Cabinet Sub-Committee: రుషికొండ భవనాల వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ భేటీలో కీలక చర్చలు..
Cabinet Sub-Committee: గత ప్రభుత్వ హయాంలో విశాఖపట్నంలోని రుషికొండపై నిర్మించిన భవనాలపై పెద్ద వివాదం రేగింది.. అయితే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. రుషికొండ భవనాల వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది.. ఇప్పటికే నాలుగు సార్లు సమావేశమైన కమిటీ.. ఈ రోజు 5వ సమావేశం నిర్వహించింది.. ఈ సమావేశంలో గత నాలుగు భేటీల్లో తీసుకున్న నిర్ణయాలపై సమగ్రంగా చర్చ కొనసాగింది. సచివాలయంలోని రెండవ బ్లాక్లో మంత్రి కందుల దుర్గేష్ పేషీలో ఈ సమావేశం జరిగింది. మంత్రులు పయ్యావుల కేశవ్, బాల వీరాంజనేయ స్వామి, వర్చువల్గా పాల్గొన్నారు. సమావేశంలో విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్ వినియోగంపై కీలక నిర్ణయాల దిశగా చర్చలు జరిగాయి.
Read Also: LEADER : వచ్చింది రూ. 3కోట్లు…వేసుకుంది రూ. 25కోట్లు
Also Read
- YSRCP Protest: డీజిల్, పెట్రోల్ కొరత.. ఆందోళనలకు వైసీపీ పిలుపు..
- Petrol, Diesel Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్.. అధికారులకు కీలక ఆదేశాలు
- Infosysకు 20 ఎకరాల స్థలం కేటాయింపు.. ఏపీ సర్కార్ ఉత్తర్వులు
- AP Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సర్కార్ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ
రుషికొండలోని ఈ భవనాలను ప్రజల సందర్శనకు అనుమతించడంతో పాటు, ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మార్చే అవకాశాలపై కమిటీ ప్రత్యేకంగా చర్చించింది అని ఈ సందర్భంగా వెల్లడించారు మంత్రి కందుల దుర్గేష్… సీఆర్జెడ్ నిబంధనల ప్రకారం కొండపై 2400 చదరపు మీటర్లు, కొండ కింద మరో 2400 చదరపు మీటర్లు, మొత్తం 4800 చదరపు మీటర్ల భూమి అందుబాటులో ఉన్నట్లు కమిటీ గుర్తించింది. ఈ భూమిని ఎలా సమర్థవంతంగా వినియోగించాలనే అంశంపై వివిధ ప్రతిపాదనలు పరిశీలించారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ భవనాలను ఉపయోగించడమే లక్ష్యంగా కమిటీ ఆలోచనలు చేస్తోంది. అంతర్జాతీయ స్థాయి హోటల్ గ్రూపులు కూడా ఈ భవనాల నిర్వహణపై ఆసక్తి చూపుతున్నట్లు వెల్లడించారు. తాజ్, ఎట్మాస్పియర్ కోర్, లీలా, ఫెమా వంటి ప్రముఖ సంస్థలు ముందుకు వస్తున్న నేపథ్యంలో, మరిన్ని సంస్థలకు కూడా అవకాశం కల్పించే అంశంపై చర్చ జరిగింది.
ఇక గత ప్రభుత్వ నిర్ణయాల కారణంగా ప్రస్తుతం ఈ భవనాల నిర్వహణ, విద్యుత్ ఖర్చుల కోసం నెలకు సుమారు రూ. 25 లక్షల ప్రజా ధనం వ్యయమవుతోందని కమిటీ వెల్లడించింది. ఈ వ్యయాన్ని తగ్గిస్తూ, ఆదాయాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. సబ్ కమిటీ తుది నివేదికను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సమర్పించనుంది. అనంతరం ఆయన ఆదేశాల మేరకు రాష్ట్ర కేబినెట్లో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
తాజావార్తలు
-
Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
-
PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
-
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!