Minister Atchannaidu: మూడోసారి వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెట్టడం సంతోషంగా ఉందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో 62 శాతం జనాభాకు వ్యవసాయ అనుబంధ రంగాలే ఆధారంగా ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక సౌధానికి వ్యవసాయం మూల స్తంభం.. ఫుడ్ ప్రాసెసింగ్, డిమాండ్ ఆధారిత పంటలకు ప్రాధాన్యత ఇస్తున్నాం.. రైతులకు త్వరలో విశిష్ట గుర్తింపు సంఖ్య ఇస్తామని పేర్కొన్నారు. వాతావరణ హెచ్చరికల ఆధారంగా రైతులకు మెసేజ్ లు పంపుతున్నామని అచ్చెన్నాయుడు వెల్లడించారు.
Read Also:
అయితే, ప్రకృతి వ్యవసాయంలో ఏపీ రోల్ మోడల్ గా నిలుస్తుందని మంత్రి అచ్చెన్న చెప్పుకొచ్చారు. అధిక ఆదాయం కోసం ప్రకృతి వ్యవసాయం ముఖ్యం.. ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. దేశ వ్యవసాయ రంగంలో ఏపీ వాటా 10 శాతంగా ఉంది. అలాగే, 11 వ్యవసాయ పంటలను గ్రోత్ ఇంజిన్లుగా గుర్తించామని : మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
Read Also: Iran Video: ‘‘ఖమేనీ డెత్’’ అంటూ నోరు జారిన రిపోర్టర్.. టీవీ ఛానల్స్ సిబ్బంది తొలగింపు
ఇక, 24 గంటల్లో రైతుల ఖాతాల్లో రూ. 9,000 కోట్లకు పైగా జమ చేశామని అచ్చెన్నాయుడు వెల్లడించారు. ధాన్యం సేకరణ ద్వారా 24 గంటల్లోనే రూ. 10,571 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం.. పీఎం కిసాన్ పథకం కింద రూ. 6,309 కోట్లు చెల్లించాం.. 2026-27 సంవత్సరానికి పీఎం కిసాన్ కోసం రూ. 6,600 కోట్లు కేటాయించామని మంత్రి అచ్చెన్న పేర్కొన్నారు.