President Droupadi Murmu: పార్లమెంటులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికిన లోక్సభ స్పీకర్
- పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మంగళవారం నాడు రెండో రోజు కొనసాగుతున్నాయి
- నేటితో రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు
- రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికిన లోక్సభ స్పీకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
President Droupadi Murmu In Parliament: సోమవారం నాడు మొదలైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మంగళవారం నాడు రెండో రోజు కొనసాగుతున్నాయి. నేటితో రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తవుతుంది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈరోజు పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాణం, చారిత్రక ప్రయాణానికి సంబంధించిన లఘు చిత్రాన్ని కూడా ప్రదర్శించనున్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. గత ఏడున్నర దశాబ్దాల్లో మన రాజ్యాంగం నిజమైన అర్థంలో ప్రజాస్వామ్య రాజ్యాంగమని నిరూపించబడిందని అన్నారు. అలాగే.. 1949 నవంబర్ 26, భారత ప్రజల ప్రతినిధి అయిన రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన చారిత్రాత్మక రోజుని, ఈ ఏడున్నర దశాబ్దాలలో మన రాజ్యాంగం నిజమైన ప్రజాస్వామ్య రాజ్యాంగంగా నిరూపించబడిందని అయన అన్నారు. రాజకీయ స్వాతంత్రంతో పాటు సామాజిక-ఆర్థిక స్వతంత్ర దిశలో మనం అనేక కోణాలను సాధించాము. రాజ్యాంగాన్ని స్వీకరించిన 75 అద్భుతమైన సంవత్సరాలు భారతీయులందరికీ ఒక ప్రత్యేకమైన విజయమని ఆయన అన్నారు. భారత రాజ్యాంగం దేశానికి న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి మార్గదర్శక సూత్రాలను అందించిందని.. ప్రాథమిక హక్కుగా, పౌరులకు వారి ఆకాంక్షల స్వయం పాలన ఇవ్వబడిందని ఆయన పేర్కొన్నారు. దేశానికి విధేయత చూపే పౌరులను సిద్ధం చేసే పాత్రను పోషించే విధులను విలీనం చేశారని, మన రాజ్యాంగం రాష్ట్ర విధాన మార్గదర్శక సూత్రాల ద్వారా పాలనకు మార్గనిర్దేశం చేసిందని ఓం బిర్లా అన్నారు. ఈ రోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశప్రజలందరికీ నా శుభాకాంక్షలని, ఈ సందర్భంగా భారత రాజ్యాంగ స్థాపకులకు నేను నివాళులు అర్పిస్తున్నానట్లు పేర్కొన్నారు.
Also Read: Robbery In Gold Shop: తుపాకీలతో బెదిరించి నగల దుకాణంలో భారీ దోపిడీ.. దుకాణదారుపై కాల్పులు
Also Read
- Dahi Masala Khichdi Recipe: వేసవిలో చల్లదనం ఇచ్చే దహీ మసాలా కిచిడి.. రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది..
- Hyderabad: నెంబర్ ప్లేట్ లేని కారుతో ఢీ.. నగరంలో న్యాయవాది దారుణ హత్య!
- Pakistan Cuts Petrol and Diesel Prices: పాక్లో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. వరుసగా రెండోసారి ఊరట
- Trump: భారత్ దెబ్బకు భయపడి అమెరికా కాళ్లబేరానికి పాక్.. ఆపరేషన్ సిందూర్ సీజ్ఫైర్పై ట్రంప్ సంచలన ప్రకటన..
26 नवंबर 1949, वह ऐतिहासिक दिन जब भारत के लोगों की प्रतिनिधि – संविधान सभा – ने भारत के संविधान को अंगीकृत किया।
इन साढ़े सात दशकों में हमारा संविधान सच्चे अर्थों में एक लोकतांत्रिक संविधान सिद्ध हुआ है। हमने राजनीतिक स्वतंत्रता के साथ सामाजिक – आर्थिक स्वाधीनता की दिशा में अनेक… pic.twitter.com/5JF5Fe29ih— Om Birla (@ombirlakota) November 26, 2024
ఈ సమావేశంలో భాగంగా భారత దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు భవనానికి 11 గంటల సమయంలో చేరుకున్నారు. రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సెంట్రల్ హాల్లో జరిగే ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగిస్తారు. ఈ సందర్బంగా పార్లమెంటులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా.
తాజావార్తలు
-
Dahi Masala Khichdi Recipe: వేసవిలో చల్లదనం ఇచ్చే దహీ మసాలా కిచిడి.. రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది..
-
Rukmini Vasanth: AI డీప్ఫేక్ బికినీ వీడియో పై..క్లారిటీ ఇచ్చిన రుక్మిణి వసంత్
-
Hyderabad: నెంబర్ ప్లేట్ లేని కారుతో ఢీ.. నగరంలో న్యాయవాది దారుణ హత్య!
-
Pakistan Cuts Petrol and Diesel Prices: పాక్లో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. వరుసగా రెండోసారి ఊరట
-
Trump: భారత్ దెబ్బకు భయపడి అమెరికా కాళ్లబేరానికి పాక్.. ఆపరేషన్ సిందూర్ సీజ్ఫైర్పై ట్రంప్ సంచలన ప్రకటన..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!