Cabinet Sub-Committee: రుషికొండ భవనాల వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ భేటీలో కీలక చర్చలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Cabinet Sub-Committee: గత ప్రభుత్వ హయాంలో విశాఖపట్నంలోని రుషికొండపై నిర్మించిన భవనాలపై పెద్ద వివాదం రేగింది.. అయితే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. రుషికొండ భవనాల వినియోగంపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది.. ఇప్పటికే నాలుగు సార్లు సమావేశమైన కమిటీ.. ఈ రోజు 5వ సమావేశం నిర్వహించింది.. ఈ సమావేశంలో గత నాలుగు భేటీల్లో తీసుకున్న నిర్ణయాలపై సమగ్రంగా చర్చ కొనసాగింది. సచివాలయంలోని రెండవ బ్లాక్లో మంత్రి కందుల దుర్గేష్ పేషీలో ఈ సమావేశం జరిగింది. మంత్రులు పయ్యావుల కేశవ్, బాల వీరాంజనేయ స్వామి, వర్చువల్గా పాల్గొన్నారు. సమావేశంలో విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్ వినియోగంపై కీలక నిర్ణయాల దిశగా చర్చలు జరిగాయి.
Read Also: LEADER : వచ్చింది రూ. 3కోట్లు…వేసుకుంది రూ. 25కోట్లు
Also Read
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
- Kharif Water Release: ఖరీఫ్కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
- Pithapuram Varma : వర్మ ఓదార్పు రాజకీయాలపై జనసేన అసంతృప్తి.?
- International flights cancelled: విదేశీ ప్రయాణికులకు భారీ షాక్.. 95 శాతం టిక్కెట్లు రద్దు..!
రుషికొండలోని ఈ భవనాలను ప్రజల సందర్శనకు అనుమతించడంతో పాటు, ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మార్చే అవకాశాలపై కమిటీ ప్రత్యేకంగా చర్చించింది అని ఈ సందర్భంగా వెల్లడించారు మంత్రి కందుల దుర్గేష్… సీఆర్జెడ్ నిబంధనల ప్రకారం కొండపై 2400 చదరపు మీటర్లు, కొండ కింద మరో 2400 చదరపు మీటర్లు, మొత్తం 4800 చదరపు మీటర్ల భూమి అందుబాటులో ఉన్నట్లు కమిటీ గుర్తించింది. ఈ భూమిని ఎలా సమర్థవంతంగా వినియోగించాలనే అంశంపై వివిధ ప్రతిపాదనలు పరిశీలించారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ భవనాలను ఉపయోగించడమే లక్ష్యంగా కమిటీ ఆలోచనలు చేస్తోంది. అంతర్జాతీయ స్థాయి హోటల్ గ్రూపులు కూడా ఈ భవనాల నిర్వహణపై ఆసక్తి చూపుతున్నట్లు వెల్లడించారు. తాజ్, ఎట్మాస్పియర్ కోర్, లీలా, ఫెమా వంటి ప్రముఖ సంస్థలు ముందుకు వస్తున్న నేపథ్యంలో, మరిన్ని సంస్థలకు కూడా అవకాశం కల్పించే అంశంపై చర్చ జరిగింది.
ఇక గత ప్రభుత్వ నిర్ణయాల కారణంగా ప్రస్తుతం ఈ భవనాల నిర్వహణ, విద్యుత్ ఖర్చుల కోసం నెలకు సుమారు రూ. 25 లక్షల ప్రజా ధనం వ్యయమవుతోందని కమిటీ వెల్లడించింది. ఈ వ్యయాన్ని తగ్గిస్తూ, ఆదాయాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. సబ్ కమిటీ తుది నివేదికను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సమర్పించనుంది. అనంతరం ఆయన ఆదేశాల మేరకు రాష్ట్ర కేబినెట్లో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
తాజావార్తలు
-
IPL: ‘నన్ను అస్సలు పట్టించుకోలేదు’.. కేకేఆర్పై బంగ్లాదేశ్ స్టార్ లిటన్ దాస్ సంచలన వ్యాఖ్యలు..
-
Peddi: పెద్ది సినిమాకి కూడా పర్సంటేజ్ కావాల్సిందే.. పట్టు పడుతున్న ఎగ్జిబిటర్లు!
-
Pakistan-Saudi Arabia: సౌదీ అరేబియా రక్షణకు పాకిస్తాన్ కిరాయి సైన్యం..
-
PM Modi: నార్వే ప్రధానితో మోడీ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Viral Video: మూగజీవాల చెంతన మిగిలిన గుండెకోత.. ఏనుగుల కొట్లాటలో ప్రాణాలు కోల్పోయిన మహిళ..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!