AP Collectors Conference: నేటి నుంచి కలెక్టర్ల సదస్సు.. 19 అంశాలపై సీఎం చంద్రబాబు ఫోకస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Collectors Conference: అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన, శాంతిభద్రతలు సహా అనేక అంశాలపై ఫోకస్ పెట్టిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి కలెక్టర్ల సదస్సుకు సిద్ధమయ్యారు.. ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండు రోజుల పాటు 8వ కలెక్టర్ల సదస్సు జరగనుంది. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, పరిపాలన, శాంతిభద్రతలు తదితర అంశాలపై ఈ సదస్సులో విస్తృతంగా సమీక్షించనున్నారు. మొత్తం 19 కీలక అంశాలపై కలెక్టర్లతో సీఎం చర్చించి, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై దిశానిర్దేశం చేయనున్నారు.
తొలిరోజు కీలక అంశాలపై సమీక్ష
సదస్సు తొలిరోజు గత కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాల అమలుపై సమీక్ష నిర్వహిస్తారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధి, జిల్లా వారీ అభివృద్ధి లక్ష్యాలపై అధికారులు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. జీఎస్డీపీ వృద్ధి, స్వర్ణ ఆంధ్ర–2047 జిల్లా రోడ్మ్యాప్లు వంటి అంశాలపై ప్రత్యేకంగా చర్చ జరగనుంది. రాష్ట్రాన్ని దీర్ఘకాలికంగా అభివృద్ధి పథంలో నడిపించేందుకు జిల్లాల వారీగా చేపట్టాల్సిన చర్యలపై కలెక్టర్లకు సూచనలు ఇవ్వనున్నారు. సూపర్ సిక్స్ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై కూడా సమీక్ష ఉంటుంది. ఆరోగ్యం, విద్యాశాఖల పనితీరుతో పాటు జిల్లాల్లో ప్రజలకు అందుతున్న సేవలు, వాటి ఫలితాలపై కలెక్టర్లతో సీఎం చర్చించనున్నారు. పెట్టుబడులను ఆకర్షించడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మెరుగుపరచడం, జిల్లాల ఆర్థికాభివృద్ధికి అవకాశాలను వినియోగించుకోవడంపైనా సమీక్ష జరగనుంది.
Also Read
- Are Shyamala: కులాలు, మతాలు మార్చేశారా?.. డీఎస్సీపై ఆరె శ్యామల సంచలన వ్యాఖ్యలు
- TDP Leadership Conclave: నీళ్లు, పరిశ్రమలు, ఉద్యోగాలు.. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు భారీ బ్లూప్రింట్
- CM Chandrababu: అన్ని సర్వేల్లో కూటమిదే గెలుపు.. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా విజయం మనదే..!
- TDP Leadership Conclave: ఎమ్మెల్యేలకు చంద్రబాబు టాస్క్.. స్థానిక ఎన్నికల్లో గెలవాల్సిందే.. లేదంటే పని చేయనట్టే..!
ఎల్నినో ప్రభావంపై ప్రత్యేక దృష్టి
వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఎల్నినో ప్రభావంపై కూడా ప్రత్యేకంగా చర్చించనున్నారు. ప్రజలకు తాగునీటి సరఫరా, జలధార కార్యక్రమం పురోగతిపై కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే సమయంలో వివిధ జిల్లాల కలెక్టర్లు చేపట్టిన ఉత్తమ ఆవిష్కరణలు, వినూత్న కార్యక్రమాలకు ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసి వాటి గురించి వివరించనున్నారు.
రెండో రోజ ఈ అంశాలపై ఫోకస్..
సదస్సు రెండో రోజు ఈ-గవర్నెన్స్, RTGS, PGRS పనితీరుపై సమీక్ష నిర్వహిస్తారు. భూ పరిపాలన, కేంద్ర ప్రభుత్వ పథకాల నిధుల వినియోగం, వాటి అమలు తీరుపై చర్చిస్తారు. జిల్లాల స్థాయిలో ఎదురవుతున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు కలెక్టర్లతో ఓపెన్ ఫోరం నిర్వహించనున్నారు. రెండో రోజు చివరగా రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితిపై సమీక్ష జరగనుంది. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు ముగింపు ప్రసంగం చేస్తారు. రెండు రోజుల సదస్సులో చర్చించిన అంశాల ఆధారంగా జిల్లాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజా సేవల మెరుగుదలకు కలెక్టర్లకు కీలక మార్గదర్శకాలు ఇవ్వనున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
iPhone 18 Pro సిరీస్ వచ్చేసింది..బ్యాటరీ, ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్స్, ఫుల్ డీటెయిల్స్ ఇవే
-
iPhone Prices Hiked: iPhone 18 Pro సిరీస్ లాంచ్ ఎఫెక్ట్.. iPhone 17, iPhone Air, iPhone 17e ధరలు భారీగా పెంపు!
-
AP Collectors Conference: నేటి నుంచి కలెక్టర్ల సదస్సు.. 19 అంశాలపై సీఎం చంద్రబాబు ఫోకస్..
-
Apple iPhone Duo: Apple తొలి ఫోల్డబుల్ ఫోన్ iPhone Duo వచ్చేసింది.. A20 Pro చిప్, 2TB స్టోరేజ్, 48MP కెమెరా
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!