Minister Ambati Rambabu: అన్ని ప్రాజెక్టుల గేట్లు రిపేర్లోనే.. ఇది వాస్తవం..
రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టుల్లో గేట్లు రిపేర్లలో ఉన్న మాట వాస్తవం అన్నారు ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు… అయితే, ఇవన్నీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏమి జరగలేదన్నారు.. సీఎం జగన్ పై అనవసర ఆరోపణలు చేసి లబ్ధిపొందాలని చూస్తే ఉపయోగం లేదని.. అన్నీ డ్యామ్ల సేఫ్టీ పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు… ఇక, గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు కూరుకుపోవడం వల్ల 700 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళ్లాయి.. నీటి ప్రవాహం అధికం ఉండటం వల్ల రెండు రోజుల నుండి స్టాప్ లాక్ ఏర్పాటు చేయలేక పోయామని తెలిపారు.. కొన్ని గేట్లు బాగాలేదని ఇప్పటికే నివేదిక ఇవ్వటంతో రిపేర్ల కోసం అనుమతి ఇచ్చాం.. గేట్లు బాగుచేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం.. అవసరమైతే నాగార్జున సాగర్ నీటితో రిజర్వాయర్ నింపుతాని వెల్లడించారు అంబటి..
Read Also: Bandi Sanjay: నిఖార్సైన తెలంగాణవాది.. అయితే! సీఎం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి..
Also Read
- AP Cabinet Key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
- AP SSC Results 2026: టెన్త్ ఫలితాల్లో సత్తా చాటిన ఎంజేపీ బీసీ గురుకులాలు.. 96.02 శాతం ఉత్తీర్ణత..
- AP SSC Supplementary Exams 2026: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల..
- Vizag Stock Market Scam: ఫ్యామిలీ మొత్తం కంత్రీ..! స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో రూ.6.5 కోట్లు నొక్కేశారు..
కొందరు కావాలని అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు.. ఐదారేళ్ళ నుండి తుప్పు పట్టడం వల్లే ఈ ఘటన జరిగిందన్నారు మంత్రి అంబటి… రెండు గేట్లు బాగలేకపోవటంతో ఇప్పటికే స్టాప్ లాక్స్ ఏర్పాటు చేశాం.. గత ప్రభుత్వం డ్యాం సేఫ్టీ కోసం రూపాయి ఖర్చు చేయలేదని విమర్శించారు.. రాజకీయంగా ఈ విషయాన్ని వాడుకోవాలని చూడటం సరైనది కాదని హితవుపలికిన ఆయన.. చంద్రబాబు విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఏ పరిశ్రమ ఏపీకి రాకూడదని చంద్రబాబు పూజలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.. ఏపీకి బల్క్ డ్రగ్ పార్క్ వల్ల పర్యావరణ కాలుష్యము ఏర్పడుతుంది.. ప్రాజెక్ట్ వద్దని యనమల రామకృష్ణుడు లేఖ రాశారని మండిపడ్డారు. ఆరు కోట్ల రూపాయలు డబ్బు టీడీపీ డ్యాం కోసం ఖర్చు పెట్టలేక పోయింది.. గత ప్రభుత్వం డ్యాంలను అశ్రద్ద చేయటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు గుండ్లకమ్మలో ఉన్న 3.4 టీయంసీ నీటిలో 2 టీయంసీలు సముద్రంలో విడుదల చేయక తప్పదు.. పులిచింతలలో కూరుకుపోయిన గేట్లు రిపేర్ చేస్తున్నాం.. రాష్ట్రంలో అన్నీ ప్రాజెక్టులలో గేట్లు రిపేర్లలో ఉన్న మాట వాస్తవమే అన్నారు మంత్రి అంబటి రాంబాబు.
తాజావార్తలు
-
Salil Aarora: SRH కు మరో కాటేరమ్మ కొడుకు.. సలీల్ అరోరా ఎవరు..? చరిత్ర చూస్తే పూనకాలే..
-
DJ Sound: డీజే సౌండ్కు 140 కోళ్లు బలి.. కేసు నమోదు..
-
Rishabh Pant: టీమిండియాలో వికెట్ కీపర్ రేస్ హీట్.. రిషబ్ పంత్కు బిగ్ షాక్!
-
Tollywood Star Heroine: అవార్డులా? మాకొద్దు.. డబ్బుంటే పంపండి.. స్టార్ హీరోయిన్ తండ్రి సంచలనం!
-
Bhatti Vikramarka : ప్రజలకు ఇబ్బంది కలగకుండా విద్యుత్ సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యం
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!