AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై ఫోకస్
- నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ..
- సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో సమావేశం..
- ఎస్ఐపీబీ భేటీలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలపనున్న కేబినెట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు కేబినెట్ సమావేశం జరగనుంది.. సాయంత్రం 4గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో ఈ భేటీ జరగనుంది. రూ.85 వేల కోట్ల పెట్టుబడులపై ఎస్ఐపీబీ భేటీలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది. రాజధాని అమరావతికి సంబంధించి గతంలో కాంట్రాక్టర్లకు కేటాయించిన పనుల టెండర్ల రద్దుకు ఈ కేబినెట్లో ఆమోదం తెలుపనున్నారు. ఆయా పనులకు సంబంధించి కొత్త టెండర్లు పిలిచే విషయంపై ఈరోజు జరగబోయే కేబినెట్లో చర్చించి.. తర్వాత వాటికి ఆమోదం తెలపనున్నారు. ఈనామ్ భూముల అంశంపై నిర్ణయం తీసుకోనుంది. సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపైనా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏపీఎస్ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణంపై ఆర్టీసీ అధికారులు ఇప్పటికే ప్రణాళికలు సిద్దం చేసినట్లు సమాచారం.
Read Also: CM Revanth Reddy: నేడు వేములవాడకు సీఎం రేవంత్.. ఆలయ అభివృద్ధికి రూ. 127 కోట్లు
Also Read
ఇక, ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డు మీటింగ్ జరిగింది. ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరిగిన తొలి మీటింగ్లో పెట్టుబడులు, ఒప్పందాలపై చర్చించారు. గడిచిన 5 నెలల్లో వివిధ పెట్టుబడుల ప్రతిపాదనలు, ఒప్పందాలపై సమీక్ష జరిపారు. మొత్తం 10 సంస్థలకు సంబంధించి 85 వేల 83 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడుల ద్వారా 33 వేల 966 ఉద్యోగాలు రానున్నాయి. భారీ పరిశ్రమలకు భూముల కోసం ల్యాండ్ పూలింగ్ విధానం చేపట్టాలన్నారు సీఎం చంద్రబాబు. పరిశ్రమలకు భూములు ఇచ్చే వారికి స్కిల్ డెవల్మెంట్ ద్వారా అదే సంస్థలో ఉద్యోగ, ఉపాధి కల్పించేలా ప్రతిపాదనలు కూడా సిద్ధంచేశారు. ఇక, పరిశ్రమ వర్గాల అవసరాలతో పాటు.. భూములు ఇచ్చే ప్రజల సంక్షేమం కూడా చూడాల్సి ఉంటుందన్నారు సీఎం చంద్రబాబు. అర్సెలార్ మిత్తల్ స్టీల్ ప్లాంటుకు అవసరమైన భూములు సేకరించాలన్నారు. ఇందుకోసం ల్యాండ్ పూలింగ్ విధానాన్ని పాటించాలని సూచించారు. అర్సెలార్ మిత్తల్ స్టీల్ ఫ్యాక్టరీ ద్వారా ప్రత్యక్షంగా 61 వేల మందికి పరోక్షంగా లక్షల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు 4 ఏళ్లలో కార్యరూపం దాల్చేలా చూడాలని మంత్రులకు సూచించారు సీఎం చంద్రబాబు. మొత్తానికి…రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులతో పాటు ఉద్యోగాలు కల్పించడం కూడా ప్రధాన ధ్యేయంగా పెట్టుకుంది ఏపీ ప్రభుత్వం. ఇక, ఈ రోజు సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న కేబినెట్ సమావేశంలో ఆమోదముద్ర వేయనున్నారు..
తాజావార్తలు
-
Jana Nayagan : జననాయగన్ రిలీజ్కు అన్ని దారులు క్లియర్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
GST Collection June 2026: జూన్లో జీఎస్టీ వసూళ్ల జోరు.. రూ.1.95 లక్షల కోట్లకు చేరిన ఆదాయం
-
Nara Lokesh: ఇప్పుడు ‘మావిగన్’.. రేపు బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ కలిపి ‘బెన్తాహై’ అంటారేమో..!
-
Donald Trump: డియర్ ట్రంప్.. నీకంత సీన్ లేదంటగా..! ప్యూ రీసెర్చ్ సెంటర్ నివేదికలో బయటపడ్డ ప్రెసిడెంట్ గారి బండారం
-
Malayalam movie updates: మోహన్లాల్తో ప్రియదర్శన్ 100వ సినిమా వాయిదా.. కారణం ఇదేనా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!