Gowtham Gambhir: న్యూజిలాండ్తో ఓటమిపై తొలిసారిగా మౌనం వీడిన గంభీర్.. ఏం చెప్పాడంటే?
- ఓటమిపై తొలిసారిగా మౌనం వీడిన గంభీర్..
- లక్ కలిసి రాలేదంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gowtham Gambhir: న్యూజిలాండ్తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్లో 0-3తో ఘోర పరాజయం తర్వాత గౌతం గంభీర్ తొలిసారిగా మౌనం వీడాడు. స్వదేశంలో న్యూజిలాండ్పై 0-3 తేడాతో ఘోర పరాజయం తర్వాత తాను ఎదుర్కొన్న విమర్శలపై భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.. భారత కోచ్గా గౌరవనీయమైన పాత్రను పోషించడం చాలా కష్టమని, అది తనకు తెలుసునని అన్నాడు. న్యూజిలాండ్తో ఓటమి 2012 తర్వాత స్వదేశంలో భారత్కు ఇదే తొలి టెస్టు సిరీస్ ఓటమి కాగా.. ఈ శతాబ్దంలో స్వదేశంలో 0-3 తేడాతో ఓటమి పాలైంది.
Read Also: Hyderabad: ఆరాంఘర్లో అగ్నిప్రమాదం.. స్క్రాప్ గోదాంలో భారీగా మంటలు
Also Read
- Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
- CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
- The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన 'ది ప్యారడైజ్' నైజాం రైట్స్.!
- RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
ఇకపోతే, టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు దాదాపు పది రోజుల ముందే బయల్దేరింది. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో గౌతమ్ గంభీర్ కొన్ని విషయాలను తెలిపాడు. తమకు ఆసీస్ చేతిలో ఓటమి తప్పదని, సీనియర్ ఆటగాళ్లు రోహిత్, విరాట్ ఫామ్పై చేస్తున్న విమర్శలను కోచ్ గౌతమ్ గంభీర్ కొట్టిపడేశాడు. టీమిండియా కుర్రాళ్లకు ఎప్పుడూ మద్దతు ఉంటుందని స్పష్టం చేస్తూనే.. మరోవైపు ఫామ్లో లేని కేఎల్ రాహుల్ పైనా ఆయన స్పందించాడు. మొత్తానికి పెద్దమార్పులేమి లేకుండా ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ కు తాము సిద్ధమని ఆయన తెలిపాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నేపథ్యంలో ఆస్ట్రేలియాలోని పరిస్థితులు ఎదుర్కోవడం చాలా కఠినమని ఆయన అన్నాడు. అక్కడి పరిస్థితులు ఇక్కడితో పోలిస్తే చాలా విభిన్నమన్నారు.
Read Also: Dulquer Salmaan : సెంచరీకి చేరువలో ‘లక్కీ భాస్కర్’
అలాగే, టీమిండియా ఇప్పటికే చాలాసార్లు ఆస్ట్రేలియాలో పర్యటించిన అనుభవం ఉందని.. అది తమకు తప్పకుండా ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు. అలాగే ఆస్ట్రేలియా సిరీస్లో మొదటి బంతి నుంచే దూకుడు ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. మరోవైపు న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ తర్వాత రోహిత్, తన మధ్య దూరం పెరిగిందనే వార్తలూ వచ్చాయని, కివీస్తో అద్భుతంగా పోరాడమని, కాకపోతే లక్ కలిసిరాలేదని అన్నారు. అలాగే రోహిత్ తో నా అనుబంధం చాలా గొప్పగా ఉందని వివరించాడు .
🗣️ We are absolutely keen to go out there, perform, and try and win the series
Head Coach Gautam Gambhir ahead of #TeamIndia's departure to Australia for the Border-Gavaskar Trophy.#AUSvIND | @GautamGambhir pic.twitter.com/MabCwkSPGL
— BCCI (@BCCI) November 11, 2024
తాజావార్తలు
-
Aamir Khan: ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్..అమీర్ ఖాన్ను టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్!
-
Reverse Gear Bikes: రివర్స్ గేర్ ఉన్న టూ వీలర్స్ ఇవే.. పార్కింగ్, ఇరుకైన రోడ్లలో డ్రైవింగ్ ఇక సులువు!
-
CM Chandrababu: గుంటూరులో మహిళపై దాడి ఘటనలో సీఎం సీరియస్.. చర్యలకు ఆదేశాలు..
-
The RajaSaab: థియేటర్లలో నిరాశ.. ఓటీటీలో దుమ్మురేపిన ‘ది రాజాసాబ్’.. ప్రభాస్కు మరో అరుదైన రికార్డు!
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్డేకు భారీ సర్ప్రైజ్?
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?