NTR Statue in Amravati: అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం, స్మృతి వనం.. ప్లేస్ ఫైనల్ చేసిన కేబినెట్ సబ్ కమిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR Statue in Amravati: అమరావతిలో NTR విగ్రహం, స్మృతి వనం ఏర్పాటుపై కీలక నిర్ణయం తీసుకుంది కేబినెట్ సబ్ కమిటీ.. రాష్ట్ర రాజధాని అమరావతిలో దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగు జాతి గర్వకారణం నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) విగ్రహ ఏర్పాటు, స్మృతి వనం అభివృద్ధిపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం సచివాలయంలో జరిగింది.. ఈ సమావేశానికి మంత్రులు పి. నారాయణ, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్ అలాగే మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాస్ పాల్గొన్నారు.
Read Also: Parakamani Case: పరకామణి కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. అది మనోభావాలు దెబ్బతీయడమే..!
Also Read
- Pramod Sawant: అనుభవం.. స్థిరత్వం.. ఆ తర్వాతే రాజకీయాలు.. 40 ఏళ్ల తర్వాతే పాలిటిక్స్లోకి రావాలి..!
- CM Chandrababu : చంద్రబాబు ఫుల్ బిజీ.. ఉత్తరాంధ్రలో ఒక్కరోజే 3 జిల్లాలు..
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- YS Viveka M*urder Case: వైఎస్ వివేకా కేసులో ఈడీ కీలక ప్రకటన.. అవినాష్ రెడ్డి ఇంట్లో రూ.24 లక్షలు సీజ్
సమావేశంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ నమూనా విగ్రహాలను మంత్రులు పరిశీలించారు. డిజైన్, నిర్మాణం, కాన్సెప్ట్పై మంత్రుల మధ్య లోతైన చర్చ జరిగింది. విగ్రహం తుది రూపు ఖరారు, ఇతర అనుబంధ నిర్మాణాల రూపకల్పన కోసం ప్రభుత్వం ప్రత్యేక ఉపసంఘాన్ని కూడా నియమించింది. అయితే, అమరావతి పరిధిలోని నీరుకొండ గ్రామంలోని కొండపై, నీరుకొండ రిజర్వాయర్ సమీపంలో ప్రభుత్వం భారీగా 3,500 టన్నుల కంచు (Bronze) విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది. ఇది కేవలం విగ్రహమే కాకుండా తెలుగు జాతి వైభవం, తేజస్సు, సాహిత్య గొప్పతనాన్ని ప్రతిబింబించే స్మారకంగా నిలవనుంది అని మంత్రి నారాయణ తెలిపారు.
తెలుగు వైభవం – తెలుగు తేజం కాన్సెప్ట్
విగ్రహ నిర్మాణం “తెలుగు వైభవం – తెలుగు తేజం” అనే సాంస్కృతిక కాన్సెప్ట్తో జరుగుతుందని మంత్రులు వెల్లడించారు. ఈ స్మారక ప్రాజెక్టులో భాగంగా.. ఎన్టీఆర్ మెమోరియల్ లైబ్రరీ, స్మృతి వనం, తెలుగు సాహిత్యం, సంస్కృతి, చరిత్రపై పరిశోధనకు కేంద్రంగా ఓ నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉందని తెలిపారు. విగ్రహ ఏర్పాటు, అనుబంధ నిర్మాణాలపై ప్రజల అభిప్రాయం తీసుకుని తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు AGICL పర్యవేక్షణలో కొనసాగుతోంది. తెలుగు సాహిత్యం పై దృష్టి పెట్టే విధంగా ఎన్టీఆర్ మేమోరియల్ లైబ్రరీ.. స్మృతి వనం… ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నాం అని వెల్లడించారు మంత్రి నారాయణ..
తాజావార్తలు
-
Allu Arjun: అల్లు ఆర్మీకి షాకింగ్ న్యూస్! బన్నీతో సినిమా ఉంటుందా? ఉండదా? సందీప్ బ్రదర్ కామెంట్స్ వైరల్!
-
Cheque Book New Rules 2026: చెక్బుక్ కొత్త రూల్స్.. మీ చెక్పై ఈ సెక్యూరిటీ కోడ్ ఉందా? చెక్ చేసుకోండి!
-
Super EL Nino: ముంచుకొస్తున్న సూపర్ ఎల్నినో ముప్పు.. 100 ఏళ్ల రికార్డ్ బద్దలవుతోందా?
-
Hyderabad: బిల్డింగ్ కుప్పకూలడానికి అసలు కారణం ఇదే.. గచ్చిబౌలి ఘటనలో సంచలన నిజాలు
-
Toxic: టాక్సిక్ సెన్సార్ కట్స్.. నిజంగా షాకింగే!
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!