AP Capital: రాజధాని ప్రాంతంలో నిపుణుల బృందం పర్యటన..
- అమరావతి రాజధాని ప్రాంతంలో ఐఐటీ నిపుణుల బృందం రెండో రోజు పర్యటన..
- ఐకానిక్ భవన నిర్మాణ ప్రాంతాలను సందర్శించిన ఐఐటీ నిపుణులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Capital: అమరావతి రాజధాని ప్రాంతంలో ఐఐటీ నిపుణుల బృందం పర్యటన రెండో రోజు కొనసాగుతోంది.. ఐకానిక్ భవన నిర్మాణ ప్రాంతాలను సందర్శించారు ఐఐటీ నిపుణులు. గత ఐదేళ్ల ప్రభుత్వ నిర్లక్యం వల్ల ఐకానిక్ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసి.. పునాదులు వేసింది నాటి చంద్రబాబు ప్రభుత్వం. గత ఐదేళ్లూ పునాదుల్లో నీళ్లు చేరి చెరువును తలపిస్తోంది ఐకానిక్ సెక్రటేరీయేట్, హెచ్వోడీల నిర్మాణ ప్రాంగణం. పడవల్లో వెళ్లి పునాదులను పరిశీలించారు ఐఐటీ చెన్నై ఇంజనీర్లు. పునాదుల్లో నీళ్లు ఎప్పటి నుంచి ఉన్నాయని సమాచారం సేకరిస్తోన్నారు నిపుణులు. పునాదుల్లో మట్టి, కంకర శాంపిల్స్ తీసుకున్నారు నిపుణులు. ఇన్నేళ్లూ నీళ్లల్లో పునాదులు ఉండిపోవడంతో భవిష్యత్ నిర్మాణాలకు ఎంత వరకు అనువుగా ఉంటుందని పరిశీలిస్తోంది నిపుణుల బృందం.. నిన్న ఐఏఎస్, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను ఐఐటీ హైదరాబాద్ నిపుణులు పరిశీలించిన విషం విదితమే.. అయితే, రాజధాని ప్రాంతంలో నిర్మాణాల పటిష్టతపై త్వరలో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నాయి ఐఐటీ నిపుణుల బృందాలు.
Read Also: Children’s Memory: పిల్లల జ్ఞాపకశక్తిని పెంచే అద్భుత చిట్కాలు..
Also Read
- Tobacco Farmers: పొగాకు రైతులకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల అండ.. కీలక ప్రకటన..
- AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు రెగ్యులర్ బెయిల్
- CM Chandrababu: ఎల్ నినో ప్రభావం.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
- TDP Governor Quota MLC Race: రెండు ఎమ్మెల్సీ స్థానాలు.. 20 మందికిపైగా ఆశావహులు.. టీడీపీలో ఆసక్తికర సమీకరణాలు
ఇక, శుక్రవారం రోజు రాజధాని అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలు పరిశీలించింది ఐఐటీ హైదరాబాద్ నిపుణుల బృందం.. నిర్మాణాల పరిశీలన అనంతరం మీడియాతో మాట్లాడారు ఐఐటీ ప్రొఫెసర్ లు సుబ్రహ్మణ్యం, మున్వర్ భాషా.. భవనాల పటిష్టత, సామర్థ్యం నిర్దారణకు మరికొంత సమయం పడుతుంది.. భవనాల ప్రస్తుత స్థితి, నిలిచి ఉన్న వర్షపు నీటి ప్రభావం, నిర్మాణ సామగ్రి తాజా స్థితి అంచనా వేయాల్సి ఉంటుంది.. సాంకేతికంగా వాటిని పూర్తిగా పరిశీలించాక ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం.. ప్రతీ అంశాన్ని కూలంకుషంగా పరిశీలన చేసి తదుపరి నివేదిక ఇస్తాం.. నిర్మితమైన భవనాల వద్ద టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం.. సామాగ్రిని కూడా పరీక్ష చేయాల్సి ఉంది.. నివేదిక కు ఎంత కాలం పడుతుందన్నది ఇప్పుడే స్పష్టంగా చెప్పలేం.. సాధ్యమైనంత త్వరగానే సీఆర్డీఏకు , ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం అని ప్రకటించిన విషయం విదితమే..
తాజావార్తలు
-
Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే!
-
Virat Kohli Anushka: లండన్లో ఉన్నా భారత్లో పెట్టుబడులు.. మరో లగ్జరీ ఇల్లు సొంతం చేసుకున్న విరాట్, అనుష్క
-
Justin Greaves: టెస్ట్ చరిత్రలో అరుదైన రికార్డు.. ఒక్క పరుగు ఇవ్వకుండా 5 వికెట్లు నేలకూల్చిన వెస్టిండీస్ పేసర్.!
-
Sharmila Dhankhar: పోలియోను జయించి చరిత్ర సృష్టించిన షర్మిలా ధన్ఖర్.. పారా షాట్పుట్లో స్వర్ణం
-
Pavala Shyamala: టాలీవుడ్ లో విషాదం.. సీనియర్ నటి కన్నుమూత..!
ట్రెండింగ్
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్!
-
రూ.1,449కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాలింగ్.. BSNL బ్రాడ్బ్యాండ్ ప్లాన్ అదిరిపోయింది..!
-
15 నెలల వ్యాలిడిటీతో Jio ‘Freedom Pack’.. 1000+ టీవీ ఛానళ్లు, 12 OTTలు ఫ్రీ.!
-
Samsung Galaxy Z Fold 8 Ultra vs Galaxy Z Fold 7: ఏ ఫోల్డబుల్ ఫోన్ బెస్ట్.?
-
Vaibhav Sooryavanshi: నా కల నిజమైంది.. ఇక మరింత రెచ్చిపోతా.. వైభవ్ సూర్యవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!