Deputy CM Pawan Kalyan: గజేంద్ర సింగ్ షెఖావత్లో ముగిసిన పవన్ కల్యాణ్ భేటీ.. ఏడు ప్రాజెక్టుపై ప్రతిపాదనలు..
- ఢిల్లీలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బిజీబిజీ..
- కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్తో సమావేశం..
- ఏపీ పర్యాటక రంగంలో 7 ప్రాజెక్టులపై ప్రతిపాదనలు అందజేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హస్తిన పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు.. సోమవారం ఢిల్లీ చేరుకున్న ఆయన.. తన పర్యటనలో భాగంగా కాసేపటి క్రితం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్తో సమావేశం అయ్యారు.. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెంట.. జనసేన ఎంపీలు వల్లభనేని బాలశౌరి, ఉదయ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు.. ఇక, ఈ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్ కల్యాణ్.. తనకు గజేంద్ర సింగ్ షెఖావత్ అంటే అపారమైన గౌరవం అన్నారు.. ఆయన కేంద్ర జలశక్తి మంత్రిగా పోలవరం ప్రాజెక్టుకు సహకరించారని గుర్తుచేశారు.. ఇక, ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో 7 ప్రాజెక్టులపై ప్రతిపాదనలు అందించామని వెల్లడించారు.. ఆంధ్రప్రదేశ్ కు 975 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరం ఉంది.. గండికోట ఇండియన్ గ్రాండ్ కేనియన్ లా అభివృద్ధి చేయవచ్చు అన్నారు పవన్ కల్యాణ్.. మరోవైపు.. రాష్ట్రంలో పర్యాటక విశ్వవిద్యాలయం పెట్టాలని గజేంద్ర సింగ్ షెఖావత్ను కోరామని.. దీనికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
Read Also: President Droupadi Murmu: పార్లమెంటులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికిన లోక్సభ స్పీకర్
Also Read
- AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
- YS Jagan: 'దిశ' లేకపోతే మహిళల భద్రత ఎలా?.. ‘మహిళలు, చిన్నారులకు ఇది చీకటి రోజు’
- Minister Nimmala Ramanaidu: వెలిగొండ ప్రాజెక్టుపై కీలక ఆదేశాలు.. ఈ నెలలోనే నల్లమల సాగర్కు కృష్ణా జలాలు
- AP DSC 2026: టీచర్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్న్యూస్.. త్వరలో కొత్త డీఎస్సీ..
ఇక, ఢిల్లీ పర్యటనలో ఫుల్ బిజీగా గడపనున్నారు పవన్ కల్యాణ్.. ఈ రోఉ మధ్యాహ్నం 1 గంటలకు కేంద్ర జలశక్తి మంత్రితో భేటీ కానున్నారు.. మధ్యాహ్నం 3:15 కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశం కానున్నారు.. ఏపీకి రావాల్సిన నిధులు.. పెండింగ్ అంశాలపై సమాలోచనలు చేయనున్నారు.. సాయంత్రం 4:30కి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో భేటీ అయ్యి.. రాష్ట్రానికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టులపై చర్చించనున్నారు.. ఇక, సాయంత్రం 5:15 గంటలకు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి లలన్ సింగ్ తో భేటీకానున్నారు పవన్ కల్యాణ్.. మరోవైపు.. పార్లమెంట్ లో రేపు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కాబోతున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
తాజావార్తలు
-
Fazilka Border Drone Arms Smuggling: ఫాజిల్కా సరిహద్దు వద్ద పాకిస్థాన్ కుట్ర భగ్నం.. డ్రోన్, పిస్టల్, తూటాలు స్వాధీనం
-
Hollywood Box Office: ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ vs ‘ది ఒడిస్సీ’.. షేక్ అవుతున్న బాక్సాఫీస్.. కలెక్షన్స్ లో ఎవరిది పైచేయి?
-
Irumudi Trailer: భీమవరంలో రవితేజ హంగామా.. ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్ అక్కడే!
-
Alluri District Tribal Bandh: అల్లూరి జిల్లాలో ఆదివాసీల బంద్.. స్వల్ప ఉద్రిక్తత.!
-
Hyderabad: స్టేడియం వద్ద కిక్కిరిసిన నిరుద్యోగులు.. హైడ్రా ఉద్యోగాల కోసం క్యూ కట్టిన వేలాది మంది!
ట్రెండింగ్
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!