AP Government: గుడ్న్యూస్ చెప్పిన సర్కార్.. కందిపప్పు, చక్కెర ధరలు భారీగా తగ్గింపు..
- గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..
- కందిపప్పు.. చక్కెర ధరలు భారీగా తగ్గింపు..
- రేషన్కార్డుదారులకు ప్రయోజనం..
- ఏపీలో లబ్ధిపొందనున్న 4.32 కోట్ల మంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Government: కందిపప్పు, చక్కెర ధరలు భారీగా తగ్గించి శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అయితే, ఈ నిర్ణయంతో రేషన్కార్డు ఉన్నవారికే లబ్ధిచేకూరనుంది.. ఎందుకంటే.. రాష్ట్ర ప్రజలకు పౌరసరఫరాల శాఖ.. కందిపప్పు, చక్కెర ధరలను తగ్గించింది. నెల వ్యవధిలోనే రెండు సార్లు కందిపప్పు ధరలను తగ్గించారు. బహిరంగ మార్కెట్లో కిలో కందికప్పు ధర క్వాలిటీని బట్టి.. రూ.150.. రూ.160.. రూ.170 ఇలా పలుకుతుండగా.. దాయితపై కిలో కందిపప్పును రూ.67కే అందించనుంది ప్రభుత్వం.. మరోవైపు.. కిలో షుగర్ ధర.. బహిరంగ మార్కెట్లో రూ.50కి పైగా పలుకుతుండగా.. రూ.17 అరకిలో చక్కెర పంపిణీకి పౌరసరఫరాల శాఖ శ్రీకారం చుట్టనుంది.. నిత్యావసరాల ధరలను కంట్రోల్ చేసేలా చర్యలకు ఉపక్రమించింది ఏపీ ప్రభుత్వం.. తక్కువ ధరలకు రేషన్ షాపుల్లో కందిపప్పు.. షుగర్ విక్రయించాలని నిర్ణయం తీసుకున్నారు..
Read Also: The Goat OTT: విజయ్ అభిమానులకు శుభవార్త.. ఓటీటీలోకి ‘ది గోట్’! స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Also Read
- CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
- YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
- CM Chandrababu: ధరలకు కళ్లెం.. ద్రవ్యోల్బణం కట్టడికి సీఎం కీలక ఆదేశాలు
- Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో.. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో ఏపీ ప్రభుత్వం ఈ నెల నుంచే కందిపప్పు, షుగర్ను పంపణీ చేస్తోంది. ఇక, గోధుమపిండితో పాటుగా రాగులు, జొన్నల్ని కూడా రేషన్తో పాటూ అందించేందుకు కసరత్తు చేస్తోంది ప్రభుత్వం.. ఇక, తెనాలిలో ఇవాళ మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా చక్కెర, కందిపప్పు పంపిణీ కార్యక్రమం చేపట్టారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఒక 1.49 కోట్ల రేషన్ కార్డుదారులకు తక్కువ ధరకు కందిపప్పు, చక్కెర అందచేయాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.. తక్కువ ధరలకు కందిపప్పు, చక్కెర అందించడం వల్ల 4.32 కోట్ల మంది లబ్ది పొందుతారని తెలిపారు.. ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 29,811 రేషన్ దుకాణాల ద్వారా కిలో కందిపప్పు, అరకేజీ చక్కెర తగ్గించిన ధరకే పంపిణీ చేస్తామని వెల్లడించారు ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.
తాజావార్తలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
-
Udaya Bhanu: ‘పీఆర్’ పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
-
Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
-
Jeevanlal Lavidiya : మాజీ ఐటీ కమిషనర్కు మరో షాక్.. భార్యపైనా కేసు.!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!