AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. జిల్లాల పునర్విభజనకు ఆమోదం
- ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాల.. జిల్లాల పునర్విభజనకు ఆమోదం..
- 3 కొత్త జిల్లాల ఏర్పాటు..
- రాజంపేటను కడపలో కలిపేందుకు గ్రీన్ సిగ్నల్..
- రైల్వేకోడూరును తిరుపతికి మారుస్తూ నిర్ణయం..
- గూడూరును నెల్లూరులో విలీనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల ప్రజా అవసరాలు, పాలనా సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
Read Also: Indonesia: ఇండోనేసియాలో ఘోర అగ్నిప్రమాదం.. వృద్ధాశ్రమంలో 16 మంది సజీవదహనం
Also Read
- Beach Shacks in AP: గోవా తరహాలో ఏపీ బీచ్లలో బార్లు.. మార్గదర్శకాలు జారీ
- Shyamala: శాంతిభద్రతలపై మౌనం.. మేకప్పై స్పందన.. హోంమంత్రి వ్యాఖ్యలకు ఆరే శ్యామల కౌంటర్..
- Thalliki Vandanam Scheme: ‘తల్లికి వందనం’పై గుడ్న్యూస్.. అధికారులకు మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు
- YS Jagan: ప్రతి ఓటును కాపాడుకోవాలి.. వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
కేబినెట్కీలక నిర్ణయాలు..
* జిల్లాల పునర్విభజనకు ఆమోదం తెలిపింది కేబినెబ్.. రాష్ట్రంలో పరిపాలనను మరింత సమర్థవంతంగా మార్చేందుకు జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
* రాజంపేట ఇకపై కడప జిల్లాలో ఉండనుంది.. ఇప్పటివరకు అన్నమయ్య జిల్లా పరిధిలో ఉన్న రాజంపేట నియోజకవర్గాన్ని కడప జిల్లాలో కలుపుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
* రైల్వేకోడూరు నియోజకవర్గం తిరుపతి జిల్లాకు రుస్తూ నిర్ణయం తీసుకున్నారు.. రైల్వేకోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లా పరిధిలోకి మార్చే ప్రతిపాదనకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.
* 3 కొత్త జిల్లాల ఏర్పాటు కానున్నాయి.. కేబినెట్ సమావేశంలో కొత్తగా మదనపల్లె, మార్కాపురం, రంపచోడవరం జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించింది. దీంతో ఆంధ్రప్రదేశ్లో మొత్తం జిల్లాల సంఖ్య 28కి పెరిగింది.
* గూడూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో విలీనం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.. గూడూరును తిరుపతి జిల్లా నుంచి నెల్లూరు జిల్లాలో కలిపేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇది ప్రజా పాలనకు మరింత దగ్గర చేస్తుందని అధికారులు తెలిపారు.
* 5 కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి.. రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం పెంచేందుకు కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఇక, కేబినెట్ ఆమోదం అనంతరం తుది గెజిట్ నోటిఫికేషన్ను ఎల్లుండి విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ గెజిట్తో జిల్లాల మార్పులు అధికారికంగా అమల్లోకి రానున్నాయి. దీంతో, జిల్లాల పునర్విభజన, కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా అందుతాయని సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీలో స్పష్టం చేసినట్లు సమాచారం. కొత్తగా ఏర్పడిన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు స్థానిక అభివృద్ధి, పాలనా సమన్వయానికి కీలకంగా మారనున్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర పరిపాలనా వ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయడం, అభివృద్ధి వికేంద్రీకరణ, పాలనా వేగం పెంచడం లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
తాజావార్తలు
-
Sai Krishna Incident: సాయికృష్ణ ఘటనపై సీఎం సీరియస్.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు
-
Vaibhav Sooryavanshi: ఫీల్డింగ్పై విమర్శలా? అయితే ఈ క్యాచ్ చూడండి.. వైభవ్ సూర్యవంశీ అద్భుతం..
-
Dhanush: తండ్రిలా తానే డైరెక్ట్ చేస్తాడా? లేదా వేరే వాళ్ళకి వదిలేస్తాడా?
-
Team India: 400 ప్లస్ స్కోర్తో మరో రికార్డు సాధించిన టీమిండియా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాడ్లను వెనక్కి నెట్టి..
-
Ilhan Omar: జాతి నిర్మూలనలో 8వ దశకు చేరింది.. భారత్పై అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!