Amaravati Railway Line: అమరావతికి రైల్వే లైన్.. ఫోకస్ పెట్టిన ఏపీ సర్కార్..
- అమరావతి రైల్వే లైన్ ఏర్పాటుపై ఏపీ సర్కార్ ఫోకస్..
- భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల..
- తదుపరి చర్యలకు సిద్ధం అవుతోన్న అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amaravati Railway Line: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం వైపు వడివడిగా అడుగులు వేస్తోంది కూటమి ప్రభుత్వం.. ఇప్పటికే కీలక నిర్మాణాలకు అనుమతులు కూడా జారీ చేసింది.. ఇదే సమయంలో అమరావతి రైల్వే లైన్ ఏర్పాటుపై ఏపీ సర్కార్ ఫోకస్ పెంచింది. భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల కావడంతో తదుపరి చర్యలకు అధికారులు సిద్ధం అవుతున్నారు.
Read Also: Warangal Crime: వరంగల్ జిల్లాలో దారుణం.. గర్ల్స్ క్యాంపస్లో విద్యార్థిని ఆత్మహత్య..
Also Read
- AP Local Body Election: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఎన్నికల సంఘం
- Heavy Rain Alert : ఏపీకి భారీ వర్ష ముప్పు.. ఉత్తరాంధ్రకు అలర్ట్
- Karumuri Nageswara Rao : ఏపీ లిక్కర్ రవాణా స్కామ్లో మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్
- Honey Trap : రాజమహేంద్రవరంలో హనీ ట్రాప్ కలకలం.. నలుగురు మహిళలు అరెస్ట్
అమరావతి కొత్త రైల్వేలైన్ ఏర్పాటుకు భూ సేకరకణ కోసం గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రతిపాదిత భూ సేకరణపై ఏమైనా అభ్యంతరాలుంటే 2025 జనవరి 16వ తేదీలోపు తెలపాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకు నిర్మించే నూతన రైల్వేలైను కోసం.. 297 ఎకరాల భూమిని సేకరించనున్నారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం గొట్టుముక్కల, పరిటాల, వీరులపాడు మండలం పెద్దాపురం, గూడెం మాధవరం, జుజ్జూరు, నరసింహారావుపాలెం, చెన్నారావుపాలెం, అల్లూరులోభూ సేకరణ జరపనున్నారు.
Read Also: PV Sindhu Reception: కనులవిందుగా సింధు, సాయి రిసెప్షన్.. అతిథులుగా అగ్ర తారలు!
అయితే, రైల్వే లైను ఏర్పాటు కోసం ప్రతిపాదించిన భూముల్లో 99 శాతం ప్రైవేటు భూములే ఉన్నాయి. ఇందులో ఒకటి రెండు దేవదాయ భూములు ఉన్నాయి. మరోవైపు నోటిఫికేషన్ తర్వాత న్యాయపరమైన చిక్కుల్లో ఉన్న వాటిని పరిష్కరించటం కోసం అధికారులు మార్గాలు వెతుకుతున్నారు. ఇటు భూములను గుర్తించి నోటిఫికేషన్ కూడా ఇవ్వటంతో ఇకపై గ్రామ సభలను ఏర్పాటు చేసి అభ్యంతరాలను స్వీకరించనున్నారు. మొత్తం ప్రక్రియకు ఆరు నెలలు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది..
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఇది ఫెడరల్ స్ఫూర్తిపై దెబ్బ.. పార్లమెంట్లో పంచాయితీ ఖాయం
-
Tamil Nadu: చెన్నైలో పరందూర్ ఎయిర్పోర్టును రద్దు చేసిన ప్రభుత్వం.. మండిపడ్డ స్టాలిన్
-
CM Revanth Reddy : కేంద్రంపై సీఎం రేవంత్ ఫైర్.. నన్ను కాదు.. తెలంగాణ ప్రజలనే తిరస్కరించారు
-
Pydithalli Ammavari Jatara 2026: విజయనగరం పైడితల్లి జాతర షెడ్యూల్ ఇదే.. సిరిమాను ఉత్సవం ఎప్పుడంటే?
-
Hyderabad Traffic : హైదరాబాద్ ట్రాఫిక్కు అసలు విలన్ ఎవరు.?
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!