిషియల్ విచారణకు కమిషన్ ను నియమించింది. రిటైర్డ్ జడ్జి సత్యనారాయణ మూర్తి నేతృత్వంలో జ్యూడిషియల్ విచారణ జరగనుంది… తిరుపతి పద్మావతి పార్క్ దగ్గర ఈ నెల 8న జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు చనిపోయారు.. వైకుంఠ ఏకాదశి దర్శన టోకెన్లు ఇచ్చే విషయంలో తొక్కిసలాట జరిగింది.. సీఎం చంద్రబాబు ఈ సంఘటనలో సీరియస్ అయ్యారు.. కొంతమంది అధికారుల బదిలీ కూడా జరిగింది.
Read Also: Noise ColorFit Pro 6: AI ఫీచర్లతో నాయిస్ న్యూ స్మార్ట్ వాచ్లు.. ధర ఎంతంటే?
Also Read
- Tobacco Farmers: పొగాకు రైతులకు సర్కార్ గుడ్న్యూస్.. క్వింటాల్కు రూ.1,000 ప్రోత్సాహకం, వడ్డీలేని రుణాలు
- AP PPP Policy 2026కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. కీలక ఉత్తర్వులు జారీ
- AP Local Body Elections: ఏపీలో ఎన్నికల సందడి.. పంచాయతీరాజ్ శాఖ క్లారిటీ
- Snake Bite Treatment in 108 ambulance: పాముకాటుకు అంబులెన్స్లోనే చికిత్స.. 108 వాహనాల్లో తొలిసారి ఇంజక్షన్లు
తొక్కిసలాట సంఘటనకు సంబంధించి ప్రభుత్వం జ్యూడిషియల్ విచారణకు నిర్ణయం తీసుకుంది.. భవిష్యత్ లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి..? ఈ ఘటనకు కారణాలు ఏంటి..? బాధ్యతా రాహిత్యంగా ఎవరు ఉన్నారు..? అనేది విచారణలో తేలనుంది.. ఆరు నెలల కాలంలో విచారణ నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. తిరుమల తిరుపతి అంశంపై ఇప్పటికే అనేక రకాలుగా చర్చ జరుగుతోంది. దీంతో తొక్కిసలాట తర్వాత మరింత చర్చనీయాంశంగా టీటీడీ మారింది.. జ్యూడిషియల్ విచారణ తర్వాత ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో చూడాలి.
Read Also: Farooq Abdullah: బంగ్లాదేశ్ని నిందించలేము.. సైఫ్ అలీ ఖాన్ ఘటనపై ఫరూఖ్ అబ్దుల్లా..
కాగా, ఈ నెల 8న తిరుపతిలో వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్ల జారీ కోసం జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించిన ఘటన తీవ్ర కలకలం రేపుతుండగా.. ఈ ఘటనపై జ్యూడీషియల్ విచారణకు ఆదేశించింది ప్రభుత్వం.. ఏపీ హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఎం.సత్యనారాయణ మూర్తి నేతృత్వంలో జ్యుడిషియల్ విచారణ జరగనుంది.. ఆరు నెలల్లో విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం పేర్కొంది.. విచారణ జరిపేందుకు అన్ని రకాల అధికారాలను కమిషన్ కు ఇచ్చింది ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు సీఎస్ విజయానంద్..
తాజావార్తలు
-
ICC: క్రికెట్ ప్రపంచంలో ఐసీసీకి ఊహించని షాక్.. తిరగబడ్డ రెండు దేశాలు..
-
Lal Darwaza Rangam : లాల్ దర్వాజా రంగంలో భవిష్యవాణి.. ‘భయపడొద్దు’ అన్న మహంకాళి..!
-
RGV నుంచి సంచలన సినిమా.. T-Series నిర్మాణంలో ‘పోలీస్ కంపెనీ’!
-
Bhatti Vikramarka : తెలంగాణకు బ్యాటరీ బూస్ట్.. క్వాంటమ్స్కేప్కు భట్టి ఆహ్వానం..!
-
CRS Portal : హైదరాబాద్లో గుడ్న్యూస్.. ఇక ఇంటి నుంచే బర్త్, డెత్ సర్టిఫికెట్లు
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!