Encounter: జమ్మూ కాశ్మీర్ దోడా జిల్లాలో ఎన్కౌంటర్.. కథువా ఉగ్రదాడి తర్వాత ఘటన..
- జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్..
- దోడా జిల్లాలో భద్రతా సిబ్బంది - ఉగ్రవాదులకు మధ్య కాల్పులు..
- కథువా ఉగ్రదాడి తర్వాత రోజే మరో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Encounter: జమ్మూ కాశ్మీర్ వరస ఉగ్ర ఘటనలతో అట్టుడికిపోతోంది. తాజాగా దోడా జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. నిన్న కథువాలో ఉగ్రవాదులు ఆర్మీ వాహనాలపై మెరుపుదాడి చేసి ఐదుగురు జవాన్ల మరణాలకు కారణమయ్యారు. ఈ ఘటన జరిగిన ఒక రోజు తర్వాత జమ్మూ లోని దోడా జిల్లాలో తాజా ఎన్కౌంటర్ ప్రారంభమైంది.
Read Also: BJP: “బెంగాల్లో మరో తాలిబాన్ వీడియో”.. తృణమూల్ అరాచకాలపై రాహుల్ గాంధీ మౌనం ఎందుకు..?
Also Read
- PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
- BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
కథువా ఘటన 48 గంటల్లో ఆర్మీపై జరిగిన రెండో దాడి. అంతకుముందు రాజౌరీలోని సైనిక శిబిరంపై ఆదివారం ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడిని సైన్యం తిప్పికొట్టింది. దీంట్లో ఒక సైనికుడు గాయపడ్డాడు. ఆ తర్వాతి రోజు సోమవారం కథువాలో పెట్రోలింగ్ పార్టీపై, ఉగ్రవాదులు అడవుల్లో నక్కి గ్రెనెడ్స్ విసిరి, కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. కథువా ఘటన జరిగిన తర్వాత భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. ఈ ఘటనకు పాక్ ఉగ్రసంస్థ జైషే మహ్మద్కి సన్నిహితంగా ఉన్న కాశ్మీర్ టైగర్స్ బాధ్యత ప్రకటించుకుంది.
60 మందికి పైగా పాక్ ఉగ్రవాదులు, జింగిల్ వార్ఫేర్లో శిక్షణ పొంది జమ్మూ కాశ్మీర్లో పనిచేస్తున్నారు. గత నెల కాలం నుంచి రాజౌరీ, కథువా, దోడా జిల్లాల్లో ఉగ్రవాద దాడులు జరిగాయి. గత నెలలో ప్రధాని మోడీ మూడోసారి ప్రమాణస్వీకారం చేస్తున్న రోజే, కథువా జిల్లాలో శివ్ ఖోరీ నుంచి కత్రా వెళ్తున్న యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు దాడి చేయడంతో 10 మంది మరణించారు. జమ్మూ ప్రాంతంలోని కథువా, రాజౌరీ, దోడా జిల్లాల్లోని దట్టమైన అడవులు, కొండలు, లోయలు ఉగ్రవాదులకు అనుకూలంగా ఉన్నాయి. ఈ అడవులు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి కొనసాగుతుండటంతో ఉగ్రవాదులకు అడ్డాగా మారింది.
తాజావార్తలు
-
PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
-
Udaya Bhanu: ‘పీఆర్’ పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
-
Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!