AP Power Staff JAC: విద్యుత్ ఉద్యోగుల చర్చలు విఫలం.. ఎల్లుండి నుంచి సమ్మె..
- విద్యుత్ ఉద్యోగుల చర్చలు విఫలం..
- ప్రధాన అంశాలపై స్పష్టత రాలేదని స్పష్టం చేసిన JAC..
- కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపైనా ఎటువంటి హామీ లభించలేదని ఆవేదన..
- అక్టోబర్ 15 నుండి యథావిధిగా సమ్మె..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Power Staff JAC: విద్యుత్ ఉద్యోగుల చర్చలు విఫలమయ్యాయి. రెండున్నర గంటల పాటు జరిగిన చర్చల్లో ఏకాభిప్రాయం కుదరలేదు. విద్యుత్తు యాజమాన్యం ఎదుట మొత్తం 29 డిమాండ్లు ఉంచినా, ప్రధాన అంశాలపై స్పష్టత రాలేదని JAC స్పష్టం చేసింది. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపైనా ఎటువంటి హామీ లభించలేదని ఆవేదన వ్యక్తమైంది. దాంతో, అక్టోబర్ 15 నుండి సమ్మె యథావిధిగా కొనసాగుతుందని విద్యుత్తు JAC ప్రకటించింది.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
Also Read
- Pramod Sawant: అనుభవం.. స్థిరత్వం.. ఆ తర్వాతే రాజకీయాలు.. 40 ఏళ్ల తర్వాతే పాలిటిక్స్లోకి రావాలి..!
- CM Chandrababu : చంద్రబాబు ఫుల్ బిజీ.. ఉత్తరాంధ్రలో ఒక్కరోజే 3 జిల్లాలు..
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- YS Viveka M*urder Case: వైఎస్ వివేకా కేసులో ఈడీ కీలక ప్రకటన.. అవినాష్ రెడ్డి ఇంట్లో రూ.24 లక్షలు సీజ్
మొత్తంగా ఏపీలో విద్యుత్ ఉద్యోగులు సమర భేరి మోగించారు. సంవత్సరంగా కొనసాగుతున్న చర్చలు ఫలితం ఇవ్వకపోవడంతో ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. దాంట్లో భాగంగా ఈ రోజు చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యుత్తు ఉద్యోగులు వేలాదిగా తరలివచ్చారు.. ఇక ఎల్లుండి రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేయనున్నారు. విద్యుత్ ఉద్యోగుల సమ్మె ఎఫెక్ట్ రాష్ట్రంపై భారీగా పడనుంది. ప్రజలకి ఇబ్బందులు, కీలక రంగాలు, ముఖ్యమైన సేవలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.
Read Also: Why Can’t I Sleep: మీకు నిద్రపట్టకపోడానికి కారణాలు తెలుసా?
వేతనాలు, సర్వీస్ హక్కులు, ప్రమోషన్లు, పెన్షన్ విధానం వంటి కీలక అంశాలతో కూడిన 15 ప్రధాన డిమాండ్లు నెరవేర్చాలని విద్యుత్తు జేఏసీ ప్రభుత్వంతో, విద్యుత్తు యాజమాన్యంతో ఏడాదిగా పలు చర్చలు జరిపింది. అయితే, తాజాగా జరిగిన సమావేశాల్లో కూడా ఏ ఒక్క డిమాండ్పై సానుకూల నిర్ణయం రాకపోవడంతో ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. ఏడాది పాటు చర్చలు జరిగినా పరిష్కారం లేకపోవడంతో ఇప్పుడు ఉద్యమమే మార్గంగా ఎంచుకున్నారు. ఈ రోజు ధర్నా చౌక్ లో జరిగిన చలో విజయవాడ కు విద్యుత్ రంగంలోని రెగ్యులర్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ సిబ్బంది, కార్మికులు పెద్ద ఎత్తున హాజరు అయ్యారు. మరోవైపు ఎల్లుండి నుండి రాష్ట్రవ్యాప్తంగా సమ్మె ప్రారంభం కానుంది. ఈ సమ్మెలో సుమారు 80,000 మంది విద్యుత్ సిబ్బంది పాల్గొననున్నారు.వీరిలో 34,600 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 29,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు, అలాగే 27,638 మంది పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షనర్లు ఉన్నారు.
తాజావార్తలు
-
CJP: కాక్రోచ్ పార్టీపై కేసు.. రాజస్థాన్ గ్రామస్తుల ఫిర్యాదు..
-
Karnataka: ఐఏఎస్ అధికారి జ్ఞానేంద్ర కుమార్ అదృశ్యం.. పోలీసుల గాలింపు
-
Allu Arjun: అల్లు ఆర్మీకి షాకింగ్ న్యూస్! బన్నీతో సినిమా ఉంటుందా? ఉండదా? సందీప్ బ్రదర్ కామెంట్స్ వైరల్!
-
Cheque Book New Rules 2026: చెక్బుక్ కొత్త రూల్స్.. మీ చెక్పై ఈ సెక్యూరిటీ కోడ్ ఉందా? చెక్ చేసుకోండి!
-
Super EL Nino: ముంచుకొస్తున్న సూపర్ ఎల్నినో ముప్పు.. 100 ఏళ్ల రికార్డ్ బద్దలవుతోందా?
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!