President Droupadi Murmu: పార్లమెంటులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికిన లోక్సభ స్పీకర్
- పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మంగళవారం నాడు రెండో రోజు కొనసాగుతున్నాయి
- నేటితో రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు
- రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికిన లోక్సభ స్పీకర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
President Droupadi Murmu In Parliament: సోమవారం నాడు మొదలైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మంగళవారం నాడు రెండో రోజు కొనసాగుతున్నాయి. నేటితో రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తవుతుంది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈరోజు పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాణం, చారిత్రక ప్రయాణానికి సంబంధించిన లఘు చిత్రాన్ని కూడా ప్రదర్శించనున్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. గత ఏడున్నర దశాబ్దాల్లో మన రాజ్యాంగం నిజమైన అర్థంలో ప్రజాస్వామ్య రాజ్యాంగమని నిరూపించబడిందని అన్నారు. అలాగే.. 1949 నవంబర్ 26, భారత ప్రజల ప్రతినిధి అయిన రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన చారిత్రాత్మక రోజుని, ఈ ఏడున్నర దశాబ్దాలలో మన రాజ్యాంగం నిజమైన ప్రజాస్వామ్య రాజ్యాంగంగా నిరూపించబడిందని అయన అన్నారు. రాజకీయ స్వాతంత్రంతో పాటు సామాజిక-ఆర్థిక స్వతంత్ర దిశలో మనం అనేక కోణాలను సాధించాము. రాజ్యాంగాన్ని స్వీకరించిన 75 అద్భుతమైన సంవత్సరాలు భారతీయులందరికీ ఒక ప్రత్యేకమైన విజయమని ఆయన అన్నారు. భారత రాజ్యాంగం దేశానికి న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి మార్గదర్శక సూత్రాలను అందించిందని.. ప్రాథమిక హక్కుగా, పౌరులకు వారి ఆకాంక్షల స్వయం పాలన ఇవ్వబడిందని ఆయన పేర్కొన్నారు. దేశానికి విధేయత చూపే పౌరులను సిద్ధం చేసే పాత్రను పోషించే విధులను విలీనం చేశారని, మన రాజ్యాంగం రాష్ట్ర విధాన మార్గదర్శక సూత్రాల ద్వారా పాలనకు మార్గనిర్దేశం చేసిందని ఓం బిర్లా అన్నారు. ఈ రోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశప్రజలందరికీ నా శుభాకాంక్షలని, ఈ సందర్భంగా భారత రాజ్యాంగ స్థాపకులకు నేను నివాళులు అర్పిస్తున్నానట్లు పేర్కొన్నారు.
Also Read: Robbery In Gold Shop: తుపాకీలతో బెదిరించి నగల దుకాణంలో భారీ దోపిడీ.. దుకాణదారుపై కాల్పులు
Also Read
- Rakesh Mehta: మాజీ ఢిల్లీ సీఎస్ రాకేష్ మెహతా ఆత్మహత్య.. ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యం..
- ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
- Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
- Telangana Assembly: మహిళా పోలీసుల విధులకు ఆటంకం.. కేటీఆర్, హరీశ్రావు సహా పలువురిపై మరో కేసు
26 नवंबर 1949, वह ऐतिहासिक दिन जब भारत के लोगों की प्रतिनिधि – संविधान सभा – ने भारत के संविधान को अंगीकृत किया।
इन साढ़े सात दशकों में हमारा संविधान सच्चे अर्थों में एक लोकतांत्रिक संविधान सिद्ध हुआ है। हमने राजनीतिक स्वतंत्रता के साथ सामाजिक – आर्थिक स्वाधीनता की दिशा में अनेक… pic.twitter.com/5JF5Fe29ih— Om Birla (@ombirlakota) November 26, 2024
ఈ సమావేశంలో భాగంగా భారత దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు భవనానికి 11 గంటల సమయంలో చేరుకున్నారు. రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సెంట్రల్ హాల్లో జరిగే ఉభయ సభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగిస్తారు. ఈ సందర్బంగా పార్లమెంటులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా.
తాజావార్తలు
-
Rakesh Mehta: మాజీ ఢిల్లీ సీఎస్ రాకేష్ మెహతా ఆత్మహత్య.. ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యం..
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
Telangana Assembly: మహిళా పోలీసుల విధులకు ఆటంకం.. కేటీఆర్, హరీశ్రావు సహా పలువురిపై మరో కేసు
-
Ujjain: 170 ఏళ్ల హనుమంతుడి విగ్రహం.. రెండు రోజులు ప్రయత్నించినా అంగుళం కూడా కదల్లేదు!
ట్రెండింగ్
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!
-
Tata Nexonపై రూ.75,000 వరకు ఆఫర్.. స్క్రాపేజ్ బెనిఫిట్తో మరింత ఆదా.!
-
కేవలం 6.39 మి.మీ. మందం, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO CAMON Slim 5G లాంచ్.!