Cabinet Sub-Committee: రుషికొండ భవనాల వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ భేటీలో కీలక చర్చలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cabinet Sub-Committee: గత ప్రభుత్వ హయాంలో విశాఖపట్నంలోని రుషికొండపై నిర్మించిన భవనాలపై పెద్ద వివాదం రేగింది.. అయితే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. రుషికొండ భవనాల వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది.. ఇప్పటికే నాలుగు సార్లు సమావేశమైన కమిటీ.. ఈ రోజు 5వ సమావేశం నిర్వహించింది.. ఈ సమావేశంలో గత నాలుగు భేటీల్లో తీసుకున్న నిర్ణయాలపై సమగ్రంగా చర్చ కొనసాగింది. సచివాలయంలోని రెండవ బ్లాక్లో మంత్రి కందుల దుర్గేష్ పేషీలో ఈ సమావేశం జరిగింది. మంత్రులు పయ్యావుల కేశవ్, బాల వీరాంజనేయ స్వామి, వర్చువల్గా పాల్గొన్నారు. సమావేశంలో విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్ వినియోగంపై కీలక నిర్ణయాల దిశగా చర్చలు జరిగాయి.
Read Also: LEADER : వచ్చింది రూ. 3కోట్లు…వేసుకుంది రూ. 25కోట్లు
Also Read
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
- YSP MPs Meet Amit Shah: అమిత్ షాతో వైసీపీ ఎంపీల భేటీ.. జగన్ భద్రత, డీఎస్సీ అక్రమాలపై ఫిర్యాదు
- Perni Nani: జగన్ దెబ్బకు సీఆర్డీఏలో 'అవిగన్' తీర్మానం.. కేబినెట్లో పెట్టనున్నారు..!
- Minister Anitha: జగన్ బయటకు వస్తే విధ్వంసమే.. పరామర్శల పేరుతో అరాచకం.. మంత్రి అనిత ఘాటు వ్యాఖ్యలు
రుషికొండలోని ఈ భవనాలను ప్రజల సందర్శనకు అనుమతించడంతో పాటు, ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మార్చే అవకాశాలపై కమిటీ ప్రత్యేకంగా చర్చించింది అని ఈ సందర్భంగా వెల్లడించారు మంత్రి కందుల దుర్గేష్… సీఆర్జెడ్ నిబంధనల ప్రకారం కొండపై 2400 చదరపు మీటర్లు, కొండ కింద మరో 2400 చదరపు మీటర్లు, మొత్తం 4800 చదరపు మీటర్ల భూమి అందుబాటులో ఉన్నట్లు కమిటీ గుర్తించింది. ఈ భూమిని ఎలా సమర్థవంతంగా వినియోగించాలనే అంశంపై వివిధ ప్రతిపాదనలు పరిశీలించారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ భవనాలను ఉపయోగించడమే లక్ష్యంగా కమిటీ ఆలోచనలు చేస్తోంది. అంతర్జాతీయ స్థాయి హోటల్ గ్రూపులు కూడా ఈ భవనాల నిర్వహణపై ఆసక్తి చూపుతున్నట్లు వెల్లడించారు. తాజ్, ఎట్మాస్పియర్ కోర్, లీలా, ఫెమా వంటి ప్రముఖ సంస్థలు ముందుకు వస్తున్న నేపథ్యంలో, మరిన్ని సంస్థలకు కూడా అవకాశం కల్పించే అంశంపై చర్చ జరిగింది.
ఇక గత ప్రభుత్వ నిర్ణయాల కారణంగా ప్రస్తుతం ఈ భవనాల నిర్వహణ, విద్యుత్ ఖర్చుల కోసం నెలకు సుమారు రూ. 25 లక్షల ప్రజా ధనం వ్యయమవుతోందని కమిటీ వెల్లడించింది. ఈ వ్యయాన్ని తగ్గిస్తూ, ఆదాయాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. సబ్ కమిటీ తుది నివేదికను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సమర్పించనుంది. అనంతరం ఆయన ఆదేశాల మేరకు రాష్ట్ర కేబినెట్లో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!