Pawan Kalyan Tour: గుంటూరు జిల్లాలో పవన్ రైతు భరోసా యాత్రకు అంతా రెడీ
ఇవాళ ఉమ్మడి గుంటూరు జిల్లా లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో కౌలు రైతు భరోసా సభలో పాల్గొననున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. అప్పుల బాధతో మరణించిన 286 మంది కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయల చొప్పన ఆర్థిక సాయం అందించనున్నారు పవన్ కళ్యాణ్. తన పర్యటనలో భాగంగా ఏటుకూరు ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించనున్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ సభ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు జనసేన నాయకులు. కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే…ప్రభుత్వం బాధితుల కుటుంబానికి పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించలేదని విమర్శించారు.
Read Also: Cold in Telangana: ఇదేక్కడి చలిరా నాయనా.. ఒకరోజు తగ్గుతుంది.. మరొకరోజు చంపేస్తుంది
Also Read
- Sajjala Ramakrishna Reddy: ఓట్లు తొలగింపుపై జాగ్రత్త.. వైసీపీ నేతలకు సజ్జల కీలక సూచనలు..
- AP 10th Results: వాహ్!! మీరు సూపర్.. ఒకేసారి పదో తరగతి పాసైన తల్లి కొడుకులు..
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- AP SSC Results 2026: టెన్త్ ఫలితాల్లో సత్తా చాటిన ఎంజేపీ బీసీ గురుకులాలు.. 96.02 శాతం ఉత్తీర్ణత..
మాచర్లలో జరిగిన పరిణామాల నేపథ్యంలో గుంటూరు జిల్లాలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏపీలో రాజకీయాలు వేడెక్కిన వేళ పవన్ యాత్ర పై ఉత్కంఠ నెలకొంది. ఏపీలో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు జనసేన పార్టీ ఎప్పటినుంచో ఆర్థికసాయం అందిస్తుంది. కౌలు రైతు భరోసా యాత్ర పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో జనసేనాని పవన్ కల్యాణ్ రూ.1 లక్ష చొప్పున చెక్కులు పంపిణీ చేస్తున్నారు. పవన్ రాక నేపథ్యంలో పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 200 మందికి పైగా కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్టు తెలుస్తోంది.
వీరి కుటుంబాలకు సత్తెనపల్లి వేదికగా జరిగే కార్యక్రమంలో ఆర్థికసాయం చెక్కులు అందించనున్నారు. సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు సొంత నియోజకవర్గం అని తెలిసిందే. అయితే, ఈ నియోజకవర్గం నుంచి పలువురు నేతలు జనసేనలో చేరతారంటూ కథనాలు వస్తున్నాయి. రేపటి పవన్ సభలోనే ఈ చేరికలు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. పవన్ వారాహి వాహనంపై ఏపీలో వైసీపీ నేతల విమర్శలు భారీస్థాయిలో వచ్చాయి. రాబోయే ఎన్నికలకు వారాహి వాహనం కీలకంగా మారనుంది. పవన్ ఎక్కడినించి పోటీచేసినా ఈసారి మాత్రం ఏపీ అసెంబ్లీలో ఎక్కువమంది జనసేన ఎమ్మెల్యేలు అడుగుపెట్టేందుకు పకడ్బందీ వ్యూహరచన చేస్తున్నారు. పొత్తుల సంగతి ఎలా వున్నా.. పార్టీ పటిష్టతపైనే పవన్ ఫోకస్ పెట్టారని చెప్పవచ్చు.
Read Also:Forbes magazine : ఈ ఏడాది అత్యుత్తమ భారతీయ చిత్రాలివే
తాజావార్తలు
-
Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే…
-
Aadhar Update Charges: ఆధార్ అప్డేట్ చేసుకోవాలా..? అయితే కొత్త ఛార్జీలపై ఓ లుక్కేయండి..
-
West Bengal Exit Poll 2026: బెంగాల్ లేటెస్ట్ ఎగ్జిట్ పోల్.. బీజేపీదే అధికారం..
-
Mangli: వివాదాల నడుమ మంగ్లీ కొత్త సాంగ్ రిలీజ్
-
IPL 2026 సీజన్లో 41 మ్యాచ్ల్లోనే 10 సార్లు 200+ రన్ ఛేజ్.. ఐపీఎల్ స్వరూపాన్నే మార్చేసిన ఒకే ఒక్క రూల్ ఇదే..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!