AP Assembly Sessions 2024: ముగిసిన బీఏసీ.. ఎవరికోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు..!
- ముగిసిన బీఏసీ సమావేశం..
- ఈ నెల 22వ తేదీ వరకు సమావేశాలు నిర్వహిస్తామన్న స్పీకర్..
- ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవన్న సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Assembly Sessions 2024: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు ప్రారంభం అయ్యాయి.. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు బుధవారానికి వాయిదా పడ్డాయి.. రేపు ఏపీ అసెంబ్లీకి సెలవుగా నిర్ణయించారు.. రేపు ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు నిర్వహిస్తారు.. మధ్యాహ్నం 2 గంటల నుంచి కూటమి శాసనసభాపక్ష సమావేశం జరగనుంది.. అయితే, అసెంబ్లీ వాయిదా పడిన వెంటనే బీఏసీ సమావేశం జరిగింది.. ఈ సమావేశానికి హాజరైన స్పీకర్ అయ్యన్నపాత్రుడు, సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, బీజేపీ పక్ష నేత విష్ణు కుమార్ రాజు హాజరయ్యారు..
Read Also: Japan: జపాన్ ప్రధానిగా తిరిగి షిగేరు ఇషిబా ఎన్నిక
Also Read
- Deputy CM Pawan Kalyan: ఏపీ మారుమూల గ్రామాలకు గుడ్న్యూస్.. పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
- AP Aqua Farmers: ఆక్వా రైతులకు గుడ్న్యూస్.. విద్యుత్ సబ్సిడీ, ఫీడ్ ధరల తగ్గింపు..! కీలక ప్రకటన
- AP Economic Growth: ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు..
- Junior Doctors Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ అసెంబ్లీకి రాకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.. అయితే, ఈ నెల 22వ తేదీ వరకూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తాం.. అసెంబ్లీ సమావేశాలు సీరియస్ గా జరగాలి అన్నారు.. రేపు బడ్జెట్ పై అసెంబ్లీ కమిటీ హాల్ లో ఎమ్మెల్యేలందరికీ శిక్షణ తరగతులు ఉంటాయి.. శనివారం కూడా సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.. బిల్లులు, చర్చలకు అనుగుణంగా కొన్ని రోజులు రెండు పూటలా అసెంబ్లీ ఉంటుందన్నారు.. 8 బిల్లులతో పాటు ప్రభుత్వ పాలసీలకు ఆమోదం తెలపాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు.
Read Also: Gowtham Gambhir: న్యూజిలాండ్తో ఓటమిపై తొలిసారిగా మౌనం వీడిన గంభీర్.. ఏం చెప్పాడంటే?
ఇక, బీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ఎవరి కోసమో అసెంబ్లీ సమావేశాలు ఆగవు అని స్పష్టం చేశారు.. ప్రజా సమస్యలపై బాధ్యతాయుతమైన చర్చ జరపడం సభ్యుల బాధ్యతగా పేర్కొన్న ఆయన.. 1995లో తెల్లవారుజామున 4 గంటలకు ముందురోజు రాత్రి భోజనం చేసిన సందర్భాలు ఉన్నాయి అని గుర్తుచేసుకున్నారు.. ఎమ్మెల్యేలు విధిగా అసెంబ్లీకి హాజరు అయ్యే విధంగా సీరియస్ గా తీసుకోవాలన్నారు.. చీఫ్ విప్, విప్ లను రేపు ఖరారు చేస్తాం అని వెల్లడించారు సీఎం చంద్రబాబు.. మరోవైపు.. జనసేన పక్షనేతగా సమావేశానికి హాజరైన మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. తాను స్పీకర్ గా ఉన్న సమయంలో సభలో చంద్రబాబు హుందాతనం చూశానన్నారు.. ఇక, బీజేపీ పక్ష నేత విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ.. కనీసం 15 రోజులైనా అసెంబ్లీ జరగాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.. ప్రజాధనం దుర్వినియోగంతో కట్టిన ఋషికొండపై చర్చ జరగాలన్నారు. ఎమ్మెల్యేలంతా ఓరోజు ఋషికొండ పర్యటన చేపట్టాలని బీఏసీ సమావేశంలో కోరారు విష్ణుకుమార్ రాజు..
తాజావార్తలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
-
Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్ను ‘‘బాగ్దాద్ ఒప్పందం’’ కాపాడలేదు.. ఇప్పుడు ‘‘ఇస్లామిక్ నాటో’’ పరిస్థితి కూడా అంతేనా?
-
KBR Park : కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక వన్వే ట్రాఫిక్.. కొత్త నిబంధనలు అమల్లోకి.!
-
Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..